breaking news
-
ఆరోగ్యమస్తు
జిల్లాలో కొత్తగా ఉండి మండలం కలవపూడి, భీమవరం రూరల్ పెన్నాడ అగ్రహారం, ఆకివీడు మండలం గుమ్ములూరు, మొగల్తూరు మండలం కాళీపట్నంలో కొత్త పీహెచ్సీలు మంజూరు చేశారు. సుమారు రూ.12 కోట్లతో మంచిలి, ముదునూరు, లంకలకోడేరు, మేడపాడు, ఆచంట వేమవరం, కాళ్ల పీహెచ్సీలకు ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. పాలకొల్లులో రూ.13.50 కోట్లతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి పనులు పూర్తి కావస్తుండగా త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. నరసాపురంలో 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
భవిష్యకు ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్
భీమవరం: భీమవరం పట్టణానికి చెందిన దాట్ల భవిష్య 1411 ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ కై వసం చేసుకుంది. అఖిల భారత చదరంగం సమాఖ్య, ప్రపంచ చదరంగం సమాఖ్య సంయుక్తంగా మే 1వ తేదీన విడుదల చేసిన చదరంగం ఫైడ్ రాపిడ్ రేటింగ్ జాబితాలో భవిష్య రేటింగ్ కై వసం చేసుకుందని నేషనల్ కోచ్ మాదాసు కిషోర్ చెప్పారు. గురువారం పట్టణంలోని అనసూయ చెస్ అకాడమీలో భవిష్యను అభినందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో మొట్టమొదటి మహిళా రేటింగ్ చెస్ ప్లేయర్గా నిలవడం విశేషమన్నారు. భవిష్య చినఅమిరంలోని విశ్వకవి స్కూల్లో 8వ తరగతి చదువుతూ అనసూయ అకాడమీలో శిక్షణ పొందుతోందన్నారు. రూ.లక్ష నగదు చోరీ ఆకివీడు: పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ జరిగి రూ.లక్ష నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక మట్టా వారి వీధిలో నివశిస్తున్న కొవ్వాడ రాంబాబు తన ఇంట్లో రూ. లక్ష రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకుపోయారని గురువారం ఫిర్యాదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ జీ.దివాకర్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఎస్ఈబీ తనిఖీలు ఏలూరు టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈబీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో పలు చోట్ల గురువారం విస్తృతంగా తనిఖీలు చేశారు. 18 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 8 చోట్ల కార్డెన్సెర్చ్ నిర్వహించారు. 16 కేసులు నమోదు చేసి 55 లీటర్ల నాటు సారా, 2800 లీటర్ల బెల్లపుఊట స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. 70.3 లీటర మద్యం స్వాధీనం చేసుకున్నారు. 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై చింతమనేని వర్గీయుల దాడి
పెదవేగి: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు మరోసారి దాడులకు తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. దెందులూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి గురువారం కొప్పాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఈ ప్రచారంలో విజయరాయికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు మట్టా శంకర్, మరి కొందరు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం వీరు విజయరాయికి తిరిగొస్తుండగా, అప్పటికే గ్రామంలో ప్రచారం చేస్తున్న చింతమనేని ప్రభాకర్ వీరిని ఉద్దేశించి మాట్లాడుతూ మీరేంట్రా జెండాలు కట్టుకుని తిరుగుతున్నారంటూ బూతులు తిడుతూ అతని అనుచరులు కొడాలి శంకర్ తదితరులను రెచ్చగొట్టి దాడి చేయించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల బైక్లపై ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి చిత్రాలు ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తమ అనుచరులపైనే దాడి చేశారంటూ ఆరోపిస్తూ చింతమనేని తన వర్గీయులతో కలిసి విజయరాయిలో ధర్నా డ్రామాకు తెరతీశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ ఘటన అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి టీడీపీ వర్గీయులు వెళ్లగా, ఏలూరు టూటౌన్ ఎస్సై సాధిక్ ఎన్నికల సమయంలో ఇంత మంది ఆస్పత్రిలో ఉండకూడదని కొంతమందిని ఆసుపత్రి నుంచి పంపే ప్రయత్నం చేయగా, ఎస్సైపై కేకలు వేస్తూ చింతమనేని వర్గీయులు హడావిడి చేశారు. -
