breaking news
Ad - Sakshi_Home_Sticky
-
పండుటాకులు విలవిల
● బాబూ.. నీ నిర్వాకం చూడు.. పండుటాకులు విలవిలప్రభుత్వం అందిస్తున్న పింఛను నగదు ఇంటికి రాకుండా అడ్డుకున్న టీడీపీ వైఖరిపై పండుటాకులు, వితంతువులు మండిపడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచన్గా పింఛన్ ఇచ్చే వలంటీర్ వ్యవస్థ ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలకు దూరమవడంతో వారంతాఅసహనానికి గురయ్యారు. నగదు తీసుకునేందుకు మండుటెండలోబ్యాంకులకు వెళ్లిన పింఛనుదారులు రోజంతా పడిగాపులు పడ్డారు.కన్నబిడ్డల మాదిరిగా వలంటీర్లు తమ వద్దకు వచ్చి పింఛను ఇచ్చేవారని..ఇప్పుడు వారిని తొలగించడంతోఈ దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ప్రతిపక్షా ల వైఖరిపై వారంతా ధ్వజమెత్తారు.సాక్షి,పాడేరు: ప్రతినెలా హాయిగా ఇంటివద్ద పింఛను పొందే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేసినట్టు అధికారులు చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా పింఛనుదారులు మండుటెండలో సంబంధిత బ్యాంకులకు చేరుకున్నారు. బ్యాంక్ ఖాతాలు నిర్వహణ లోపం కారణంగా చాలా వరకు వినియోగంలో లేవు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని 52 బ్యాంకుల పరిధిలో 1,08,626 మంది పింఛనుదారుల ఖాతాల్లో అధికారులు నగదు జమ చేశారు. కదల్లేని స్థితిలో ఉన్న 18,809 మందికి ఇళ్లవద్ద అందించేలా ఏర్పాట్లు చేశారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు పడ్డారు. వలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని పింఛనుదారులు దుయ్యబెట్టారు. చింతూరు: మండలంలో 5,169 మంది పింఛనుదారులు ఉండగా వీరిలో 4,419 మంది బ్యాంక్ ఖాతాల్లో నగదు అధికారులు జమచేశారు. మిగతా 750 మందికి ఇళ్లవద్దకు వెళ్లి ఇచ్చేలా గ్రామ సచివాలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మండలంలో కేవలం చింతూరు, మోతుగూడెంలో మాత్రమే బ్యాంకులు ఉన్నాయి. దీంతో సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని మల్లంపేట, నర్సింగపేట, అల్లిగూడెం, దొంగలజగ్గారం వంటి మారుమూల గ్రామాల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వృద్ధులు, వితంతువులు అవస్థలు పడుతూ చింతూరులోని బ్యాంకులకు వచ్చి పింఛనుసొమ్ము తీసుకున్నారు. రానుపోను రూ.200 నుంచి రూ. 300 వరకు ఖర్చయిందని వారు వాపోయారు. హుకుంపేట: పింఛను పొందేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చారు. ఎండతీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. వలంటీర్లను లేకుండా చేసిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెబతామని వారు హెచ్చరించారు. అనంతగిరి: పింఛను పొందేందుకు కాశీపట్నం ఎస్బీఐ వద్ద పింఛనుదారులు పడిగాపులు పడ్డారు. మండలంలో 6,156 పింఛను ఉండగా వీటిలో 5,311 పింఛన్ల సొమ్మును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయగా 845 మందికి నేరుగా వెళ్లి అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధాప్య పింఛనుదారులంతా కాశీపట్నం ఎస్ఐబీ బ్యాంక్ వద్ద రోజంతా పడిగాపులు పడ్డారు.35 కిలోమీటర్ల నుంచి వచ్చా పింఛను సొమ్ము బ్యాంకు నుంచి తీసుకునేందుకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతూరు వచ్చా. పేగ నుంచి ఆటోలో ఏడుగురాళ్లపల్లి చేరుకుని అక్కడినుంచి బస్సులో చింతూరు వచ్చి బ్యాంకులో నగదు తీసుకున్నా. రవాణా, ఇతర ఖర్చులు కలిపి రూ.350 వరకు అయ్యాయి. – సోడె రామయ్య,పేగ, చింతూరు మండలం వలంటీరు సేవలే కావాలి గతంలో ఒకటో తేదీకల్లా వలంటీర్లు ఉదయమే పింఛను సొమ్ము ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. వలంటీర్లను తొలగించడంతో పింఛను సొమ్ముల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మళ్లీ మాకు వలంటీర్ల సేవలు అందుతాయి. – మడకం సోమమ్మ, లచ్చిగూడెం, చింతూరు మండలం రెండు గంటల వరకువేచి ఉన్నా.. పింఛను పొందేందుకు ఎన్నడూలేని విధంగా ఇబ్బందులు పడ్డాం. వలంటీర్లు ఇంటికి వద్దకు తెచ్చి పింఛను ఇచ్చేవారు. ఒకటో తేదీకల్లా అందడంతో ఆర్థిక అవసరాలు తీర్చుకునేవాళ్లం. ఉదయం 10 గంటలకు బ్యాంక్కు వస్తే మధ్యాహ్నం 2 గంటలకు పింఛను తీసుకున్నా. – బి.