breaking news
-
సెల్ఫోన్ పోగొట్టుకుంటే ఇలా చేయండి..
సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే.. www.ceir.gov.in పోర్టల్ ఓపెన్ చేయాలి. అందులో బ్లాక్ ఫోన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మొబైల్ నంబర్–1, మొబైల్ నంబర్–2, సెల్ ఫోన్ బ్రాండ్ మోడల్, ఇన్వాయిస్ (బిల్లు) ఫొటో సూచించిన గడుల్లో నింపాలి. పోగొట్టుకున్న స్థలం, తేదీ ఇతర చిరునామాతో పాటు పోలీస్ ఫిర్యాదు నంబర్, ఫోన్ యజమాని చిరునామా, ఈమెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులతో సూచించిన బాక్సుల్లో నింపాలి. వెంటనే సెల్ఫోన్ (పాత నంబర్ మీద తీసుకున్న కొత్త సిమ్) నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ దానంతట అదే బ్లాక్ అవుతు ంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్ చేయలేరు.. అందులో ఉండే డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ చోరీ చేసిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే.. మీ నంబర్కు మె సేజ్ వస్తుంది. ఆ సందేశం ఆధారంగా ఫోన్ ఎ క్కడ ఉన్నా పట్టుకోవడం సులభతరమవుతుంది. -
5న రాహుల్గాంధీ రాక
ఎర్రవల్లిచౌరస్తా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న ఎర్రవల్లి మండలకేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీచైర్పర్సన్ సరిత గురువారం సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఎర్రవల్లిలో లక్షమందితో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు అగ్రనేత రాహుల్గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినట్లుగానే కేంద్రంలో కూడా అధికారం చేపట్టేలా దేశవ్యాప్తంగా చేపట్టనున్న సంక్షేమ పథకాలతో పాటు ఐదు గ్యారంటీల గురించి రాహుల్ ప్రకటిస్తారని చెప్పారు. అలాగే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే వివిద అభివృద్ధి గురించి సీఎం రేవంత్ వివరిస్తారని తెలిపారు. సభకు నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రవల్లి చౌరస్తాలో భారీ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించిన సంపత్, మల్లురవి -
నాగర్కర్నూల్ జిల్లాలో..
గురువారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా.. మండలం ఉష్ణోగ్రతలు జడ్చర్ల 45.1 చిన్నచింతకుంట 45.0 బాలానగర్ 44.9 మహబూబ్నగర్ 44.4 అడ్డాకుల 44.0 మండలం ఉష్ణోగ్రతలు వంగూరు 46.0 కొల్లాపూర్ 46.0 వెల్దండ 45.4 కల్వకుర్తి 45.0 బిజినేపల్లి 44.5 -
క్రీడా సామగ్రి పంపిణీ
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన సామగ్రిని గురువారం కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ బాలబాలికలకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇచ్చేందుకుగాను 10 ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం, జూనియర్ అసిస్టెంట్ అమరేశ్వర్రావు, ఎం.కృష్ణయ్య, కుమారస్వామి, కుర్మయ్య, రామకృష్ణ పాల్గొన్నారు. ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలి నాగర్కర్నూల్ క్రైం: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 16వ తేదీలోగా ఫీజు చెల్లించాలని డీఈఓ గోవిందరాజులు గురువారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ. 110, అంతకంటే ఎక్కువగా ఉంటే రూ.125 ఫీజు సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు చెల్లించాలని సూచించారు. జిల్లా టాపర్లకు అభినందన లింగాల/చారకొండ: లింగాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీలో అవుసలికుంటకు చెందిన విద్యార్థి బాషమోని సింధూ 944/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్గా సాధించింది. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం విద్యార్థిని సింధూను కలెక్టర్ ఉదయ్కుమార్, డీఈఓ గోవిందురాజులు శాలువాతో సత్కరించి, ప్రశంసాపత్రం అందజేశారు. కేజీబీవీ ఎస్ఓ శారదను అభినందించారు. ● ఇంటర్, ఎస్ఎస్సీ ఫలితాల్లో చారకొండ కేజీబీవీ విద్యార్థిని ఎం.