breaking news
-
Articles in Sitemap
Articles in SitemapArticles in SitemapArticles in SitemapArticles Articles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in SitemapArticles in -
పశువుల సంరక్షణకు 12 సూత్రాలు
జనగామ: వెంచర్లుగా మారిపోతున్న అటవీ భూములు.. మాయమైపోతున్న చెరువులు, వాగులు.. మోడుబారిపోతున్న వందల ఏళ్ల నాటి మహా వృక్షాలు.. పెరిగిపోతున్న కాలుష్యంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మునుపెన్నడూ లేని విధంగా టెంపరేచర్ 45 డిగ్రీ ల సెల్సీఎస్కు పెరిగి మనుషులతోపాటు మూగ జీవాలు సైతం అల్లాడుతున్నాయి. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో.. పశువులు, గేదెలు, కోళ్లు, గొర్రెలు, మేకల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. మండుతున్న ఎండల నుంచి మూగ జవాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 12 సూత్రాలతో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యాన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సంరక్షణ ఇలా..! ● పశువులు, గొర్రెలు, మేకలను ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్న సమయంలోనే మేత కోసం బయటకు తీసుకుపోవాలి. ● ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాటిని కొట్టాల్లోనే ఉంచాలి. ● కొట్టాలున్న పొలాల వద్ద, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీడనిచ్చే చెట్లు ఉంటే చాలా మంచిది. ● పశుగ్రాసం పెంచుకునే అవకాశం ఉన్న రైతులు, యజమానులు జీవాలను షెడ్డు లోపలే ఉంచడం చాలా మంచిది. ● ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కొట్టాలు, షెడ్డులకు నలు దిక్కులా గోనె సంచులు కట్టి వేడి లోపలకు వెళ్లకుండా నీటిని చల్లాలి. ● రోజూ ఒక్కో పశువుకు 60 నుంచి 70 లీటర్ల తాగునీరు అవసరం ఉంటుంది. ● పరిశుభ్రమైన వాతావరణంలో పశువులకు చల్లని తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ● పశువులకు దాణా నీటిలో తడిపి ఇస్తే మంచిది. ● అవసరమైన లవణ మిశ్రమం, స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడం వలన డీ హైడ్రేషన్, వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. ● వాణిజ్య పరంగా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టేవారు షెడ్లలో ఫ్యాన్లు, స్ప్రింక్లర్స్, ఫాగర్స్ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నం చేయాలి. వడదెబ్బకు గురైతే.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల శరీరం వేడి పెరిగి వడదెబ్బకు గురవుతాయి. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతాయి. వడదెబ్బకు గురైన పశువుల తల, శరీర భాగాలను నీటితో తడుపుతూ సమీప వెటర్నరీ ఆస్పత్రి లేదా వైద్యాధికారికి సమాచారం ఇచ్చి వైద్యం అందించాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల పశువుల ఉత్పాదక శక్తి తగ్గకుండా, మరణాల సంఖ్యను పూర్తిగా నివారించవచ్చు. ఊరూరా అవగాహన రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వదడదెబ్బకు గురికాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం. గతం కంటే ప్రస్తుతం రికార్డు స్థాయి వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు, వడగాల్పులతో మూగ జీవాలకు ప్రమాదం పొంచి ఉంది. వడదెబ్బకు గురైన సమయంలో జీవాల ఉత్పాదక శక్తి తగ్గి మరణాలు సంభవించే ప్రమా దం ఉంది. తగిన జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ఎస్ఎల్ఎన్.మనోహర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రక్షణ చర్యలు లేకుంటే ప్రమాదమే వడగాల్పులు రాకుండా చూడాలి పశుసంవర్థక శాఖ ఆధ్వర్యాన అవగాహన -
మోదీ విధానాలతో పెరిగిన పేదరికం
స్టేషన్ఘన్పూర్/పాలకుర్తి: దేశంలో గత పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసిన తిరోగమన ఆర్థిక విధానాలతో పేదరికం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనా రాయణ అన్నారు. ఘన్పూర్, పాలకుర్తిలో గురువా రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో మోదీ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని, దేశంలో సంపన్నులు ఎదిగి.. పేదలు మరింత పేదరికంలోకి వెళ్తున్నారని చెప్పా రు. పేదలకు ఉపాధి కోసం యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈజీఎస్ పథకానికి బీజేపీ తూట్లు పొడుస్తున్నదని, ప్రజలు చైతన్యవంతులై పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను గెలిపించాలని కోరారు. ఆయా సమావేశాల్లో పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్, జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మంద వీరస్వామి, బీసీ న్యాయవాదుల సంఘం కార్యదర్శి రాచకొండ ప్రవీణ్, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కారుపోతుల శ్రీనివాస్, కమ్మగాని ఆంజనేయులు, ముత్తినేని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ -
జనగామలో ‘నమో’ ప్రతిధ్వని
