breaking news
Ad - Sakshi_Home_Sticky
-
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
శుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024ఎల్కతుర్తి: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కలికట్టుగా, ఐక్యతతో కృషి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఆయన ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజల్ని చైతన్యపర్చాలని సూచించారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలుపునకు కృషి చేయాలని నాయకులకు కోరారు. అనంతరం రాష్ట్ర లారీ అసోసియేషన్ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, నాయకులు సుకినె సంతాజీ, గోలి రాజేశ్వర్రావు, శనిగరం వెంకటేశ్, గుడెల్లి నవీన్, కడారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.న్యూస్రీల్రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్ వ్యాస్ కాళోజీ సెంటర్ : లోక్ సభ ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్ వ్యాస్ అన్నారు. న్యూఢిల్లీ నుంచి పోలింగ్ నిర్వహణపై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, ఉన్నతాధికారులు, వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ పి.ప్రావీణ్య, సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రవణవీర్ చంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ పరిశీలకుడు నీవన్ సైనీ, వ్యయ పరిశీలకుడు ఎ.దిలీబన్,ధీరజ్ సింఘా, డీఆర్ఓ శ్రీనివాస్, డీసీపీ అబ్దుల్బారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితేశ్వ్యాస్ మాట్లాడుతూ ఈసీ నిబంధనల ప్రకారం అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 65 శాతం మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలిన వారికి సైతం పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రవణవీర్చంద్ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించామని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా మాట్లాడుతూ ఈవీఎంల తరలింపు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 5కే రన్ను విజయవంతం చేయాలి కాళోజీ సెంటర్ : ఓటరు చైతన్యంపై ఈనెల 5న నిర్వహించనున్న 5కే రన్ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, అధికారులతో కలిసి గురువారం 5కే రన్ పోస్టర్ ఆవిష్కరించారు. -
స్వేచ్ఛ కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి
ఎంపీ అభ్యర్థి కడియం కావ్య నయీంనగర్: దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని, భవిష్యత్ తరాలకు స్వేచ్ఛా వాతావరణం కావాలంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్గాంధీ ప్రధాని కావాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. గురువారం నయీంనగర్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల పరిచయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని, న్యాయవాదులు రాజ్యాంగానికి డాక్టర్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్, ఏఐసీసీ లీగల్ సెల్ కో–ఆర్డినేటర్ దామోదర్రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ మెంబర్స్ మహాత్మ, జగన్మోహన్రెడ్డి, వరంగల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముదశిర్, హనుమకొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లడే శ్రీనివాస్, బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్, నీలం శ్రీధర్రావు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చుల వివరాలు అందజేయాలి
కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.దిలీబన్, ధీరజ్సింగా కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను విధిగా అందజేయాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.దిలీబన్, ధీరజ్సింగా అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో అభ్యర్థుల వ్యయ సంబంధిత రిజిస్టర్లను ఖర్చుల పరిశీలకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బరిలో ఉన్న 42 మంది అభ్యర్థుల్లో 32 మంది మాత్రమే రిజిస్టర్లను సమర్పించినట్లు తెలిపారు. ప్రజాప్రాతినిథ్యం చట్టంలోని సెక్షన్–77 ప్రకారం అభ్యర్థులు విధిగా హాజరై ఎన్నికల ఖర్చులు పరిశీలించుకోవాలని, హాజరు కాని 10 మంది అభ్యర్థులకు నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం దృష్ట్యా అభ్యర్థులే కాకుండా వారి ప్రతినిధులు కూడా రిజిస్టర్లను పరిశీలనకు పంపించే వెసులుబాటు ఉందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యయ పరిశీలన నోడల్ అధికారి రామిరెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సహాయ వ్యయ అధికారులు, పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీపై సుమోటో కేసు
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్ (28) మృతికి కారణమైన ఆర్ఎంపీ శ్రీనివాస్పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఆర్ఎంపీపై సుమోటో కేసు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లీగల్ అండ్ యాంటీక్వాకరీ బృందం గురువారం వర్ధన్నపేటకు చేరుకుంది. డాక్టర్ శేషుమాధవ్ నేతృత్వంలోని బృందం ఫిరంగిగడ్డ ప్రాంతంలోని ఆర్ఎంపీ శ్రీనివాస్కు చెందిన లక్ష్మి క్లినిక్ను సందర్శించింది. క్లినిక్ మూసి వేసి ఉండడంతో బృందం సభ్యులు స్థానికులతో మాట్లాడారు. అనంతరం నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషుమాధవ్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్ఎంపీలు ఇష్టం వచ్చినట్లు చికిత్స చేయవద్దన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆర్ఎంపీలు, డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ ఆచూకీ తెలుసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019