breaking news
-
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
● మేకపాటి రాజగోపాల్రెడ్డి కొండాపురం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి కోరారు. గురువారం కొండాపురం మండలంలోని గరిమెనపెంట, చింతలదేవి, ఉప్పలూరు, గొట్టిగుండాల పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక నవరత్నాల పథకాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఈ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరలా నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ నవరత్నాల పథకాలను కొనసాగిస్తూ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా రూపకల్పన చేశారని తెలిపారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే పేద, బడుగు, బలహీనవర్గాలకు ప్రతి పథకం ఇంటికే చేరుతుందన్నారు. చంద్రబాబు గతంలో 600 హామీలిచ్చి ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. మరలా ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేసేందుకు జనసేన, బీజేపీలతో కలిసి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ప్రజలు దీనిని గమనించాలని కోరారు. వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడని, ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనను గెలిపించుకుంటే విజయసాయిరెడ్డి ద్వారా ఉదయగిరిని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చిమిలి రవీంద్ర, గుడవళ్లూరు సొసైటీ అధ్యక్షుడు కర్తం శ్రీనివాసులురెడ్డి, జేసీఎస్ కన్వీనర్ యారవ నరసింహరావు, ఎంపీటీసీ సభ్యులు గోపిదేశి యానాదమ్మ, మేకల కొండలరావు, వేమిరెడ్డి మల్లికార్జున్రెడ్డి, గరిమెనపెంట సర్పంచ్ గున్నా విజయమ్మ, నాయకులు యారవ వెంకటేశ్వర్లు, ముసలారెడ్డి, వీరెళ్ల చంద్రయ్య, తిమ్మారెడ్డి రమణారెడ్డి, శ్రీనివాసులు, మన్నం వెంకటసుబ్బయ్య, ఎడ్లపల్లి వెంకటరమణయ్య, చిమిలి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పచ్చి అబద్ధాలకోరు చంద్రబాబు
● ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఆత్మకూరు: వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇతరులు చేసిన అభివృద్ధిని సైతం తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకొనేందుకు ప్రయత్నించి నవ్వులపాలవుతున్నారు. ఇటీవల ఆత్మకూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు పలికిన అబద్ధాలే ఇందుకు నిదర్శనం. ఆయన మాట్లాడిన మాటలు, వాస్తవాలను పరిశీలిస్తే.. చంద్రబాబు : సోమశిల జలాశయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పూర్తి చేసిన విషయం మీకు తెలుసు కదా తమ్ముళ్లూ.. వాస్తవం: ఎన్టీ రామారావు తన హయాంలో సోమశిల జలాశయంలో 40 నుంచి 50 టీఎంసీల నీరు నిల్వ చేసేలా కొంతమేర పనులు చేయించారు. అనంతరం 2004లో జలయజ్ఞం పథకంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 78 టీఎంసీల నీరు నిలిచేలా జలాశయం వెనుక ప్రాంతంలోని (వైఎస్సార్ జిల్లా) సుమారు 20 గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి కోర్టు కేసులను తప్పించి పనులు పూర్తి చేయించారు. ఆయన హయాంలోనే జలాశయంలో 78 టీఎంసీల నీరు నిలిపి రికార్డ్ సృష్టించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనూ 78 టీఎంసీల నీరు నిలిచేలా (2021) జలాశయానికి పూర్తి చేయాల్సిన మరమ్మతులు చేయించి ఆ మేరకు నీరు నిలిపిన ఘనత దక్కించుకున్నారు. ఇది మరిచిన చంద్రబాబు జలాశయం అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. చంద్రబాబు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాలువల్లో పూడికతీత పనులు చేశారా.. సాగునీరు ఇచ్చారా తమ్ముళ్లూ.. వాస్తవం : టీడీపీ పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్రెడ్డి తన సొంత నిధులతో జేసీబీ యంత్రాలను ఆత్మకూరు, చేజర్ల, ఏఎస్పేట, అనంతసాగరం మండలాల్లో ఏర్పాటు చేసి కాలువల్లో పూడికతీత పనులు చేయించారు. ఐఏబీ సమావేశంలో నిర్ణయం మేరకు తొలుత డెల్టాకు, అనంతరం నాన్డెల్టాకు సాగునీరు అందివ్వడం పరిపాటిగా ఉండేది. అయితే గౌతమ్రెడ్డి జిల్లా ఐఏబీ సమావేశంలో మాట్లాడి డెల్టాతో సమానంగా నాన్డెల్టాకు కూడా సాగునీరు అందించారు. అలాగే ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి కూడా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కాలువల్లో పూడికతీత పనులు చేయించారు. ఆత్మకూరు తూర్పుపొలాలకు సాగునీరు అందించే పంపింగ్ స్కీం మరమ్మతులకు గురైతే ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి రూ.5 లక్షల సొంత నిధులను వెచ్చించి మరమ్మతులు చేయించి ఆ పొలాలకు సాగునీరు అందించారు. చంద్రబాబు : మెట్ట ప్రాంతాల అభివృద్ధి కోసం హైలెవల్ కెనాల్ నిర్మాణం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటకెక్కించింది కదా తమ్ముళ్లూ.. వాస్తవం : మెట్ట ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్మిస్తున్న హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పలుమార్లు పరిశీలించారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయి అధికారులు, ప్రాజెక్ట్ అధికారులతో కలిసి హైలెవల్ కెనాల్ పనులు జరిగే గ్రామాల్లోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పనులు వేగవంతం అయ్యేలా చేశారు. అయితే 2015 నుంచి 2018 వరకు టీడీపీ పాలనలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన ఆనం రామనారాయణరెడ్డి హైలెవల్ కెనాల్ పనుల ఊసేఎత్తని విషయాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు : ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరును అభివృద్ధి చేశారు.. నిజమా.. కాదా.. తమ్ముళ్లూ.. వాస్తవం : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో, అనంతరం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆత్మకూరులో కొన్ని భవనాలు, మున్సిపాలిటీ ఏర్పాటు తదితర పనులు జరిగాయి. అవి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. -