పరశురాం, దోనిపుట్టు, జరెల, మంచంగిపుట్టు మండలం ఇబ్బంది పెట్టడం సరికాదు ఇంటికి వచ్చి ఇచ్చే పింఛన్లను రాజకీయ కక్షతో అడ్డుకుని రాకుండా చేశారు. ఇప్పుడేమో పింఛను సొమ్ముల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం. పింఛను సొమ్ము కోసం 35 కిలోమీటర్లు దూరంలోని చింతూరు వచ్చా. వృద్ధాప్యంలో ఇన్ని ఇబ్బందులు పెట్టడం సరికాదు. – కూర తమ్మయ్య, పేగ, చింతూరు మండలం ఖాతా డెడ్ అయిందన్నారు పింఛన్ సొమ్ము పొందేందుకు ఉదయాన్నే పాడేరులోని ఎస్బీఐకు వెళ్లాను. బ్యాంకు పుస్తకం చూపిస్తే పరిశీలించిన సిబ్బంది తన ఖాతా డెడ్ అయిందన్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు జెరాక్స్ కాపీలు తెమ్మన్నారు.అవన్ని అందజేస్తే మళ్లీ బ్యాంకు ఖాతాను పునరుద్ధరించిన తరువాత పింఛన్ సొమ్ము జమచేస్తామన్నారు. – షేక్ బీబీ, చింతలవీధి, పాడేరు మండలంనగదు లేక ఇంటికి వెళ్లిపోయా పింఛను తీసుకునేందుకు ఆటో కట్టించుకుని మండల కేంద్రం ముంచంగిపుట్టులోని బ్యాంక్కు వెళ్లా. డబ్బులు తీసుకురావడానికి బ్యాంక్ అధికారులు పాడేరు వెళ్లారని చెప్పారు. గంటల తరబడి వేచి ఉన్నా.. వారు రాకపోవడంతో పింఛను తీసుకోకుండానే ఇంటికి వెళ్లిపోయా. – కొర్ర సోమి, సరియాపల్లి,బంగారుమెట్ట పంచాయతీ, ముంచంగిపుట్టు మండలంవలంటీర్లను అడ్డుకోవడం సరికాదు వలంటీర్లు ప్రతినెలా ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి పింఛను తీసుకువచ్చి ఇచ్చేవారు. దీని వల్ల మాలాంటి వృద్ధులకు ఎంతో మేలు జరిగేది. ఇలా సేవ చేస్తున్న వారిని నిబంధనల పేరుతో అడ్డుకోవడం సరికాదు. పింఛను పొందేందుకు రెండు నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పింఛను సొమ్మే జీవనాధారం. మాలాంటి వాళ్లను ఇబ్బందులు పెట్టడం సరికాదు. – ఎం.మహలక్ష్మమ్మ, వృద్ధురాలు, చింతలవీధి, పాడేరు మండలం● పింఛను పొందేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు మండుటెండలో సమస్యలు ఎదుర్కొన్న వృద్ధులు, వితంతువులు వలంటీర్లను లేకుండా చేయడం వల్లే ఈ దుస్థితి మాపై ఎందుకంత కక్ష చంద్రబాబూ.. అంటూ ఆగ్రహం -
విహారంలో విషాదం
సరదాగా గడిపేందుకు వచ్చిన స్నేహితుల్లో ఇద్దరి ప్రాణాలను సీతపల్లి వాగు బలిగొంది. స్నానం చేసేందుకు దిగిన వారిని మృత్యువు వాగు రూపంలో కబళించడంతో విహారం కాస్తా విషాదంగా మారింది. ఆయా కుటుంబాలకు దిక్కులేకుండా చేసింది రంపచోడవరం: సీతపల్లి వాగు వద్ద సరదాగా గడిపేందుకు వచ్చిన స్నేహితుల్లో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. వాగులో దిగి స్నానం చేస్తుండగా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట గ్రామానికి చెందిన వర్ధనపు రాజ్కుమార్(29), వాస అవినాష్(27), మరో నలుగురి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు గురువారం ఇక్కడికి సమీపంలోని ఐ పోలవరం వద్ద సీతపల్లి వాగు వద్దకు వచ్చారు. ఇదే ప్రాంతంలోని వంతెన దిగువ వైపున వారు స్నానానికి దిగారు. ముసురుమిల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా నీరు ఎక్కువగా ఉన్నచోట దిగడంతో ప్రమాదానికి గురయ్యారు. వీరిలో రాజ్కుమార్, అవినాష్ మునిగిపోతుండగా మిగిలిన స్నేహితులు కేకలు వేశారు. దీంతో సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే వాగు వద్దకు వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు స్ధానికులు మృతదేహాలను బయటకు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీతపల్లి వాగులో మునిగి రెండేళ్ల కాలంలో పది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ లోతైన ప్రాంతం ఉన్నందున పోలీసులు స్నానాలను నిషేధించారు. అయినా పట్టించుకోకుండా వాగులోకి దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సీతపల్లి వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదం నీట మునిగి ఇద్దరు మృతి -
