breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ధైర్యాన్నిచ్చి.. ప్రాణాలు నిలిపి
● కరోనా కష్టకాలంలో ప్రజలకు భరోసా కల్పించిన బుగ్గన ● సొంత నిధులతో ప్రజలకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ ● డోన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు ● నాడు పత్తాలేని 50 ఏళ్ల రాజకీయ ఉద్దండులుడోన్: ప్రజా క్షేత్రంలో ఉన్న రాజకీయ నేతలు ప్రజల యోగ క్షేమాల కోసం బాధ్యతాయుతంగా పనిచేయడం కనీస ధర్మం. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అదే సమయంలో డోన్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధైర్యాన్ని ఇచ్చి ప్రాణాలు నిలిపారు. లాక్డౌన్ సమయంలో కూడా వీధివీధికి తిరిగి ప్రజల్లో నెలకొన్న ఆందోళనను పారద్రోలేందుకు ప్రయత్నించారు. కరోనా వైరస్ మూలంగా పిట్టల్లా రాలిపోతున్న ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం మండలానికి ఒక క్వారంటైన్ ఏర్పాటు చేయగా, మంత్రి బుగ్గన స్వయంగా ఆ క్వారంటైన్లోని రోగుల యోగ క్షేమాలను నిరంతరం పర్యవేక్షించారు. కరోనా వైరస్ బారిన ప్రజలు పడకుండా స్వీయ రక్షణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన 3 లక్షల మాస్కులు, శానిటైజర్లను సొంత ఖర్చులతో ప్రజలకు పంపిణీ చేశారు. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోగుల కోసం 3 వేల బెడ్ల స్థాయి నుంచి 5వేల బెడ్ల స్థాయికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసేందుకు చొరవ చూపారు. లాక్డౌన్ మూలంగా జీవనోపాధి కరువై తింటి గింజల కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి అభినందనలను అందుకున్నారు. అలాగే వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేశా రు. ఇలా ప్రత్యేకంగా 30 పడకలకు 24 గంటలపాటు నిరంతరంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించే ఏర్పాటు చేశారు. తనవంతు బాధ్యతగా మంత్రి బుగ్గన ప్రజల మధ్యనే ఉంటూ కష్ట సుఖాలు పాలుపంచుకొని మనోధైర్యాన్ని కలిగించి ఆనాడు అండగా నిలిచిన విషయాన్ని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. నాడు పరార్... నేడు ముసలి కన్నీరు కరోనా కష్టకాలంలో విలవిలలాడుతున్న నియోజకవర్గ ప్రజలకు మనోధైర్యం కలిగించేందుకు ఇక్కడి నుంచి 50 ఏళ్లు ప్రాతినిథ్యం వహించానని చెప్పుకుంటున్న ఏ ఒక్క నాయకుడు ప్రయత్నించ లేదు. కనీసం కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించే తీరిక కూడా కోట్ల, కేఈ కుటుంబ సభ్యులకు లేకుండా పోయింది. నేడు ఎన్నికల వేళ అదే నాయకులు ఊరూరు తిరుగుతూ ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ మభ్య పెడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందినప్పుడు ప్రజల బాబోగులు పట్టించుకోకుండా ఎక్కడో దాచుకున్న ఆ రెండు కుటుంబాలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. -
No Headline
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు రంగమ్మ. మండల కేంద్రం కొలిమిగుండ్లలోని పోస్టాఫీస్ సమీపంలో నివాసం ఉంటుంది. వయస్సు మీద పడటంతో పాటు కాలు విరగడంతో స్టాండ్ సాయంతో తీవ్రమైన ఎండలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కు అతి కష్టంగా చేరుకుంది. ఓ వైపు ఎండలకు తాళలేక పోతేంటే మరో వైపు పింఛన్ కోసం ఇంతలా కష్టపెడుతున్నారని కన్నీటి పర్యంతమైంది. గతంలో ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్లని, రెండు నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. – కొలిమిగుండ్లఇంత కష్టపెడతారా.. -
మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చాయి