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించాలి ●
● అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలి పొదలకూరు: క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్వలి సిబ్బందిని ఆదేశించారు. ఆయన గురువారం పొదలకూరులోని సీహెచ్సీని, మహ్మదాపురం పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న 22 హెల్త్ వెల్నెస్ సెంటర్లలో సిబ్బంది అందరూ క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు వస్తుంటే వెంటనే వారికి క్షయ పరీక్షలు నిర్వహించాలన్నారు. పెద్దలకు టీబీ వ్యాధి రాకుండా బీసీజీ వ్యాక్సిన్ ఈ నెల 16వ తేదీ నుంచి వేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కుష్టువ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలిపారు. విరువూరు, తాటిపర్తి హెల్త్ వెల్నెస్ సెంటర్లను డాక్టర్ ఖాదర్వలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట పీహెచ్సీ వైద్యాధికారి నరసింహారావు, డాక్టర్ స్రవంతి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ పద్మావతి, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాసులు, శబరీనాథ్ తదితరులు ఉన్నారు. -
సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యం
● రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కావలి: ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే అది జగనన్నతోనే సాధ్యమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని మద్దురుపాడు ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డితో కలిసి గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీద మస్తాన్రావు మాట్లాడుతూ కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితే ఉండాలంటే ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపై సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉండేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కావలి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. మరోసారి వైఎస్సార్సీపీని గెలిపిస్తే కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుందని తెలిపారు. నెల్లూరు ఎంపీగా వి.విజయసాయిరెడ్డిని, కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. ప్రజలు వేసే ఓటు రానున్న ఐదేళ్లలో వారి భవిష్యత్ను నిర్ణయిస్తుందని తెలిపారు. -
టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోవూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రాఫ్ పడిపోతుండడంతో ఆ పార్టీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. ప్రశాంతమైన గ్రామాల్లో రాజకీయ కక్షలకు ఆజ్యం పోస్తున్నారు. ఎన్నికల వేళ టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నోట్ల కట్టలతో వలస నేతలను సంతలో సరుకులా కొనుగోలు చేసినా క్షేత్రస్థాయిలో ఓటర్లు మాత్రం అమ్ముడుపోయిన నేతలను ఛీదరించుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే జై కొడుతున్నారు. దీంతో ఓటమి భయం పట్టుకున్న పచ్చనేతలు గ్రామాల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడవలూరు మండలం పార్లపల్లిలో టీడీపీ నేతలు ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. వారు పవిత్రంగా భావించే మసీదును కూల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్లపల్లిలో ముస్లింలకు ప్రార్థనా మందిరానికి (మసీదుకు) శాశ్వత భవనం లేక స్థానికంగానే పాకలో ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే శాశ్వత భవనం ఏర్పాటు చేసుకుందామని భావించి స్థానికంగా అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో మసీదు నిర్మాణానికి పూనుకున్నారు. ముస్లింలతోపాటు కొందరు దాతల సాయంతో నిర్మాణం ప్రారంభించుకున్నారు. ఎన్నికల వేళ ఆ గ్రామంలో ముస్లింలందరూ వైఎస్సార్సీపీకి సానుభూతిపరులుగా ఉండడంతో జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ నేతలు మసీదు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించుకుంటున్నారని సాకు చూపి అధికారులను పంపి నిర్మాణాన్ని నిలిపివేసే ప్రయత్నాలు చేశారు. కానీ ముస్లింలందరూ ఏకం కావడంతో అధికారులు మిన్నకుండిపోయారు. టీడీపీ నేతలు పన్నిన కుట్రలు ఫలించకపోవడంతో రాత్రికి రాత్రే నూతన నిర్మాణ భవనాన్ని కూల్చివేశారు. ఎవరో గుర్తుతెలియని దుండగలు చేసినట్లుగా కట్టుకథ అల్లారు. ఈ ఘటనకు సంబంధించి తమ మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ నేతలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేసి విడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న ఓ టీడీపీ నేతపై అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన వేమిరెడ్డి పార్లపల్లిలో జరిగిన ఘటన వెలుగులోకి వస్తే జిల్లాలో పెద్ద అలజడి రేగుతుందని భావించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన అనుచరుల ద్వారా ముస్లింలతో రాయబారాలు నడిపినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత మసీదు నిర్మాణం చేయిస్తానంటూ వారిని ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. కోవూరులో రెచ్చిపోతున్న పచ్చ మూకలు విడవలూరు మండలం పార్లపల్లిలో ముస్లింల మనోభావాలపై దాడి నూతనంగా నిర్మించుకుంటున్న మసీదును కూల్చేసిన దుండగులు టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మైనారిటీలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019