breaking news
-
హేమాచలుడి జాతర వేలం పాటలు
మంగపేట: మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 19 నుంచి 28 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలు(జాతర) వేలం పాటలను ఆలయ ఈఓ సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు. జాతర సందర్భంగా ఈనెల 5నుంచి జూన్ 4వ తేదీ వరకు నెల రోజుల పాటు ఆలయ ప్రాంగణం పరిధిలో లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారుచేసి విక్రయించుట, కొబ్బరి ముక్కలు పోగు చేసుకోవడంతో పాటు తదితర షాపుల నిర్వహణకు అనుమతి పొందేందుకు గురువారం వేలం పాటలు నిర్వహించారు. లడ్డు, పులిహోర ప్రసాదం విక్రయాలకు మల్లూరు చెందిన మారబోయిన గోవర్ధన్ రూ 3.18లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు జి. శ్రీకాంత్ రూ 55వేలు, పూల డెకరేషన్ డి. శ్రీనివాస్, తడుకల పందిళ్లు వేయుటకు సదానందం, రంగుల వేసేందుకు శ్రీనివాస్ రూ.57వేలకు టెండర్ బాక్స్ ద్వారా దక్కించుకున్నారు. కొబ్బరి కాయల విక్రయం, పుట్టు వెంట్రుకలు, ఫొటోలు తీసుకునేందుకు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు ఈ నెల 8న వేలం పాటలను నిర్వహించనున్నట్లు ఈఓ సత్యనారయణ తెలిపారు. ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్గా మహేష్ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారిగా రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్.మహేష్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ అనారోగ్య కారణాలతో రెండు నెలలు సెలవులో వెళ్తుండడంతో మహేష్కు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి
వెంకటాపురం(ఎం): బాల్య వివాహాలను అరికట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధక అధికారులైన పంచాయతీ కార్యదర్శులకు వివాహాల నమోదు చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టంపై సెన్సిటైజేషన్ ఫోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ హాజరై మాట్లాడారు. గ్రామ పరిధిలో సీఎంపీఓలుగా ఉండే పంచాయతీ అధికారులు ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం తెలిసిన వెంటనే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా క్షేత్రస్తాయిలో నిర్వహించేందుకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సునీత, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, డీసీపీయూ అధికారి బండారి జ్యోతి, ఆయా పంచాయతీల కార్యదర్వులు, ఫీల్డ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. -
వినియోగదారులకు నిరంతర విద్యుత్
ములుగు/ములుగు రూరల్: విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించాలని విద్యుత్శాఖ భూపాలపల్లి ఎస్ఈ మల్చూర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో విద్యుత్ ఉద్యోగుల భద్రతా వారోత్సవాల వాల్పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశిందేవిపేట సబ్ స్టేషన్ పరిధిలో వ్యవసాయ వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా కోసం వదులుగా ఉన్న విద్యుత్ లైన్ల మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సబ్ స్టేషన్ పరిధిలో వదలుగా ఉన్న విద్యుత్ లైన్ల సవరణకు 834 ఫోల్స్ వేసినట్లు తెలిపారు. 116 వంగి పోయిన ఫోళ్లను సరి చేసినట్లు తెలిపారు. ములుగు పట్టణ పరిధిలో 33/11 కేవీకి సంబంధించి కొత్తగా 6–63 కిలోవాట్స్, 2–100 కిలో వాట్స్ టాన్స్ఫార్మర్లను అమర్చినట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు అందుబాటులో ఉండి వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు డివిజన్ ఇంజనీర్ నాగేశ్వర్రావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ సాయికృష్ణ, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. సబ్స్టేషన్ ఆకస్మిక తనిఖీ వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని 33/11కేవీ సబ్స్టెషన్ను ఎస్ఈ మల్చూర్, జిల్లా డివిజనల్ ఇంజనీర్ పుల్సం నాగేశ్వర్రావు గురువారం కస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా 11 కేవీ నర్సాపూర్ బ్రేకర్, వెల్తుర్లపల్లి సబ్స్టేషన్లో డబుల్ ఎర్తింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిరంతరంగా అందిస్తున్న విద్యుత్ సరఫరాపై ఆరా తీశారు. విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి వినియోగదారులకు నిరంతర సేవలు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగవద్దని సూచించారు. అనంతరం విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణు, గోపాల్స్వామిరెడ్డి, ఏఈ సురేష్, సబ్ ఇంజనీర్ రాజు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.ఎస్ఈ మల్చూర్ -
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
ములుగు: జిల్లాకు కొత్తగా వచ్చిన 200 బ్యాలెట్ యూనిట్లను సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ర్యాండమైజేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్లో 23మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. వీటికి రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయన్నారు. పోలింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా ఓటింగ్కు అంతరాయం కలగకూడదనే ఉద్ధేశ్యంతో అదనపు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను కేటాయిస్తున్నట్లు వివరించా రు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ విజయ్కుమార్, తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదవాలి విద్యార్థులు లక్ష్యంతో చదవుతూ ముందుకు సాగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రశంస పత్రాలు, అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్రీజ, ఎస్పీ డాక్టర్ శబరీశ్తో పాటు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కృషిని అభినందించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో రెండో ర్యాంక్ సాధించిన టీఎస్ఆర్జేసీ విద్యార్థి చరణ్తేజ, రెండో సంవత్సర ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచిన ఆకుల ఆకాష్, కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంకు చెందిన కావిరి రజినీకాంత్ ఏటూరునాగారంలో కళాశాలలో హెచ్ఈసీ చదివి మొదటి స్థానంలో నిలిచాడు.. వీరితో పాటు మరో 12 మందిని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ ప్రశంస పత్రాలను అందించారు. వీరితో పాటు పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన 11 మంది విద్యార్థులకు మెమెంటోలు అందించారు. ఈ కా ర్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, జిల్లా ఇంటర్మీ డియట్ అధికారి వెంకటేశ్వర్లు, డీఈఓ పాణిని, జిల్లా మైనార్టీ శాఖ అధికారి ప్రేమలత పాల్గొన్నారు.కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సీ విజిల్ యాప్పై అవగాహన కల్పించాలి
ములుగు: సీ విజిల్ యాప్పై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్వ్యాస్ సూచించారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికలపై న్యూఢిల్లీ నుంచి పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై గురువారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్కు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, జిల్లా తరఫున కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీజ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీలో నితేష్వ్యాస్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల విధులను ప్రతిఒక్కరూ నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పక్కాగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఈవీఎం బ్యాలెట్ యూనిట్లు, ఎఫ్ఎల్సీ, ర్యాండమైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా పక్కాగా నిఘా పెట్టాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 55శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. 1950 టోల్ ఫ్రీ నంబర్కు వచ్చే ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉంటున్నామని వివరించారు. ఎస్పీ డాక్టర్ శబరీశ్ మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంల తరలింపు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద బందోబస్తు చేపడుతున్నామని వివరించారు.డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్వ్యాస్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019