breaking news
-
నేడు జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ బహిరంగసభకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాకు వస్తుండడంతో ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. మొదటి బైపాస్రోడ్డులో నిర్వహించే ఈ సభకు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని సమీకరించాలని పార్టీ నాయకులు భా విస్తున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, కరీంనగర్ ఎంపీ అ భ్యర్థి వెలిచాల రాజేందర్రావు సభ నిర్వహణపై పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశనిర్దేశం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగసభ ప్రారంభం కానుండడంతో ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని టెంట్లు, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. పటిష్ట భద్రత సభాస్థలికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే నిలువరించి పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, కోనరావుపేట మార్గాల్లో సిరిసిల్లకు వచ్చే వాహనాలను ఆయా ప్రాంతాల్లోనే పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్తోపాటు సీఎం వచ్చి, వెళ్లే మార్గాల ను పోలీసులు ఇప్పటికే ఆధీనంలోకి తెచ్చుకున్నారు. డాగ్స్క్వాడ్, బాంబుస్క్వాడ్లతో తనిఖీలు చేశారు. కాంగ్రెస్ జెండాలతో నిండిన కూడళ్లు సిరిసిల్ల కూడళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయాయి. సీఎం హోదాలో తొలిసారి జిల్లా కు వస్తుండడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సిరిసిల్లలో సీఎం సభను వి జయవంతం చేసేందుకు పార్టీ ముఖ్యనాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతపై ఎస్పీ సమీక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం పోలీస్ అధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. భద్రత చర్యల్లో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభాస్థలికి వచ్చి, వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ట్రెయినీ ఐపీఎస్ రాహుల్రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్రెడ్డి, మురళీకృష్ణ, సీఐలు రఘుపతి, అనిల్కుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదటి బైపాస్రోడ్డులో బహిరంగ సభ భారీ జనసమీకరణలో కాంగ్రెస్ శ్రేణులు -
పనికి తగ్గ వేతనం చెల్లించాలి
చందుర్తి(వేములవాడ): ఉపాధి హామీ కూలీలకు పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదని చందుర్తికి చెందిన కూలీలు పనిచేసే చోటే గురువారం ఆందోళనకు దిగారు. కొలతల ప్రకారం పనులు చేసిన తమకు రోజుకు రూ.170 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారంటూ 150 మంది కూలీలు నిరసనకు దిగారు. ఉపాధిహామీ ఉన్నతాధికారులు వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించారు. ఏపీవో రాజయ్య అక్కడికి చేరుకొని కూలీలకు సర్ది చెప్పేందుకు యత్నించిన వారు వినిపించుకోలేదు. కొలతల నమోదులో టెక్నికల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనికి తగ్గ వేతనం దక్కడం లేదంటూ, టెక్నికల్ అసిస్టెంట్ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇకముందు పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ఏపీవో రాజయ్య హామీతో కూలీలు శాంతించారు. నేతన్నలకు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు ● మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వనితసిరిసిల్లటౌన్: పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్, బీజేపీలు సిరిసిల్ల నేతన్నలకు చేసిందేమి లేదని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే వస్త్రపరిశ్రమ సంక్షోభంలోకి పోయి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లలో నేతకార్మికులకు ఏఏవై కార్డులు ఇవ్వగా వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసిందన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లుగా చేసిందేమి లేదన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, మంత్రి పొన్నం ప్రభాకర్పై బీజేపీ నాయకురాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. మరోసారి అవాక్కులు చవాక్కులు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. పార్టీ పట్టణ మహిళ అధ్యక్షురాలు వెల్ముల స్వరూప, నాయకులు అరుణ, రోజా, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ ● ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అనిల్సిరిసిల్లటౌన్: అత్యధిక జనాభా గల తమ సా మాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్కు వ్యతిరేకమని ప్రకటించారు. బీజేపీ అఽభ్యర్థి బండి సంజయ్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈనెల 4న చలో హైదరాబాద్ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి, పసుల భేష్కుమార్, ఖానా పురం లక్ష్మణ్, ఆవునూరు ప్రభాకర్, గుండా థామస్, మంగలి చంద్రమౌలి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కో ఇన్చార్జిగా చక్రధర్రెడ్డిముస్తాబాద్(సిరిసిల్ల): కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కో–ఇన్చార్జిగా ముస్తాబాద్ సింగిల్విండో మాజీ చైర్మన్ కనమేని చక్రధర్రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఆదేశాలతో నియమించారు. చక్రధర్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆహార్నిషలు కృషి చేస్తానన్నారు. కరీంనగర్ ఎంపీగా రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పనిచేస్తామన్నారు. -
వాహనం జప్తు!