ఐదేళ్ల పాటు ఇంటి వద్దనే వలంటీర్లు పింఛన్లు అందజేశారు. ఇప్పుడు రెండు నెలల నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు అవస్థలు పడుతున్నాం. మే నెల పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో వేయడంతో డబ్బులు తీసుకునేందుకు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2019 సంవత్సరానికి ముందు పడిన కష్టాలు గుర్తుకొచ్చాయి. పింఛన్ల పంపిణీలో చంద్రబాబు మాలాంటి వృద్ధులపై కక్ష కట్టడం సరికాదు. – నారాయణ, పింఛన్ లబ్ధిదారుడు, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం ఎందుకు ఇలా చేస్తున్నాడో వలంటీర్ ద్వారా వేరుగా ఇంటికే ఒకటో తేదీన పింఛన్ ఇస్తుంటే టీడీపీ నాయకులు ఎందుకు అడ్డుకున్నారో తెలియడం లేదు. ముసలోళ్లు బ్యాంకులకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే ఆటో ఖర్చులు ఎవరు ఇస్తారు. నాకు గోస్పాడు బ్యాంక్లో ఖాతా ఉంది. అందులో నా పింఛన్ డబ్బు వేశారని సచివాలయ సిబ్బంది చెప్పారు. వెళ్లాలంటే నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముసలోల్లను ఇలా ఇబ్బంది పెట్టే వారికి ఓటుతో గుణపాఠం చెబుతాం. – సెబాస్టిన్, పసురపాడు, గోస్పాడు మండలం బాబు ఎంత పని చేశావయ్యా.. మా మనవడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాటు పింఛన్ సొమ్ము కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఠంఛన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేవారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నాం. బాబుకు మా ఉసురు తగులుతుంది. వలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడం దారుణం. పింఛన్ తీసుకునేవాళ్లంతా ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతారు. – చింతా సుశీలమ్మ, వెంకటలక్ష్మమ్మ, ఉయ్యాలవాడ ఆధార్ లింక్ కాలేదట వలంటీర్లను రాకుండా చంద్రబాబునాయుడు అడ్డుకోవడం బాధాకరం. నాకు ఆత్మకూరు బ్యాంక్లో అకౌంట్ ఉండటంతో పొద్దునే పోయా. రెండు గంటల పాటు క్యూలో ఉండి అడిగితే నా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాలేదని పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరినీ అడిగాలో దిక్కుతోచడం లేదు. చంద్రబాబుకు పేదలు బాగుపడితే సహించదు. కరివేన నుంచి ఆత్మకూరుకు వచ్చిపోవాలంటే రూ. 50 ఖర్చు అవుతుంది. – వెంకటలక్ష్మమ్మ, కరివేన,ఆత్మకూరు మండలం -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
నంద్యాల(అర్బన్): ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ఓటు హక్కుపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామన్నారు. 2019 ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో 70 శాతం పోలింగ్ జరిగిందని, ఈ విడత ఎన్నికల్లో 85 నుంచి 90 శాతం పోలింగ్ కావాలని సూచించారు. మద్యం, నగదు ఇతర ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. 18–19 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో ఓటర్ స్లిప్లు ఇంటింటికీ పంపిస్తామన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలందరి చేత ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి -
నిప్పుల వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తోంది. గురువారం భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉండగా.. ఏకంగా 22 మండలాల్లో హీట్వేవ్ నమోదైంది. కర్నూలు జిల్లాలో గూడూరు, కౌతాళం మండలాల్లో హీట్ వేవ్ నమోదు కావడం గమనార్హం. వడగాడ్పుల తీవ్రతకు వృద్ధులు, బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్ల లు, రోగులు అల్లాడుతున్నారు. నంద్యాల జిల్లాలోని 8 మండలాల్లో 46 డిగ్రీలపైన, 10 మండలాల్లో 45 డిగ్రీలకుపైన, 4 మండలాల్లో 44 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్లలో 46.7, ఆళ్లగడ్డలో 46.6, మహానందిలో 46.4, నందికొట్కూరు, సంజామలలో 46.3, దొర్నిపాడు, కోవెలకుంట్లలో 46.1, పాణ్యంలో 45.9, మిడుతూరులో 45.9, బండిఆత్మకూరులో 45.7, శ్రీశైలంలో 45.6, రుద్రవరంలో 45.5, పగిడ్యాలలో 45.3, ఆత్మకూరు, చాగలమర్రిలో 45.2, కొత్తపల్లిలో 45.1, శిరువెళ్లలో 45, గడివేములలో 44.9, పాములపాడు, అవుకులో 44.7, నంద్యాలలో 44.6 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మండలాల్లో హీట్వేవ్ నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా గూడూరు, కర్నూలులో 45.3, కౌతాళంలో 44.9, ఎమ్మిగనూరులో 44.5, కోడుమూరులో 44.4 సి..బెళగల్లో 44.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో ఆళ్లగడ్డ, దొర్నిపాడు, నంద్యాల, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు మండలాల్లో హీట్వేవ్ నమోదయ్యే అవకాశం ఉంది. బనగానపల్లి, డోన్లో 46.7 డిగ్రీలు కర్నూలు, గూడూరుల్లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019