breaking news
-
చోరీ కేసులో ఏడాది జైలు
కె.గంగవరం: మండలంలోని సత్యవాడ గ్రామంలో గత ఏడాది చోటు చేసుకున్న చోరీ కేసులో నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్టు కె.గంగవరం ఎస్సై ఎస్కే జానీ బాషా గురువారం విలేకరులకు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 2023 నవంబర్ 30న మండలంలోని సత్యవాడ గ్రామంలో రామేశ్వరపు వీరవెంకట సత్యనారాయణ కుటుంబం ఇంటిలో లేని సమయంలో బంగారు, వెండి వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకుపోయారు. ఎస్సై జానీబాషా కేసును దర్యాప్తు చేసి ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచారు. ఏపీపీ బి.రామతులసి వాదనలతో నిందితులు పిల్లి సురేష్, ఉండి శివ సుబ్రహ్మణ్యం, బొగడ శ్రీనులపై నేరం రుజువు కావడంతో రామచంద్రపురం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ జస్టిస్ వి.నాగేశ్వరరావు నాయక్ ఒక్కొక్కరికీ ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి నేరస్తులకు శిక్ష వేయించిన ఎస్సై జానీబాషా, ఏఎస్సై రాంబాబు, సిబ్బంది లక్ష్మణ్, కామేశ్, ఛాయారత్నంలను ఎస్పీ ఎస్.శ్రీధర్, డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐ పి.దొరరాజు అభినందించారు. -
జనాభా వివరాలు
నియోజకవర్గం : కాకినాడ సిటీ హిందువులు 1,90,000 ముస్లింలు 25,000 క్రిస్టియన్లు 25,000 పురుషులు 1,23,247 మహిళలు 1,32,327 వృద్ధులు 60,000 యువకులు 9,000 ఉద్యోగులు 10,000 వ్యాపారులు 30,000 రైతులు 5,000 కూలీలు 25,000 రెడ్డి 5,000 కమ్మ 7,000 కాపు 40,000 బీసీ 1,25,000 ఎస్సీ 15,000 ఎస్టీ 2,000 -
సబ్ జైలులో ములాఖత్ సమయం మార్పు
కాకినాడ లీగల్: తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కాకినాడ సబ్ జైలులోని ముద్దాయిలను వారి బంధుమిత్రులు కలిసే (ములాఖత్) సమయం మార్చారు. జైళ్ల శాఖ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ మార్పు చేసినట్లు కాకినాడ స్పెషల్ సబ్ జైల్ డిప్యూటీ జైలర్ జోసఫ్ గురువారం తెలిపారు. ముద్దాయిలను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ కలిసేందుకు అవకాశం కల్పించారు.పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి కాకినాడ సిటీ: జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ జారీ చేశామని జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి, శిక్షణ అధికారి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయా ఉద్యోగులకు సూచించారు. ఇప్పటికే నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో పోలింగ్ సిబ్బంది, పీఓ, ఏపీఓ, ఓపీఓ, డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఇతర సిబ్బంది ఫారం 12, 12డి ద్వారా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ పని చేస్తూ, వేరే జిల్లాలో ఓటు హక్కు కలిగిన సిబ్బందికి ఈ నెల 7, 8 తేదీల్లో కాకినాడ ప్రభుత్వ పీఆర్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ కోరారు. జగన్ మళ్లీ సీఎం అయితేనే పేదలకు మేలు ● వైఎస్సార్ సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ● ముద్రగడ పద్మనాభం పిలుపుకిర్లంపూడి: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే పేదలకు మేలు జరుగుతుందని వారి ఊపిరి నిలుస్తుందని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు కడుపు నిండా భోజనం అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన నివాసంలో వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ పిలుపుతో జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆయన నివాసం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే, ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు రాజకీయ జీవితం ప్రసాదించారని అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ అవకాశం ఇస్తే ప్రత్తిపాడు ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ముఖానికి రంగులు వేసుకునే వాళ్లను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గానికి సేవ చేసే వంగా గీత గెలుపు పిఠాపురంలో తథ్యమని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి, యువత ఉపాధికి సీఎం పెద్దపీట వేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పిఠాపురంలో వైఎస్సార్ సీపీకి అత్యధిక మెజార్టీ ఇవ్వడం ద్వారా సీఎం దృష్టిని ఆకర్షించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. యువత ఉపాధి కల్పనే ప్రధాన ధ్యేయంగా ఉన్న చలమలశెట్టి సునీల్ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ, ముద్రగడ పిలుపుతో వేలాదిగా ప్రజలు రావడానికి ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కుటుంబం చేసిన కృషే కారణమని అన్నారు. ముద్రగడ సారథ్యంలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి, గెలిపించాలని అభ్యర్థించారు. -
పెన్షనర్స్ ప్యారడైజ్
● రెండో మద్రాస్గా ఘనకీర్తి ● ఆహ్లాదాన్నిచ్చే సుందర సాగరతీరం● జిహ్వచాపల్యం తీర్చే కోటయ్య కాజా, సుబ్బయ్య హోటల్తొలిగా కాకి నందవాడ అనే పేరుగల ఈ ప్రాంతం డచ్ వలసప్రాంతంగా వుండేది. వాళ్లు చీరల నిల్వ, ఎగుమతి స్థావరంగా వాడేవారు. చీరలను తెలుగులో ‘కోక’ అంటారు కాబట్టి కోకనాడ అనే పేరు వచ్చింది. బ్రిటిషు వారి పాలనలో, తొలి కెనడా బాప్టిస్టు మిషన్ స్థాపించిన తరువాత కో–కెనడాగా పిలిచారని కూడా చెపుతారు. బ్రిటిషు వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకెనడాగానే ఉన్నాయి. ఉదాహరణ– కోకెనాడ చాంబర్ ఆఫ్ కామర్స్, జేఎన్టీయూకేలోని కొన్ని శిలా ఫలకాలు, రైల్వే స్టేషన్ల క్లుప్తాక్షరాలు (కాకినాడ పోర్టు– సీఓఏ, కాకినాడ టౌన్ – సీసీటీ). అలాగే దగ్గరలో కోరింగ నదికి ఓడరేవు వుండటం వలన కోరింగ అనే పేరు కూడా ఈ ప్రాంతానికి వినియోగంలో ఉండేది. స్వాతంత్య్రం తరువాత కాకినాడ అనే పేరు స్థిరపడింది. మరో విధంగా.. కలియుగంలో ఇది పెద్ద అరణ్యం దీనిని కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతమ్మను కోయిల రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించినందున, కాక అనే ఇక్ష్వాకు రాజు ఈ ఊరిని స్థాపించినందున, తీరంలో చేపలు పట్టే కాకులున్నందున కూడా కాకినాడ అనే పేరు వచ్చిందనే కథనాలున్నాయి. రాజకీయ ప్రాబల్యం చూస్తే.. కాకినాడ సిటీ నియోజకవర్గం భవిష్యత్ను నిర్దేశించేది మాత్రం, మత్స్యకారులు, కాపు కులస్తులే, ఇక్కడ దాదాపు 35 నుంచి 40 వేల మంది మత్స్యకారులు, 40 వేల వరకూ కాపు కులస్తులు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆయా అభ్యర్థులు విజయం సాధించేవారు. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభల కోసం జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖులు ఇక్కడ వచ్చారు. ఎన్నికల పోరు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం 2008 ఏర్పాటైంది. అప్పటి వరకూ కాకినాడ నియోజకవర్గం ఉన్న పునర్విభజనలో కాకినాడ సిటీ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. కాకినాడ కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండేవి. పునర్విభజనకు ముందు ఈ డివిజన్లు అన్నీ కాకినాడ నియోజకవర్గంలో ఉండేవి. కాకినాడ రూరల్ నియోజకవర్గం వచ్చిన తర్వాత 8 డివిజన్లు రూరల్ నియోజవర్గంలో కలిసిపోయాయి. ● 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి 9279 ఓట్లుతో విజయం సాధించారు. ఆయనకు 44,606 ఓట్లు పడగా, పీఆర్పీ అభ్యర్థి బందన హరికి 35,327 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబుకు 25, 636 