breaking news
-
కార్మికులకు లాభాల్లో వాటా
● రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్గోదావరిఖని(రామగుండం): పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. గురువారం బాయిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సింగరేణికి ఈ సంవత్సరం వచ్చిన లాభాల్లో కార్మికుల వాటా అందజేస్తామన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తామని పేర్కొన్నారు. ఇండియా కూటమిదే అధికారం పాలకుర్తి(రామగుండం): లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. గురువారం పాలకుర్తి మండలం పుట్నూర్లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, ఐఎన్టీయూసీ నాయకులు సదానందం, ఎట్టెం కృష్ణ, రాజేందర్, మల్లికార్జున్, జనగామ స్వప్న, బాలయ్య, రాజేశం, జనగామ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం
● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రామగిరి(మంథని): సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ–3 పరిధి ఓసీపీ–2లో డివిజన్ అధ్యక్షుడు కోట రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్మికులకు సంబందించిన ఇన్కంట్యాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కార్మికులకు చేసిందేమీ లేదని, వారికి కార్మికుల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అనంతరం రత్నాపూర్లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి పని దినాల పెంపుతో పాటు కూలి పెంచడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతియాదవ్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొలిపాక సుజాత, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, నాయకులు పాల్గొన్నారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి
గోదావరిఖని(రామగుండం): పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ సూచించారు. గురువారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బీఎస్ఎఫ్ అధికారులు, కమిషనరేట్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తర్వాత, స్ట్రాంగ్రూంల వద్ద, కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఫ్లాగ్మార్చ్, రూట్మార్చ్, బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎన్నికల రోజు మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్లు, క్రిటికల్ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏరియా డామినేషన్, కార్డెన్ అండ్ సెర్చ్ విధుల గురించి వివరించారు. కేంద్ర బలగాలకు వసతి ఏర్పాట్లు చేయాలని ఏసీపీలను ఆదేశించారు. ఎన్నికల భద్రతలో భాగంగా రామగుండం కమిషనరేట్కు ఐదు కంపెనీల బలగాలు వచ్చాయని, 443 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో చేరారని వివరించారు. సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు చేతన, అశోక్కుమార్, అడ్మిన్ డీసీపీ రాజు, సీఆర్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్లు పాండే, పరమానంద్యాదవ్, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు డేవిడ్లాల్ తనసిమ్మ, భరత్సింగ్, స్వరూప్ సమంత, డిప్యూటీ కమాండెంట్లు రతన్లాల్, నరేశ్ కేఆర్ షేరన్, ఏసీపీలు జి.కృష్ణ, రమేశ్, వెంకటేశ్వర్లు, రాఘవేంద్రరావు, ప్రతాప్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రామగుండం సీపీ శ్రీనివాస్ -
నీటి సమస్య లేకుండా చర్యలు
పాలకుర్తి(రామగుండం): గ్రామాల్లో నీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అధికారులను ఆదేశించారు. గురువారం పాలకుర్తి మండల కేంద్రంతో పాటు బసంత్నగర్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. అలాగే నర్సరీ లు, సెగ్రిగేషన్ షెడ్డు, పారిశుధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. మండల పంచాయ తీ అధికారి షబ్బీర్పాషా తదితరులున్నారు. కొనుగోలు కేంద్రం తనిఖీకమాన్పూర్(మంథని): మండలంలోని గుండారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా సహకార అధికారి శ్రీమాల తనిఖీ చేశారు. జిల్లాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 72 వేలు, డీఆర్డీవో ఆధ్వర్యంలో 18వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, రైతులకు వారం రోజుల్లో డబ్బులు జమవుతున్నాయని పేర్కొన్నారు. పీఏసీఎస్ కార్యదర్శి తిమ్మరాజు సంతోష్కుమార్ ఉన్నారు. -
కార్మికులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధం
● బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికులకు ఎవరేం చేశారో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తేల్చుకుందామని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సవాల్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పడం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్కే చెల్లిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా పలు పార్టీలు మారిన ఆయన అసలు ఏ పార్టీలో ఉంటాడో ప్రజలకు చెప్పాలన్నారు. 26ఏళ్లుగా సింగరేణి కార్మికునిగా పనిచేసిన తనకు ఈప్రాంత కార్మికుల కష్టాలు పూర్తిగా తెలుసన్నారు. జీడీకే–7ఎల్ఈపీగనిలో నీట మునిగి కార్మికులు మృతిచెందిన సమయంలో చంద్రబాబును ప్రశ్నించినందుకు 11రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చానన్నారు. 30ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏఒక్క ఆరోపణ లేదని, ఏదైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తావా అని సవాల్ చేశారు. దాడులు చేస్తే సహించం రామగిరి(మంథని): ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్నారు. గురువారం బేగంపేటకు చెందిన బుర్ర శంకర్గౌడ్ గాయపడగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి పరామర్శించారు. దాడికి పాల్పిడినవారిని చట్టపరంగా శిక్షించలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు మిర్యాల రాజిరెడ్డి, పీటీ స్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019