జగన్ రైతుల పక్షపాతి
సీఎం వైఎస్ జగన్ రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. విత్తనం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకు ప్రభుత్వం రైతు వెన్నంటే ఉండి పనిచేసే విధంగా చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. జగన్కు రైతులు రుణపడి ఉంటారు. – బైనపాలెం పండు, ఎల్బీ చర్ల అప్పుల భారం లేదు పెట్టుబడి సాయం కింద సీఎం వైఎస్ జగన్ ప్రతి రైతుకి ఏడాదికి రూ.13,500 సాయం అందిస్తుండటంతో రైతులకు అప్పులభారం లేదు. గతంలోని ప్రభుత్వాలు ముందస్తు సాగు చేయమని చెప్పడమే తప్ప ఏనాడు రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది లేదు. – ముప్పిడి కుమార్, గుంపర్రు పెంపు హర్షణీయం ఐదేళ్లుగా నాకు ఏటా రూ. 13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా సాయం అందుతోంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎంతో ఉపయోగపడుతుంది. వచ్చే సీజన్ నుంచి రూ. 16000 చేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటించడం హర్షణీయం. – చుండ్రు వెంకట సత్యనారాయణ, రైతు, వేల్పూరు, తణుకు మండలం కొనసాగింపు.. మంచి నిర్ణయం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా మంచి నిర్ణయం. ఇప్పటివరకు ఏటా రూ.13,500 చొప్పున అందేవి. రానున్న ఐదేళ్ల పాటు ఏటా రూ.16 వేలు జమ చేస్తామని ప్రకటించడం అభినందనీయం. – సలుమూరి గోవిందరావు, రైతు, అత్తిలి జగన్ పాలనే రైతులకు భరోసా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన రైతులకు భరోసా ఇస్తుంది. ఇటీవల మేనిఫెస్టోలో రైతులకు భరోసానిస్తు జగన్ చేసిన ప్రకటనలు రైతులకు మరింత ఆనందాన్నిస్తున్నాయి. ఏడాదికి రూ.16,000 చొప్పున ఐదేళ్లలో రూ.80 వేలు ఇస్తానని ప్రకటించడం ఆనందదాయకం. – చిత్తలూరి రామకృష్ణ, బొండాడ -
కుల గణనను వ్యతిరేకించే కూటమిని ఓడించండి
ఆకివీడు: రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు ఆరోపించారు. స్థానిక ఏఎంసీ చైర్మన్ రసూల్బీబీ నివాసంలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ కులగణనకు బీజేపీ పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. కూటమిగా ఏర్పడిన ఆ పార్టీలు కులగణనకు బీజేపీని ఒప్పించగలరా అని డిమాండ్ చేశారు. తాము కులగణనకు వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నప్పటికీ ఆ పార్టీతో కూటమి కట్టిన జనసేన, టీడీపీలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. 2019లో రాష్ట్రంలో ప్రజలిచ్చిన తీర్పును 2024లో పునరావృతం చేయనున్నారని చెప్పారు. బీసీల్ని మోసగించిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బీసీ కులస్తులు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అమలు చేయలేని వాగ్దానాలతో కొన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమైతే, అమలుజేసిన పథకాల్ని మరింత పటిష్టంగా అమలుజేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీసీలకు వైఎస్సార్ సీపీ అగ్రస్థానం కల్పించిందని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్ని అఽధికంగా బీసీలకు కేటాయించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీలంతా నమ్ముతున్నారని చెప్పారు. ఏఎంసీ చైర్మన్ రసూల్బీబీ మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం కల్పించిన వైఎస్సార్ సీపీకి వచ్చే ఎన్నికల్లో బీసీలంతా మద్దతు పలికి అత్యధిక మెజార్టీ కల్పిస్తారని చెప్పారు. ఉండి అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ నాయకులు ఊడిగ శ్రీనివాస్, తోట శివాజీ, రాజులపూడి వెంకటేశ్వరావు, గంగయ్య, సందా కేశవరావు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు పిలుపు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019