ఓట్లు పడ్డాయి. ● 2014లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు 24 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొండబాబుకు 76,467 ఓట్లు రాగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి 52, 467 ఓట్లు వచ్చాయి. ● 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విజయం సాధించారు. ఆయనకు 73,890 ఓట్లు. టీడీపీ ప్రత్యర్థి వనమాడి కొండబాబుకు 59,779 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గ ప్రత్యేకతలు కాకినాడ తూర్పు తీరంలో ఉంది. కేజీ బేసిన్లో చమురు అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలు, పెట్రో రసాయనాలు పెట్టుబడి ప్రాంతం. ఒకప్పుడు కాకినాడను రెండో మద్రాసుగా పిలిచేవారు. కోకెనాడగా గుర్తింపు వచ్చింది. ● కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ పెన్షనర్ ప్యారడైజ్గా పేరొందింది. రిటైర్ అయిన తర్వాత ఎంతో హాయిగా జీవించే నగరంగా కాకినాడకు గుర్తింపు ఉంది. ● కాకినాడ తీరంలో రెండు పోర్టులు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం పరంగా యాంకరేజ్పోర్టు కాగా, రెండోది ప్రైవేటు సంస్థ నిర్వహణలోని డీప్ వాటర్ పోర్టు. కాకినాడలో పోర్టు నుంచి ఇతర దేశాలకు బియ్యం, బొగ్గు, ఎగుమతులు జరుగుతాయి. దీని ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తోంది. ● బ్రిటిష్ కాలం నాడు నిర్మించిన కాకినాడ జిల్లా కలెక్టరేట్ నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ● కాకినాడలో ఉన్న జీజీహెచ్ ఇంజినీరింగ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలకు ఆరోగ్య ప్రదాయిని. ఇక్కడ ప్రతి రోజు వేలాది మంది రోగులకు అత్యాధునిక వైద్యం అందిస్తారు. ● కాకినాడలో జేఎన్టీయూ కళాశాల ఉంది. ఇది 1946లో స్థాపించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీనికి యూనివర్సిటీ స్థాయి కల్పించారు. ● కాకినాడ నగరంలో ఎంతో మంది విద్యాదాతలు ఉన్నారు. వీరిలో మల్లాడి సత్యలింగ నాయకర్, పిఠాపురం రాజా ఇచ్చిన వందలాది ఎకరాల్లో కాకినాడలో విద్యాసంస్థలు నెలకొల్పారు. ఎంఎస్ఎన్ చార్టీస్, పీఆర్ కళాశాలలు నేటికీ నడుస్తున్నాయి. వీటిలో ఎంతో మంది మహనీయులు తమ విద్యాభ్యాసం చేశారు. ● కాకినాడ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేది కోటయ్య కాజా, భోజన ప్రియులకు ఎంతో ఇష్టమైన సుబ్బయ్య హోటల్ కూడా ఈ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ● కాకినాడ సమీపంలోని కోరంగి మడ అడవులు కూడా ఈ ప్రాంత విశిష్టతను చాటి చెప్తున్నాయి. కాకినాడను ఆనుకుని ఉన్న సుందరమైన బీచ్ ప్రాంతం సందర్శకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బీచ్ను ఆనుకుని ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్ వంటి ఎరువుల కర్మాగారాలు, జీఎస్పీసీ నిర్వహణలోని గ్యాస్ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. – బోట్క్లబ్ (కాకినాడ సిటీ) ప్రభుత్వ పథకాలతో ఎనలేని లబ్ధిపథకం లబ్ధిదారులు సొమ్ము వైఎస్సార్ పింఛన్ కానుక 31,136 రూ.293.19 కోట్లు వైఎస్సార్ ఆసరా 37,160 రూ.648.73 కోట్లు వైఎస్సార్ చేయూత 15680 రూ. 94.38 కోట్లు జగనన్న అమ్మ ఒడి 1,06,881 రూ. 147.30 కోట్లు జగనన్న విద్యాదీవెన 26,770 రూ. 17.68 కోట్లు జగనన్న వసతి దీవెన 13,488 రూ.12.49 కోట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 52.74 రూ.19.40 కోట్లు వైఎస్సార్ వాహనమిత్ర 28.40 రూ.8.08 కోట్లు వైఎస్సార్ పెళ్లికానుక 95 రూ.0.59 లక్షలు వైఎస్సార్ బీమా 279 రూ.4.23 కోట్లు వైఎస్సార్ కాపు నేస్తం 37.65 రూ.29.43 కోట్లు జగనన్న చేదోడు 1646 రూ.4.77 కోట్లు నియోజకవర్గ సమాచారం పురుషులు 1,23,247 మహిళలు 1,32,327ట్రాన్స్జెండర్లు – 142 -
మాపై ఈ పగ ఏల?