శ్రావణి బైపీసీలో 418/440, పదో తరగతి విద్యార్థి పగిల్ల వరలక్ష్మి 9.7 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. వీరిని కలెక్టర్ ఉదయ్కుమార్ సత్కరించి, అభినందించారు. సీపెట్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్, కెమికల్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీ హైదరాబాద్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ ట్రైనింగ్ ఇన్చార్జ్ ఆంజనేయశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ విద్యార్థులకు పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్, అండ్ టెస్టింగ్ కోర్సు, ఎస్సెస్సీ వారికి ప్లాస్టిక్ టెక్నాలజీ అండ్ మౌల్డింగ్ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఆసక్తి గలవారు ఆన్లైన్లో వచ్చే నెల 9లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం సెల్ నం.94948 44571ను సంప్రదించాలని సూచించారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,010 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగకు క్వింటాలు గరిష్టంగా రూ.7,010, కనిష్టంగా రూ.4,815 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,991, ఆముదాలు రూ.5,567, జొన్నలు గరిష్టంగా రూ.4,777, కనిష్టంగా రూ.2,110, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,570, కనిష్టంగా రూ.2,001, హంస గరిష్టంగా రూ.2,150, కనిష్టంగా రూ.1,929, రాగులు గరిష్టంగా రూ.3,259, కనిష్టంగా రూ.2,000 చొప్పున వచ్చాయి. -
సత్ఫలితం
సాంకేతికతతో..నాగర్కర్నూల్ క్రైం: ప్రస్తుత జీవనశైలిలో సెల్ఫోన్ అత్యంత కీలకంగా మారింది. విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. ఏదేని సమాచారం తెలుసుకోవాలన్నా.. నగదు చెల్లింపులు చేయాలన్నా.. ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా ఫోన్పైనే ఆధారపడుతున్నారు. వ్యక్తిగత, వృత్తి సమాచారాన్ని పలు సాఫ్ట్ కాపీల రూపంలో ఫోన్లోనే భద్రపరుచుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న మొబైల్ ఫోన్ చోరీకి గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనవసరం లేదు. పోగొట్టుకున్న ఫోన్ కంటే.. అందులో ఉండే డేటా కోసం ఆందోళన చెందుతుంటారు. మిస్సింగ్, చోరీలకు గురైన సెల్ఫోన్లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. సెల్ఫోన్ల గుర్తింపునకు కేంద్రం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ విధానం మరింత చేయూతనిస్తోంది. 466 ఫోన్లు రికవరీ.. సెల్ఫోన్ చోరీకి గురైన వారితో పాటు ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు పోలీసులు సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫోన్లు గుర్తించి, రికవరీ చేస్తున్నారు. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్లలో ఇప్పటి వరకు 466 సెల్ఫోన్లను బాధితులకు అప్పగించారు. మరో 100 ఫోన్లు ఇతర రాష్ట్రాలలో ట్రేస్ అయి ఉన్నాయని.. వాటిని కూడా త్వరలోనే బాధితులకు అందజేస్తామని ఎస్పీ తెలిపారు. సీఈఐఆర్ టెక్నాలజీతో సెల్ఫోన్ గుర్తింపు సులభతరంగా మారింది. ● సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్ కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు అది చోరీ చేసిందా లేక బ్లాక్ లిస్టులో ఉందా.. అన్న విషయం కేవైఎం (నో యూవర్ మొబైల్) విధానంలో ముందే తెలుసుకోవచ్చు. మొబైల్లో కేవైఎం అని టైప్చేసి, ఐఎంఈఐ నంబర్ను 14422కు ఎస్ఎంఎస్ చేసి తెలుసుకోవచ్చు.సాంకేతికపై పూర్తిస్థాయిలో శిక్షణ.. ఏడాది కాలంలో సెల్ఫోన్ పోగొట్టుకున్న, చోరీకి గురైన వారి ఫిర్యాదు మేరకు 466 ఫోన్లు రికవరీ చేశాం. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో సిబ్బందికి సీఈఐఆర్ సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. సెల్ఫోన్ పోగొట్టుకున్న, చోరీకి గురైన వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని నమోదుచేస్తే, త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుంది. – గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019