మిన్నంటిన జగన్నినాదం
కొయ్యూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా కొయ్యూరులో గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించిన బైక్ర్యాలీలో జగన్నినాదం మిన్నంటింది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల్లో దడ పుట్టించింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో శ్రేణులు తరలిరావడంతో సందడి నెలకొంది. జై జగన్ నినాదాలతో చింతలపూడి నుంచి కొయ్యూరు వరకు ర్యాలీ భారీగా సాగింది. అరకు ఎంపీ మాధవి, పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఎం.విశ్వేశ్వరరాజు, రాష్ట్ర యువజన విబాగం కార్యదర్శి శెట్టి వినయ్ ఈ ర్యాలీకి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవి, అభ్యర్థి విశ్వేశ్వరరాజు, అరకు పార్లమెంట్ అభ్యర్థి గుమ్మ తనూజారాణి భర్త వినయ్ మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఆయనను ఎదుర్కొనే సత్తా లేని చంద్రబాబు అమలు కాని హామీలతో మేనిఫెస్టోని ప్రకటించి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆయన మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా తనూజరాణిని, ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, నేనుసైతం చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకుడు కె.శివప్రసాద్, వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలు, మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు, చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జె.రాజులమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి గాడి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేగటి ముసిలినాయుడు, సచివాలయ కన్వినర్ సుధాకర్, ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జీ సూరిబాబు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ పొట్టిక పోతురాజు పాల్గొన్నారు. కొయ్యూరులో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ మండుటెండను లెక్కచేయకుండా తరలివచ్చిన పార్టీ శ్రేణులు -
పింఛన్ల పంపిణీలోజిల్లాకు అగ్రస్థానం
● 98.12 శాతంతో రాష్ట్రంలో ప్రథమస్థానం ● కలెక్టర్ విజయసునీత సాక్షి,పాడేరు: ఎన్నికల నియమావళికి లోబడి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో 98.12శాతంతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ ఎం.విజయసునీత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డోర్ టూ డోర్ డెలివరీకి సంబంధించి సాయంత్రం 6.30 వరకు 93.87 శాతంతో రాష్ట్రంలో నాల్గొవ స్థానం, డీబీటీ విధానంలో 98.85 శాతం మేర పంపిణీతో ద్వితీయ స్థానం సాధించామన్నారు. జిల్లాలో 1,27,435 మంది పింఛనుదారులు ఉన్నారన్నారు. వీరిలో 1,08,626 మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛను నగదు జమచేశామన్నారు. మిగిలిన 18,809 మందికి వారి ఇళ్ల వద్దే పంపిణీ చేపట్టామన్నారు.అలాగే జిల్లాకు సంబంధించి డోర్ టూ డోర్ పింఛన్ల పంపిణీలో 98.01శాతం మంది లబ్ధిదారులకు పింఛను నగదు పంపిణీ చేసి ముంచంగిపుట్టు మండలం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జి.మాడుగుల,హుకుంపేట మండలాలు రెండు మూడు స్థానాలు సాధించాయన్నారు. శుక్రవారం నాటికి అన్ని మండలాల్లో నూరుశాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. -
ఈవీఎంలపై అవగాహన
అరుకులోయ రూరల్: రెండోవిడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది, రూట్ అధికారులకు ఈవీఎంల వినియోగంపై ఆర్వో అభిషేక్ అవగాహన కల్పించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందిని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సిన బాధ్యత రూట్ అధికారులపై ఉందన్నారు. ప్రతిఒక్కరు విధుల్లో భాగస్వాములై ఈవీఎంలపై అవగాహన పొందాలని సూచించారు. పోలింగ్ సమయంలో సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019