breaking news
-
వర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి మృతి
శివాజీనగర: బెంగళూరు వర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్లో పీహెచ్డీ చేస్తున్న ఓ విద్యార్థి అనుమానాస్ప రీతిలో చనిపోయాడు. రంగనాథ్ నాయక్ (27) చిక్కబళ్లాపురకు చెందినవారు. ఓ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం బస్సు ప్రమాదంలో రంగనాథ్ గాయపడ్డాడు. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయుర్వేద ఔషధం తీసుకుంటున్నాడు. బుధవారం ఉదయం క్యాంటీన్కు వెళ్లి టిఫిన్ చేసి రూమ్కి వెళ్లి లాక్ చేసుకొన్నాడు. మధ్యాహ్నం రూమ్మేట్ వెళ్లి తలుపులు కొట్టగా తీయలేదు. డోర్ పగలగొట్టి చూడగా రంగనాథ్ మరణించి ఉన్నాడు. మరణానికి కారణాలు తెలియరాలేదు. స్థానిక పోలీసులు మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. రూ. 31 లక్షలు హాంఫట్ ● తుమకూరు జిల్లాలో సైబర్ మోసం తుమకూరు: సైబర్ మోసగాళ్ల చేతిలో పడి అమాయకులు సర్వం కోల్పోతున్నారు. అదే రీతిలో ఎక్కువ లాభం పొందాలని ఓ వ్యక్తి రూ.31 లక్షలు పెట్టుబడి పెట్టి వంచకుల చేతిలో నిలువునా మోసపోయాడు. ఈ సంఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా బైరనాయకనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. వినయ్ అనే వ్యక్తికి ఏప్రిల్ 14న వాట్సాప్కి ఇటీవల ఒక మెసేజ్ వచ్చింది. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పారు. ఇందుకోసం కొన్ని టాస్క్ల లిస్ట్ ఇచ్చారు. దీన్ని నమ్మిన వినయ్ మొదట యూపీఐ ఐడీ కోసం రూ.2 వేలు చెల్లించాడు. కొంతసేపటికి అతని బ్యాంకు ఖాతాకు రూ. 2500 తిరిగి వచ్చాయి. మీరు మరింత డబ్బును పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభం చూడవచ్చని నమ్మించారు. దీంతో దురాశకు పోయిన వినయ్ రూ.31 లక్షలను మోసగాళ్లు ఇచ్చిన వివిధ ఖాతాల్లోకి చెల్లించాడు. అతని ఖాతాలో 13,300 మాత్రమే తిరిగి వచ్చింది. బాధితుడు లబోదిబోమంటూ తుమకూరు సైబర్ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డుపై భార్య హత్య బనశంకరి: భార్యను భర్త చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కోరమంగల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని భార్య ఇందు విడిగా ఉంటోంది. గురువారం మధ్యాహ్నం 3.30 సమయంలో భార్య ఇంటికి భర్త వచ్చి ఘర్షణ పడ్డారు. రోడ్డుపైనే కత్తి తీసి పలుమార్లు పొడిచి చంపాడు. -
60 ఏళ్లలో అన్నీ అస్తవ్యస్తం
కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల కేంద్రం, రాష్ట్రంలో వాతావరణమార్పులు గురించి అధ్యయనం చేసింది. 1960 నుంచి 1990 వరకు, 1997 నుంచి 2017 వరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది రెండు భాగాలుగా చేసి అధ్యయనం చేసింది. సాధారణం కంటే ఎండలు, వర్షం, చలి, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత పెరిగినట్లు తెలిసింది. సరాసరి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విపరీతంగా నగరీకరణ, వనాలను కొట్టివేస్తూ కాంక్రీటు కట్టడాలు రావడం, పరిశ్రమలు, వాహనాల కాలుష్యం, గ్యాస్వినియోగం పెరగడం పట్ల హెచ్చరించింది. వాతావరణ అసమతౌల్యం వల్ల విపరీతమైన ఎండలు వేడి, అకాలవర్షాలు, కరువు వంటివి ఏర్పడుతున్నట్లు తెలిపింది. -
అభ్యర్థి తరపున ఇంటింటా మంత్రి ప్రచారం
