breaking news
-
వీడిన వడ్డె యల్లయ్య మిస్సింగ్ మిస్టరీ
సూర్యాపేట : సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె యల్లయ్య మిస్సింగ్ మిస్టరీ వీడింది. పథకం ప్రకారం యల్లయ్యను ఏపీలోని జగ్గయ్యపేటలో హతమార్చగా.. మృతదేహం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈనెల 19న వడ్డె యల్లయ్య జగ్గయ్యపేటకు భార్యభర్తల మధ్య పంచాయతీ విషయంలో సెటిల్మెంట్ చేసేందుకు వెళ్లాడు. వెళ్లిన అతను అక్కడే అదృశ్యమయ్యాడు. నాటి నుంచి సూర్యాపేట మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా యల్లయ్య మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఎట్టకేలకు యల్లయ్యను తానే కొందరితో కలిసి హత్య చేసినట్లు నాగారం మండలంలోని మాచిరెడ్డిపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తాడూరి శ్రీకాంతరాజు (చారి) జగ్గయ్యపేట తహసీల్దారు ఎదుట లొంగిపోగా, పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. పథకం ప్రకారమే హత్య.. వడ్డె యల్లయ్య, తాడూరి శ్రీకాంతరాజులు మాజీ నక్సలైట్లు. వారు జనజీవన స్రవంతిలోకి వచ్చాక ఇద్దరూ కలిసి పలు సెటిల్మెంట్లు చేశారు. ప్రస్తుతం శ్రీకాంతరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. వడ్డె యల్లయ్య సెటిల్మెంట్లు చేస్తూ సూర్యాపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో ఎలాగైనా యల్లయ్యను హతమార్చాలని శ్రీకాంతరాజు నిర్ణయి ంచుకున్నాడు. యల్లయ్యను స్థానికంగా హత్య చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించి జగ్గయ్యపేటలో ఏప్రిల్ నెలలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని హత్యకు పక్కా పథకం వేశాడు. భార్యభర్తల మధ్య పంచాయతీ ఉందని, ఆ పంచాయతీ పరిష్కరించాలని అందుకు కొంత నగదు ఇస్తామని ఓ మహిళలతో య ల్లయ్యను నమ్మించారు. ఈ క్రమంలో దంపతుల పంచాయతీని సెటిల్ చేసే క్రమంలో డబ్బులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ డబ్బులను తీసుకునేందుకు జగ్గయ్యపేటకు రావాలని పిలిచారు. దీంతో యల్లయ్య ఏప్రిల్ 18న తన అనుచరుడు అంజయ్య, సదరు మహిళతో కలిసి జగ్గయ్యపేటకు వెళ్లాడు. అప్పటికే పక్కా పథకంతో ఉన్న శ్రీకాంతరాజు వారిని ఓ టీస్టాల్ వద్ద కలిసి మహిళతో పాటు అంజయ్యను అక్కడే ఉండమని యల్ల య్యను నమ్మించి తాను అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లి హత్య చేసినట్లు శ్రీకాంతరాజు పోలీసులకు తెలిపాడు. మృతదేహాన్ని చేపలు రవాణా చేసే బాక్స్లో ఉంచి లారీలో విశాఖపట్నం పంపించామని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం మృతదేహం కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ ఏపీలోని జగ్గయ్యపేటలో హత్య.. దొరకని మృతదేహం ఫ తహసీల్దార్ ఎదుట లొంగిపోయిన నిందితుడు శ్రీకాంతరాజు -
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
తుర్కపల్లి: మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని మాదాపూర్, వీరారెడ్డిపల్లి, దత్తాయపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలకు ఆయన హాజరై మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో చెరువులన్నీ నిండుకుండలా ఉండేవని, గ్రామాల్లో ఎటుచూసినా ధాన్యం రాసులు దర్శనమిచ్చేవన్నారు. కాంగ్రెస్ పాలనలో చెరువులన్నీ అడుగంటి, పంట పొలాలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని అన్నారు. ప్రచారంలో రేవంత్రెడ్డి మాట్లాడుతున్న బూతు పురాణం ఎన్నికల కమిషన్కు కనబడటం లేదని విమర్శించారు. కార్యకర్తలు ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను వివరించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, సూదగాని హరిశంకర్గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
మోదీ, కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మరు
కోదాడరూరల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కోదాడ పట్టణంలోని ఓ కల్యాణమండపంలో కోదాడ పట్టణ, రూరల్, అనంతగిరి మండలాలల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం చేపట్టిన రోడ్ షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత పదేళ్ల పాలనలో మోదీ దేశాన్ని, కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా నాశనం చేశారని విమర్శించారు. మతోన్మాద బీజేపీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో భారీ విజయంతో ఇండియా కూటమి కేంద్రంలో అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచేది నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, పీసీసీ సభ్యుడు సీహెచ్. లక్ష్మీనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, ఎంపీపీ మల్లెల రాణి, జెడ్పీటీసీలు మందలపు కృష్ణకుమారి, కొణతం ఉమ, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, తూమాటి వరప్రసాద్రెడ్డి, ముస్కు శ్రీనివాసరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఫ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సమాజంలో పారదర్శకత పెంచిన ఆర్టీఐ
ఫ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు చౌటుప్పల్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సమాజంలో పారదర్శకతను పెంచిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి షాదీఖాన భవనంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీఓ ఆన్లైన్లో ఉంచుతామని, ఆర్టీఐ దరఖాస్తులను సైతం ఆన్లైన్లో తీసుకునేలా చర్యలు తీసుకుంటామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన నాయకత్వంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. సామాన్యుడికి సైతం గౌరవం దక్కేలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువస్తే కేంద్రంలోని బీజేపీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు పారదర్శకంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖుర్షీద్పాష, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి ప్రభాకర్రెడ్డి, సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఇన్ చీఫ్ ఎంఏ.కరీం, ప్రతినిధులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
మద్దిరాల : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పోలుమల్ల శివారులో గల 365 జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూర్ మండలంలోని చికాటయపాలెం గ్రామానికి చెందిన కొండ సందీప్(24) తన ట్రాక్టర్లో వరిధాన్యాన్ని లోడ్చేసుకుని సూర్యాపేట మార్కెట్లో దిగుమతి చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున మండలంలోని పోలుమల్ల శివారులోకి రాగానే 365జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ సందీప్పై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.సిలిండర్ పేలి సామగ్రి దగ్ధం గరిడేపల్లి : ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి సామగ్రి దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని రేగులగడ్డతండాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోతు శ్రీను ఇంట్లో వంట చేసేందుకు గ్యాస్ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమై ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదుతో పాటు ధాన్యం, బట్టలు, సామగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019