వాయిదా దాటితే‘ముస్తాబాద్ మండలం పోత్గల్కు చెందిన రాజయ్య సిరిసిల్ల లేబర్ అడ్డాలో కూలి పనిచేస్తాడు. అతని భార్య ఊరిలోనే ఉపాధిహామీ పనిచేస్తుంది. లేబర్ అడ్డాలో పనిచేస్తూ.. వచ్చిన కూలి డబ్బుల్లో పొదుపు చేశారు. ఇలా కూలి పని చేయడం, రోజు పని వెతుక్కోవడం ఇబ్బందిగా ఉండడంతో దాచుకున్న రూ.25వేలను ఆటో షోరూమ్లో చెల్లించి కొత్త ఆటోను రెండేళ్ల క్రితం కొన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో భార్యాభర్తల ఆధార్కార్డుల ఆధారంగా ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రుణం పొందారు. రెండేళ్లుగా ప్రతి నెలా రూ.6వేల చొప్పున ఈఎంఐ చెల్లించాడు. మరో ఏడాదిపాటు ఈఎంఐ చెల్లిస్తే ఆటో అప్పు తీరిపోయేది. ఐదు నెలలుగా ఉచిత బస్సు పథకం అమలుకావడంతో ఆటోకు పనిలేకుండా పోయింది. పొద్దంతా రోడ్డుపై తిరిగినా రూ.300 దొరకని పరిస్థితి ఎదురైంది. ఆటోను అమ్ముదామన్నా.. ఎవరూ కొనే స్థితిలో లేరు. దీంతో రెండు నెలల ఈఎంఐ వాయిదా దాటింది. అంతే ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఆటోను లాక్కెళ్లారు.‘జిల్లా కేంద్రంలోని బీవై నగర్కు చెందిన మల్లేశం మరమగ్గాల కార్మికుడు. గతేడాది ఇదే సీజన్లో ఓ ఆసామి వద్ద సాంచాలు నడుపుతూ నెలకు రూ.15వేలు సంపాదించేవాడు. మల్లేశం భార్య బీడీలు చేస్తూ రూ.2వేలు సంపాదించేది. అద్దె ఇంట్లో ఉంటున్నా ఆర్థికంగా ఇబ్బందులు లేకపోవడంతో ఆ దంపతులు ఓ బైక్ కొనాలనుకున్నారు. తమ వద్ద ఉన్న రూ.10వేలు చెల్లించి, ఆధార్కార్డు ఆధారంగా ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వద్ద(హెచ్పీ) రూ.95 వేలు లోను తీసుకుని బైక్ కొన్నారు. ప్రతి నెలా ఈఎంఐగా రూ.5,500 చెల్లించారు. మూడు నెలలుగా సాంచాలు(మగ్గాలు) సరిగా నడవక మల్లేశంకు పని లేకుండా పోయింది. ఈఎంఐ చెల్లించడం కష్టంగా మారింది. దీంతో సదరు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు మల్లేశం ఇంటికొచ్చి బైక్ను తీసుకెళ్లారు. రెండు నెలలు మాత్రమే ఈఎంఐ పెండింగ్ ఉన్నప్పటికీ పైనాన్స్ కంపెనీ ప్రతినిధులు బండి లాక్కెళ్లారు.’ -
ముంపు సమస్యలు పరిష్కరిస్తా
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● రుద్రవరం, సంకెపల్లి, నిజామాబాద్లలో ఎన్నికల ప్రచారంవేములవాడఅర్బన్/కోనరావుపేట(వేములవాడ): మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలు తెలిసినవాడిని, మీ సమస్యలపై గళమెత్తి.. పరిష్కారానికి ముందుంటానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పే ర్కొన్నారు. వేములవాడ మండలం రుద్రవరం, సంకెపల్లి, కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. నాలుగున్నర నెలల క్రితం బీఆర్ఎస్ను పక్కన పెట్టినట్లుగా ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టాలని కోరారు. రాజన్న సాక్షిగా ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ తప్పారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదన్నారు. బండి సంజయ్ రాజన్నకు అణా పైసా తెచ్చిండా అని అడిగారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. బండి సంజయ్ ముంపు గ్రామాలకు ఎప్పుడైన వ చ్చాడా.. అని అడిగారు. వినోద్కుమార్ నాన్లోకల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును గెలిపించుకోవాలని కోరారు. మండలాల అధ్యక్షులు పిల్లి కనకయ్య, షేక్ ఫిరోజ్పాషా, ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ, చింతపల్లి శ్రీనివాసరావు, వంకాయల భూమయ్య, రగుడు పర్శరాములు, జగన్మోహన్రెడ్డి, కేతిరెడ్డి అరుణ, చారి, చేపూరి గంగాధర్, కచ్చకాయల ఎల్లయ్య, గొట్టె రుక్మిణి, ప్రభాకర్, రాజయ్య ఉన్నారు. -
