breaking news
-
బాబూ.. నీ నిర్వాకం చూడు
● 2014–19 మధ్య కాలంలో కష్టాలను మళ్లీ గుర్తుకు తెచ్చాడు ● ఆరగ్రహం వ్యక్తం చేస్తున్న సామాజిక పింఛన్ లబ్ధిదారులు ● పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు ● బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్న అవ్వతాతలు ● కొన్ని చోట్ల సర్వర్లు మొరాయించడంతో అవస్థలు ● బ్యాంకు ఖాతాలు బ్లాక్లో ఉండటంతో చిక్కులు సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల వేళ చంద్రబాబు నయవంచక కుట్రతో మళ్లీ పాత రోజులు పునరావృతమయ్యాయి. దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలున్న వారు, ఏ పని చేసుకోలేక ఆసరా కోసం సమాజం వైపు ఆశగా ఎదురుచూసే పండుటాకులు మళ్లీ రోడ్డున పడ్డారు. ఎటు చూసినా కన్నీటి వేదనలే కనిపిస్తున్నాయి. ఏ బ్యాంకుకు వెళ్లి చూసినా అలసిన పండుటాకుల ఆవేదనే వినిపిస్తోంది. ఈ వయసులో తమను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తావంటూ చంద్రబాబును అవ్వాతాతలు దూషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాబందుల్లా పీక్కుతినే జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి ప్రతి రోజూ క్యూలో నిలబడితే తప్ప పింఛన్ దక్కని దుస్థితి ఉండేది. పక్షం రోజులు దాటినా పింఛన్ అందక విలవిల్లాడే దయనీయ పరిస్థితి, కన్నీటి వేదనలు ఏ ప్రాంతంలో చూసినా సాక్షాత్కరించేవి. ఈ పరిస్థితిని మార్చమని అవ్వాతాతలు దేవుడిని ప్రతి రోజూ కోరుకునేవారు. కాలం మారింది.. పాలనా మారింది. అవ్వాతాతలకు అండగా నిలుస్తూ వారి మోముల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిరునవ్వులు నింపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థతో ఇంటి వద్దే పింఛన్ అందజేస్తూ.. వారికి కొండంత భరోసానిచ్చారు. అయితే ఎన్నికల వేళ చంద్రబాబు కుటిల రాజకీయాలతో వృద్ధులు మళ్లీ పడ రాని పాట్లు పడుతున్నారు. వృద్ధులంతా పింఛన్ డబ్బుల కోసం ఒకేసారి బ్యాంకులకు రావడంతో చాలా చోట్ల సర్వర్లు పనిచేయకపోవడంతో సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. మరోవైపు బ్యాంకు ఖాతాలు కొందరికి ఉన్నా.. అవి చాలా ఏళ్లుగా లావాదేవీలు జరపని కారణంగా ఫ్రీజ్ అయిపోయాయి. అందులో పింఛను డబ్బులు పడటంతో రెన్యువల్ కోసం చార్జీలు కట్ అవుతున్నాయి. దీంతో కొందరికి కేవలం రూ.100 నుంచి రూ.1000 లోపు మాత్రమే పింఛన్ అందుతోంది. ఇంకొన్ని చోట్ల పింఛన్దారులు దోపిడీకి గురవుతున్నారు. పింఛన్దారుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడం వల్ల విత్డ్రా ఫారం నింపడానికి రూ.20 మొదలు తమ గ్రామం నుంచి ఆటో చార్జీలకు రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎక్కువ మంది వృద్ధులు ఎండ దెబ్బకు తాళలేక సొమ్మసిల్లిపోతున్నారు. ఈ వయసులో ఇలాంటి దుస్థితికి కారణమైన చంద్రబాబును ఎప్పటికీ క్షమించబోమంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల కిందట కష్టాలను మళ్లీ తెచ్చావంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 95.77 శాతం పింఛన్ల పంపిణీ జిల్లాలో రెండు రోజుల సమయంలో బ్యాంకుల ద్వారా 95.77 శాతం, డోర్ టు డోర్ ద్వారా 95.21 శాతం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేసింది. బ్యాంకు ఖాతాలున్న 1,22,289 మంది పింఛనుదారులకు గానూ ఇప్పటి వరకూ 1,17,116 మంది ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. 42,621 మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో ఇంటికి వెళ్లి పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 40,595 మందికి అందించారు. చంద్రబాబు అండ్ కో ఎన్ని విధాలుగా పింఛన్ అందించకుండా కుయుక్తులు పన్నుతున్నా.. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులకు చేరవేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ.. మండుటెండలో బ్యాంకులకు వెళ్లలేక.. వెళ్లినా డబ్బులను ఖాతాల నుంచి తీసుకోలేక అవ్వా తాతలు నరకయాతన అనుభవిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ గాజువాక మేనిఫెస్టో ఆవిష్కరణ