3 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దనే వలంటీర్ రూ.3 వేల వృద్ధాప్య పింఛన్ అందించేవారు. టీడీపీ వాళ్లు కేసు వేశారని, వలంటీర్లు డబ్బులు పంపిణీ చేయవద్దని చెప్పారట. గత నెలలో గ్రామ సచివాలయానికి మండుటెండలో వెళ్లి ఎలాగోలా తెచ్చుకోగలిగా. ఈ నెలలో మూడు కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లి ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఎండలో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నేను తట్టుకోగలనా? మాలాంటి వారి బాధను అర్థం చేసుకొని ఎప్పటిలానే వలంటీర్ ద్వారా నగదు పంపిణీ చేయాలి. – కె.ఝూన్సీ, సాంబమూర్తి నగర్, కాకినాడ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చారు నాకు అమలాపురం స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. గతంలో ముద్రా రుణం తీసుకున్నాను. కొన్నాళ్లు సక్రమంగా రుణం చెల్లించాను. తర్వాత ప్రమాదంలో నా రెండు కాళ్లూ కాలిపోయాయి. దీంతో బ్యాంకు రుణం చెల్లించలేకపోయాను. ప్రస్తుతం జగనన్న ఇస్తున్న పింఛను పైనే ఆధారపడి జీవిస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు కుట్రతో మా పింఛను సొమ్ము బ్యాంకులో వేశారని చెప్తే.. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాను. నేను రుణం చెల్లించాలంటూ పింఛను డబ్బుల్లో రూ.2 వేలు బాకీకి జమ చేసుకుని రూ.1,000 మాత్రమే ఇచ్చారు. మావంటి పేదలకు వలంటీర్ల ద్వారానే పింఛన్లు పంపిణీ చేస్తే బాగుంటుంది. – కె.కృష్ణవేణి, కాకినాడ ● పింఛన్ల కోసం పండుటాకులకు తప్పని అగచాట్లు ● గత నెలలో సచివాలయాలు.. నేడు బ్యాంకుల వద్ద పడిగాపులు ● చంద్రబాబు కుట్రలపై అభాగ్యుల ఆగ్రహంకాకినాడ సిటీ: రెండు నెలల కిందటి వరకూ.. వానొచ్చినా.. వరదొచ్చినా.. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. ఒకటో తేదీ తెల్లవారుజామునే అత్యధిక శాతం మంది పింఛను సొమ్ము ఠంచనుగా ఇళ్ల వద్దనే అందుకునేవారు. నాడు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్న వలంటీర్ల సేవలే దీనికి కారణం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాల కారణంగా.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత నెల నుంచి పింఛన్ల పంపిణీ విధులకు వలంటీర్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫలితంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రెండు నెలలుగా పింఛను సొమ్ముల కోసం తీవ్ర అగచాట్లకు గురవుతున్నారు. తమపై ఇంత పగ దేనికని చంద్రబాబు అండ్ కోను వారు ప్రశ్నిస్తున్నారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని ‘పచ్చ’ బ్యాచ్ నిలిపివేయించడంతో లబ్ధిదారులు గత నెలలో మండుటెండలో సచివాలయాల వద్దకు వెళ్లి వైఎస్సార్ పెన్షన్ కానుక నగదు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా వృద్ధులు నానా ఇక్కట్లూ పడ్డారు. కొంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ దయనీయ పరిస్థితి చూసి అయ్యో పాపం అనుకుని.. ఎప్పటిలానే వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీకి చంద్రబాబు అండ్ కో సానుకూలంగా స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, చంద్రబాబు అండ్ కో మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి సమస్యను మరింత జటిలం చేశారు. ఫలితంగా ఈ నెల, వచ్చే నెలలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేసేలా కొత్త విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేస్తోంది. ఈ క్రమంలో తమ ఖాతా ఉందో.. ఉంటే అది సజీవంగా ఉందో లేదో.. అందులో పింఛను సొమ్ము పడిందో లేదో తెలియక పలువురు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్లే తమకు ఇప్పుడు ఈ ఇబ్బందులు వచ్చాయని పింఛన్దారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వలంటీర్లు నిస్వార్థంగా ప్రతి ఇంటి గడప ముందుకు వచ్చి పెన్షన్లు అందించేవారని, దీనివలన ప్రజల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు రావడం చూసి ఓర్వలేకే విపక్షాలు ఈవిధంగా కుట్ర చేశాయని ధ్వజమెత్తుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో 2,13,195 మందికి.. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యం పాలైన వారికి, బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కాని వారికి ఇళ్ల వద్దనే సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఈ నెలలో 2,80,662 మంది లబ్ధిదారుల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.83.16 కోట్లు విడుదల చేసింది. దీనిలో 2,13,195 మందికి ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు. ఎవరికై నా నగదు జమలో ఇబ్బందులు ఎదురైతే శుక్రవారం నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నారు. మిగిలిన 67,467 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి రూ.19.20 కోట్ల నగదును బుధవారం నుంచి ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి 90 శాతం పంపిణీ పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల వద్దకు పరుగు అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో వేయడంతో.. ఆ మొత్తం జమ అయ్యిందో లేదో తెలియక గురువారం ఉదయం వరకూ పలువురు తీవ్రంగా ఆందోళన చెందారు. జిల్లా అధికారుల సూచనలను పలుచోట్ల బ్యాంకుల అధికారులు పట్టించుకోకుండా పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు రుణం ఉందని, దానికి పింఛను సొమ్ము జమ చేసుకున్నామరి కొందరికి.. డబ్బులు తీసుకోవాలంటే చెక్ బుక్ తీసుకోవాలని కొందరిని.. ముద్రా రుణాలు తీసుకున్నందున వాటికి ఈ సొమ్ము జమ చేస్తున్నామని మరికొందరిని పలుచోట్ల బ్యాంకుల అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో పింఛన్ సొమ్ము ఇచ్చి పంపించారని మరికొందరు చెప్పారు. ఇదిలా ఉండగా 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్న మండుటెండల్లో సైతం లబ్ధిదారులు అనేక కష్టాలు పడుతూ బ్యాంకులకు పరుగు తీయడం అనేక చోట్ల కనిపించింది. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొన్న కష్టాలను చంద్రబాబు అండ్ కో పునరావృతం చేసిందని పలువురు వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా దుర్మార్గం నాకు సామర్లకోట బ్యాంకులో అకౌంట్ ఉంది. మేము కాకినాడలో ఉంటున్నాను. ఇక్కడి నుంచి ఎన్నో వ్యయప్రయాసలతో ఉదయమే సామర్లకోట బయలుదేరి వెళ్లాను. పింఛను తీసుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. చాలా ఇబ్బందులు పడ్డాను. నిస్వార్థంగా పని చేస్తున్న వలంటీర్లపై టీడీపీ, జనసేన నాయకులు కక్ష కట్టడం చాలా దుర్మార్గం. వారి కుట్రలకు వృద్ధులు, దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. – సీహెచ్ గ్రేస్, కాకినాడ ఏ బ్యాంకుకు వెళ్లాలో తెలియక.. ఏ బ్యాంకుకు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను. వయస్సు అయిపోయినవాళ్లం ఎక్కడికి పోవాలి. చంద్రబాబు నాయుడు చేసిన పనికి వృద్ధులం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆయనకో దణ్ణం నాయనా! ఇలాంటోడు సీఎం అయితే మా బతుకులు తెల్లారినట్టే. మాలాంటి వృద్ధులను నానా ఇబ్బందులకూ గురి చేస్తున్న చంద్రబాబు నాయుడు రూ.4 వేల పెన్షన్ ఇస్తానంటే ఎలా నమ్మగలం? – బి.చక్రవర్తి, కాకినాడ 9 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే కానీ.. ప్రతి నెల వేకువజామునే ఇంటి వద్దకు వలంటీర్లు పింఛను తీసుకునివచ్చి ఇచ్చేవారు. గత నెలలో ఎండలో సచివాలయానికి వెళ్లి తీసుకోవలసి వచ్చింది. ఈ నెలలో పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో వేశారని సమాచారం వచ్చింది. దీంతో మా ఊరి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోని తిమ్మాపురం బ్యాంకుకు ఎండలో వెళ్లి పింఛను సొమ్ము తెచ్చుకోవలసి వచ్చింది. బ్యాంకులో ఖాళీ లేదు. సుమారు రెండు గంటలు పట్టింది. ఇంటి వద్దనే పింఛను ఇవ్వాలి. – బక్కి మరియమ్మ, పవర, సామర్లకోట మండలం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019