గీత దాటితే.. వేటే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు–ప్రతిసవాళ్లు, విమర్శలు–ప్రతివిమర్శలతో రాజకీయ సభలు, సమావేశాలను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధంగా ఉన్న వ్యాఖ్యలు, అఫిడవిట్లలో తప్పులపై ఎన్నికల సంఘానికి(ఈసీ), పోలీసులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. అందులో గీత దాటినట్లు తేలితే.. బాధ్యులపై వెంటనే వేటు పడుతోంది. ఇందుకు చిన్న నాయకుడు, పెద్ద నాయకుడు అన్న తేడా లేదు. సున్నితమైన విషయాలను షేర్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే కేసుల రూపంలో పర్యవసానాలు తప్పేలా లేవు. కేంద్ర హోం మంత్రి అమిత్షాపై పోస్టు నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వగా.. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ వేటు వేసిన విషయం విధితమే. మాజీ సీఎం ప్రచారంపై నిషేధం.. సిరిసిల్లలో గత నెల 5వ తేదీన నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తూ కొంత పరుష పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈసీకి ఫిర్యాదులు వెళ్లడం, అధికారులు నివేదిక సమర్పించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఎన్నికల సంఘం 48 గంటలపాటు ఆయన ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కువ భూమి చూపారని.. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ సమర్పించిన అఫిడవిట్లో తప్పులున్నాయని బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన సొంతూరు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లులో తండ్రి మురళీధర్రావు పేరిట 45.16 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో వినోద్కుమార్ వాటాగా సర్వే నంబర్ 174, 175/ఏ, 251/బీ, 280/ఏ, 306, 307, 279/సీ, 274, 275/ఏ, 272/బీ, 273/ఏ, 282/బీ, 286/ఏలో 11.06 ఎకరాల డ్రై ల్యాండ్, 4.14 ఎకరాల వెట్ ల్యాండ్ ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారని పేర్కొన్నారు. కానీ, 251/బీ సర్వే నంబర్లో ఆయన కుటుంబానికి భూమి లేదని ఫిర్యాదులో తెలిపారు. ● అయితే, వినోద్కుమార్ తండ్రి మురళీధర్రావుకు ఏనుగల్లు గ్రామంలో 175/4 సర్వే నంబర్లో 25 గుంటలు, 175/ఏ/4/1లో మరో 25 గుంటలు మొత్తం 1.10 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ చూపిస్తోంది. ● వినోద్కుమార్ తన భార్య మాధవి పేరిట రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో 2020 జూలైలో 577 సర్వే నంబర్లో 19.02 ఎకరాలు, అదే ఏడాది నవంబర్లో 582 సర్వే నంబర్లో 13 గుంటలు, 579 సర్వే నంబర్లో 13 గుంటల భూమి 19.28 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు చూపారు. కానీ, ధరణి పోర్టల్లో ఆమె పేరిట 19.13 ఎకరాలు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 15 గుంటల భూమి అఫిడవిట్లో ఎక్కువగా చూపారని బీజేపీ కరీంనగర్ జిల్లా నాయకుడు బాస సత్యనారాయణ రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. వీడియో అప్లోడ్ చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీల అమలులో విఫలమయ్యారని, వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు నేతల ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టులపై ఈసీ నజర్ సిరిసిల్లలో పరుష పదజాలం వాడిన మాజీ సీఎం కేసీఆర్ ఆయన ప్రచారంపై 48 గంటల నిషేధం బీఆర్ఎస్ అభ్యర్థి అఫిడవిట్లో తప్పులున్నాయని బీజేపీ ఫిర్యాదు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019