జనగామ: దేశమంతా ‘నమో’ నమామి అంటుంటే.. ఆ ప్రతిధ్వని జనగామలో ప్రతిధ్వనిస్తోందని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్ని కలలో భాగంగా గురువారం పట్టణంలో జరిగిన కార్నర్ మీటింగ్లో పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తరఫున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు విశ్వగురువుగా కీర్తిస్తున్నాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే.. నాటి నేటి సీఎంలు కేసీఆర్, రేవంత్రెడ్డి పైసా ఇవ్వలేదని అంటున్నారని చెప్పారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన బీజేపీ కార్యకర్తలు..హైదరాబాద్లో ఓవైసీ, భువనగిరిలో కిరణ్కుమార్రెడ్డిని ఇంటికి పంపించేందుకు కంకణ బద్ధులై పని చేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డిలో తనపై ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్రెడ్డికి.. ప్రధాని మోదీ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. అమలుకు సాధ్యకాని తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. నిరంకుశ పాలన సాగించిన మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా అవాకులు, చెవాకులు పేలితే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందన్నారు. భూమికి మూడు ఫీట్లు లేని రేవంత్ అమిత్షా మాటలను వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదు.. 25 గ్యారంటీలనడం హాస్యాస్పదమన్నారు. ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ దేశం, ధర్మం, డెవలప్ మెంట్ మూడు నినాదాలతో మోదీ త్రీడీగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెక్యులర్ పేరుతో దేశాన్ని తాకట్టుపెట్టే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి, రాష్ట్ర నాయకులు కొంతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పట్టణంలో బీజేపీ కార్నర్ మీటింగ్ -
బ్యాలెట్ యూనిట్ల తనిఖీ
జనగామ: జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోదాంలో ఈసీఐఎల్ నుంచి అదనంగా వచ్చిన 2,200 బ్యాలెట్ యూనిట్ల మొదటి దశ తనిఖీ(ఎఫ్ఎల్సీ)ని గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా చేపట్టారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీల ప్రతిని ధులు, ఇంజనీర్ల సమక్షంలో ఎఫ్ఎల్సీ నిర్వ హించారు. ఈవీఎంల పరిశీలన అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సమష్టి కృషితో మెజార్టీ సాధించాలి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ రూరల్: ఎంపీ ఎన్నికల్లో చామల కిరణ్కుమార్రెడ్డి గెలుపుకోసం సమష్టి కృషితో పని చేసి అత్యధిక మెజార్టీ సాధించాలని డీసీ సీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పా టు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, వార్డు అధ్యక్షులు, ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు సరిచూసుకుని గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా కష్టపడాలని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు జక్కుల అనిత, ఫ్లోర్ లీడర్ వంగాల కళ్యాణి, రామచంద్రం, బోట్ల శ్రీనివాస్, మెడ శ్రీనివాస్, మున్ని బేగం పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి స్టేషన్ఘన్పూర్: డీవైఎస్ఓ ఆధ్వర్యంలో స్థానిక విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ వేసవి ఉచిత శిక్షణ శిబిరా న్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ వై.థామస్కిరణ్ అన్నారు. జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ బి.వెంకట్రెడ్డి ఆదేశాల మేరకు విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల మైదానంలో పీడీ, ఫుట్బాల్ కోచ్ సింగపురం మహేష్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడు తూ వేసవిలో విద్యార్థులు, యువతకు ఫుట్బా ల్ కోచింగ్ క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని చెప్పారు. కార్యక్రమంలో కోచ్ మహేష్, క్రీడాకారులు ప్రణయ్, నితీష్, ఫన్నీ, జోయల్, శ్రీకాంత్, చైతన్య, నిఖిల్, అఖిల్, రిషి, సాయిహర్ష, వరుణ్తేజ్, అర్జున్, యశ్వంత్, లక్కీ, ఆర్యన్ పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ జనగామ రూరల్: ఉప్పల్ శిల్పారామంలో ఈనెల 25, 26 తేదీల్లో జరిగే తెలంగాణ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్కు సంబంధించిన పోస్టర్ ను గురువారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యాసమితి వ్యవస్థాపకులు పెండెం తారక్, అధ్యక్షుడు అందే రవికుమార్, శ్యాం తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశమివ్వాలి జనగామ రూరల్: పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇవ్వాలని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ.మసీమ్ ఉర్ రహ్మెన్ గురువారం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈనెల 9 నుంచి ప్రారంభమయ్యే హజ్ యాత్రకు వెళ్లే వారు జిల్లాలో ఉన్నారని, ఈనెల 13న జరిగే ఎన్నికల నేపథ్యంలో వారికి పోస్టల్ ఓటుకు అవకాశం కల్పించాలని కోరారు. లేదంటే ఓటు హక్కు కోల్పోయో అవకాశం ఉందని పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019