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గోకుల్ గ్రామంలో గురువారం ధార్వాడ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి తరపున రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండూరావ్ ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ చెప్పినట్లు నడుచుకునే ప్రభుత్వం అని, ప్రతి ఒక్కరికీ గ్యారెంటీ పథకం అందించడమే నిదర్శనమని, ఈ సారి కాంగ్రెస్కు ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రానికి ఏం న్యాయం చేసిందని ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 26 మంది ఎంపీలను గెలిపిస్తే వారు ఏం చేశారని నిలదీశారు. పన్నుల పంపిణీ, కరువు పరిహారం కోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసినా రాష్ట్ర ఎంపీలు అన్యాయాన్ని సరిదిద్దలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్షాపై కొంచైమెనా ఒత్తిడి చేయలేదని, వీరంతా పిరికిపంద ఎంపీలన్నారు. తమ వాటా పన్నుల నిధుల కేటాయింపునకు కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. కరువు పరిహార నిధులు తక్కువగా విడుదల చేశారన్నారు. దీని కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేసిన ఫలితంగా నిధులు వచ్చాయన్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వం మనకు అవసరమా? అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఈ సారి ఎలాగైనా కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషిని ఓడించాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు యతీంద్ర సిద్దరామయ్య, దీపక్ చించోరే, గ్యారెంటీ యోజన అమలు కమిటీ అధ్యక్షురాలు గీతా తవుషి, సదానంద, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు తీర్చాలని మంత్రికి వినతి
బళ్లారి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థలు, ప్రైవేట్ రంగంలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు కర్ణాటక డ్రైవర్ల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డికి వివిధ సమస్యల పరిష్కారం కోసం గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రిని కలుసుకుని సమాఖ్య జిల్లాధ్యక్షుడు సయ్యద్ ఆజమ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రముఖులు మంత్రి రామలింగారెడ్డిని ఘనంగా సన్మానించారు. యూనియన్ సిరుగుప్ప తాలూకా అధ్యక్షుడు మెహబూబ్ బాషా, మించేరి గ్రామ నేతలు ముజావర్ ముల్లా, ఉపాధ్యక్షుడు అంథోనిరాజ్, జిల్లా కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర మహిళ కార్యదర్శి కవితా తదితరులు పాల్గొన్నారు. -
7న పోలింగ్కు సర్వం సిద్ధం
హొసపేటె: కర్ణాటక లోక్సభ సార్వత్రిక ఎన్నికలు–2024 పోలింగ్ మే 7న జరగనుంది. ఈ నేపథ్యంలో సెక్షన్– 144 ప్రకారం కొన్ని షరతులతో విజయనగర జిల్లా వ్యాప్తంగా 5న సాయంత్రం 6 గంటల నుంచి 8న ఉదయం 6 గంటల వరకు సీఆర్పీసీ–1973 ప్రకారం అమలులో ఉన్న ఇతర చట్టాల మేరకు నిషేధాజ్ఞలను అమలు చేయడానికి జిల్లాధికారి, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ ఎంఎస్ దివాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక లోక్సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను ప్రకటించింది. ఆ ప్రకారం మే 7న పోలింగ్ జరుగుతుంది. విజయనగర జిల్లాలో పోలింగ్ రోజున పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు, మోడల్ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్– 126, ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం షరతులు, అవసరాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఓటర్లను రకరకాల డిమాండ్లను విధించడం, బెదిరించడం, వారికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రేరేపించడం, పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించడం, వివిధ రవాణా మార్గాల ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు పిలిపించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఇతర అవాంఛనీయ సంఘటనల నివారణకు ఈ నిషేధాజ్ఞలను విధించినట్లు ఆయన తెలిపారు. 5 నుంచి 8 వరకు జిల్లాలో నిషేధాజ్ఞలు విజయనగర జిల్లాధికారి దివాకర్ వెల్లడి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019