● అన్నివర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇది ● స్వచ్ఛ గాజువాకకు ప్రాధాన్యం ● యువత భవితకు విజయవారధి ● ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ వంతెనలు నిర్మాణానికి చర్యలు ● స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అక్కిరెడ్డిపాలెం/గాజువాక : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గాజువాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ స్థానిక మేనిఫెస్టోను ప్రకటించారు. నియోజకవర్గంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి అందిన సూచనల ప్రకారం గాజువాకలో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమర్నాథ్ పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగిన గాజువాకను జాతీయ స్థాయిలో, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని మేని ఫెస్టోను తయారు చేసినట్టు చెప్పారు. స్థానిక కార్యాలయంలో మేనిఫెస్టోను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఉగాది నుంచి గాజువాక అభివృద్ధిపై పలువురు సలహాలు సూచనలను తీసుకొని మేనిఫెస్టోను రూపొందించామన్నారు. మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళా ఉద్యోగినులు, కాంట్రాక్ట్ కార్మికులు, వ్యాపారులతో పాటు వివిధ వర్గాలతో మాట్లాడి వారి ఆలోచనలు, సలహాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన మరుక్షణం నుంచి మేనిఫెస్టోను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ మేయర్ పులుసు జనార్దనరావు, కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత, రాజాన రామారావు, ఉరుకూటి రామచంద్రరావు, ఇమ్రాన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎన్నికల అదనపు పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి, రాష్ట ప్రధాన కార్యదర్శులు ఉరుకూటి అప్పారావు, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు ● పాతగాజువాక నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ● అగనంపూడి టోల్గేటు తరలింపు కోసం ఎంతటి పోరాటానికై నా సిద్ధం ● గాజువాకలో మెట్రో రైలు కార్యరూపం దాల్చేందుకు కృషి ● మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు ● మార్కెట్ల ఆధునికీకరణ ● భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తాం ● గెడ్డలన్నింటికీ రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ● గంగవరం పోర్టు కాలుష్యంపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడంతోపాటు యుద్ధప్రాతిపదికపై కాలుష్య నివారణ చర్యలు ● జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచేలా సౌకర్యాలు ● ఏటా గాజువాక ఉత్సవం నిర్వహ ణ ● సీసీ కెమెరాల ఏర్పాటు ● పర్యాటక ప్రాంతంగా యారాడ అభివృద్ధి ● తక్కువ కాలుష్యంతో కూడిన కంపెనీల ఏర్పాటు ● ఒకేషనల్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు ● పోటీ పరీక్షల విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు ● విజయవారధి పేరుతో యువత భవిష్యత్తుకు బంగారుబాట. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో అనుసంధా నం ● వ్యాపారం చేయడానికి ఆసక్తి కనబర్చే యువతకు చేయూత ● పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక ● కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ● ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి టోల్ఫ్రీ నంబర్, యాప్, వెబ్సైట్ ఏర్పాటు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మోదీతో చెప్పించాలి : రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీతో స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయించగలరా అని అమర్నాథ్ ప్రశ్నించారు. స్టీల్ప్లాంట్ను అమ్మకానికి పెట్టిన బీజేపీతో టీడీపీ, జనసేన అంటకాగుతూ ఇక్కడి ప్రజలను మోసం చే స్తున్నాయన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ మొదటి నుంచీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్టీల్ప్లాంట్ పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తానన్నారు. -
భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత
● భీమిలి క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్న పోలీసులు ● ఆరుగురి అరెస్ట్, ఒకరు పరారీ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ సునీల్ తగరపువలస : ఆనందపురం మండలం భీమిలి క్రాస్రోడ్డు చెక్ పోస్టు వద్ద గురువారం సాయంత్రం సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆరుగురు వ్యక్తుల నుంచి భారీగా నకిలీ కరెన్సీతోపాటు గోల్డ్ కోటెడ్ బంగారు నాణేలు, బిస్కెట్లు, మారణాయుధాలు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మధురవాడ జోన్ ఏసీపీ సునీల్, ఆనందపురం సీఐ తిరుపతిరావు వివరాలు తెలిపారు. నకిలీ కరెన్సీ అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలుసుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది తగరపువలస మీదుగా విశాఖ వెళ్తున్న ఒక కారు, రెండు ద్విచక్రవాహనాల కోసం క్రాస్రోడ్డు వద్ద కాపు కాశారు. వీరిని గమనించిన వాహనాల్లోని ఆరుగురు వ్యక్తులు... తమ వాహనాలను వెనక్కి తిప్పి పారిపోవాలని ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వీరిలో విజయనగరం ఆర్కే టౌన్షిప్కు చెందిన గొర్లె హేమచంద్రరావు, బాలాజీవీధికి చెందిన హరి శ్రీను, అయ్యన్నపేట కూడలికి చెందిన మంగలపుది సుబ్బారెడ్డి, దాసన్నపేటకు చెందిన దనాల శ్రీనివాస్, గుంకలాంకు చెందిన కునుకు హేమంత్కుమార్, పలాసకు చెందిన జన్న సునీల్ పట్టుబడ్డారు. సోమేష్ అనే వ్యక్తి పారిపోయాడు. వీరి నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్ల కట్టలు వంద, నకిలీ గోల్డ్ బిస్కెట్లు 24, నకిలీ గోల్డ్ కాయిన్లు 92, మొబైల్ ఫోన్లు 23, ల్యాప్టాప్ 1, సిమ్కార్డులు 7, పోలీస్ జంగిల్ యూనీఫారాలు, నకలీ నోట్ల బండిల్స్, వాటి తయారీకి వినియోగించే రసాయనాలు, వస్తువులు, రైస్ పుల్లింగ్ బౌల్ స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో ప్రధాన నిందితుడు గొర్లె హేమంత్ కుమార్ మిగిలిన వారిని కలుపుకుని నకిలీ కరెన్సీతోపాటు రైస్ పుల్లింగ్ చేయాలనుకున్నాడు. వీరంతా విజయనగరంలో కలుసుకుని అమెజాన్ ద్వారా చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కరెన్సీతోపాటు నకిలీ గోల్డ్ కాయిన్లు, బిస్కెట్లు కొనుగోలు చేశారు. అలాగే ఇత్తడి షాపులో రైస్ పుల్లింగ్ పాత్ర కొనుగోలు చేసి విశాఖలో ఉన్న సోమేష్ అనే వ్యక్తికి ఇవ్వడానికి వెళ్తూ పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేశారు. -
నిమ్మగడ్డతో చంద్రబాబే చేయించాడు
గత నెలలో ఇచ్చినట్లు సచివాలయంలో పింఛను ఇస్తారనుకుని.. 7వ నంబర్ సచివాలయానికి వెళ్లాను. అక్కడ సిబ్బంది మీ పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో వేశారని చెప్పారు. నా వయసు 70 ఏళ్లు. ఇప్పుడు బ్యాంక్కు ఎవరిని తోడు తీసుకుని వెళ్లాలి. ప్రతి నెలా తెల్లవారేసరికి ఇంటికి తీసుకువచ్చి వలంటీర్ డబ్బులు ఇచ్చేవారు. ఎన్నికల వేళ చంద్రబాబు నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి వలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వండా ఆపించేశాడు. చంద్రబాబు వల్లే మాలాంటి ముసలివాళ్లకు ఈ పాట్లు వచ్చాయి. చంద్రబాబు, నిమ్మగడ్డకు కచ్చితంగా మా ఉసురు తగులుతుంది. – చావాకుల సత్యం, ఆపరేషన్కాలనీ, ఆరిలోవ -
హోం ఓటింగ్ నిర్వహణకు పటిష్ట చర్యలు
మహారాణిపేట: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, 40 శాతం పైబడి అంగవైకల్యం ఉన్న వారికి ఈ నెల ఈ నెల 7, 8వ తేదీల్లో పటిష్టంగా హోం ఓటింగ్ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. హోం ఓటింగ్ విధి, విధానాలపై అవగాహన కల్పించే నిమిత్తం గురువారం కలెక్టరేట్ వీసీ హాలులో ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్తో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు హోం ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ గురించి అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఫారం–12డీ ద్వారా ఇప్పటికే బీఎల్వోలకు దరఖాస్తు అందజేసిన ఓటర్లకు ఈ నెల 7, 8వ తేదీల్లో ఇంటి వద్దే ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఒక వేళ ఆ రెండు తేదీల్లో ఎవరైనా మిగిలిపోతే మే 9న మరోసారి అవకాశం కల్పిస్తామన్నారు. అప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోకపోతే తమ హక్కును కోల్పోయినట్లేనని స్పష్టం చేశారు. జిల్లాలో 1,404 మంది హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరందరూ ఓటు వేసేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పీవో, ఇద్దరు సహాయకులు, వీడియోగ్రాఫర్, ఎస్కార్టు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో రహస్య పద్ధతిలో ఓటింగ్ ఉంటుందని వివరించారు. ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్ హోం ఓటింగ్ విధి, విధానాలు, సాంకేతిక అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మల్లికార్జున
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019