breaking news
Ad - Sakshi_Home_Sticky
-
వెనుకంజలో ఉన్న పీహెచ్సీలపై ప్రత్యేక దృష్టి
పార్వతీపురంటౌన్: జిల్లాలో వెనుకంజలో ఉన్న పీహెచ్సీలపై ప్రత్యేక దృషి్ట్ సారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె. విజయపార్వతి అన్నారు. డీఎంహెచ్ఓ గా బుధవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన ఆమె ఆరోగ్య కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య కార్యక్రమాల జిల్లా ప్రగతి నివేదికలను పరిశీలించారు. ముఖ్యంగా గిరిజన, గిరిశిఖర ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు చేరువవడంలో జాప్యం లేకుండా శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని 14 వార్డు అంగన్వాడీ కేంద్రంలో వ్యాధినిరోధక టీకా కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఘుకుమార్, ఎఫ్డీపీ నోడల్ అధికారి డాక్టర్ వినోద్, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సుకుమార్, అఫ్తాల్మిక్ ఆఫీసర్ నగేష్రెడ్డి, కార్యాలయం సూపరింటెండెంట్ కామేశ్వరరావు, సిబ్బంది తదితరులు ఉన్నారు. డీఎంహెచ్ఓ విజయపార్వతి -
త్వరగా ఏర్పాట్లు పూర్తిచేయాలి
పార్వతీపురం: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కేటాయించి డా.వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలో కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటును కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్ బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంట్తో పాటు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఉద్యాన కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు గదులు, కంట్రోల్ రూమ్, ఏర్పాటు చేయాల్సిన వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించారు. వివిధ శాఖలకు కేటాయించిన పనుల పురోగతిని సమీక్షించారు. రెవెన్యూ, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల అధికారులకు వారికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్స్ వద్ద ిసీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్.శోభిక, కంట్రోల్ రూమ్ ఇన్చార్జ్, ఎస్డీసీ ఆర్వీ సూర్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బి. సత్యనారాయణ, రహదారులు భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారి ఎస్. వేణుగోపాలరావు, ఈపీడీసీఎల్ ఈఈ పి.త్రినాథ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నిషాంత్కుమార్ -
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రి
● వైద్యరంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర సాలూరు: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి పాలనలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దారని వైఎస్సార్సీపీ సాలూరు అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర అన్నారు. ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించుకునే తనకు అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పలుమార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం సాలూరు పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి చెవి సంబంధిత పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి పాలనలో వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. అధునాతన పరికరాలు, సకల వసతులు, నిపుణులైన వైద్యులతో ప్రభుత్వ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త జీవం పోశారన్నారు. ఇటీవల తన భార్యకు యాక్సిడెంట్ కాగా ఈ ప్రభుత్వ ఆస్పత్రికే తీసుకువచ్చి చికిత్స చేయించినట్లు గుర్తుచేశారు. సాలూరులో త్వరలోనే వందపడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు. -
అందమైన ఆరోగ్య భవంతులు
● నాడు– నేడు నిధులతో ఆస్పత్రులకు కొత్త హంగులు ● రోగులకు చేరువైన వైద్యసౌకర్యం ఆస్పత్రుల రూపురేఖలు మారాయివైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మా కురుపాం ఆస్పత్రి రూపు రేఖలు మారాయి. నాడు–నేడు కార్యక్రమంలో పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే భయంవేసేది. కనీస వసతులు ఉండేవి కాదు. జగనన్న ప్రభుత్వంలో ఆస్పత్రుల రూపురేఖలు అందంగా మారాయి. – మాలతీరావు, కురుపాంపార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలు మారాయి. పార్వతీపురం పట్టణంలో జిల్లా ఆస్పత్రి, సాలూరు, పాలకొండ, సీతంపేటలలో ఏరియా ఆస్పత్రులు ఉన్నా యి. వాటితోపాటు మరో 3 కమ్యూనిటీ హెల్త్సెంట ర్లు, 37ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఆస్పత్రుల్లో పాడైన ప్రతి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరించింది. ఇందులో భాగంగా నాడు–నేడు కింద కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు మారాయి. ఇందుకోసం రూ.వందల కోట్లను ప్రభుత్వం ఖర్చుచేసింది. నూతన భవనాల్లో ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి. అందుబాటులో అన్ని రకాల వైద్యసేవలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఒక గైనకాలజిస్టు, ఒక పిడియాట్రిస్ట్, ఒక అనస్థీషియన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యులు ఉంటారు. వారితో పాటు నర్సులు, ఇతర సిబ్బంది కలిపి ప్రతి సీచ్సీలో 31 పోస్టులు మంజూరు చేశారు. జిల్లాలో అన్ని చోట్ల వైద్యం సమయానికి అందుతోంది. ఆయా ఆస్పుత్రుల పరిధిలో సాధారణ, సిజేరియన్ ప్రసవాలతో పాటు రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారికి చికిత్సతో పాటు అత్యవసర మెడికల్ వైద్యాన్ని కూడా అందించేందుకు వైద్యులను నియమించారు. ఈ మేరకు ఆయా సీహెచ్సీ భవనాల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నారు. పెద్ద పెద్ద జబ్బులకు మాత్రమే జిల్లా ఆస్పత్రులకు రోగులను రిఫర్ చేసే విధంగా వైద్యులను తీర్చిదిద్దారు. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పడకల పెంపు జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో అధునాతన వైద్యసేవలు అందుతున్నాయి. వైద్య పరీక్షల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లకుండా అధునిక ల్యాబ్ పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పడకల సంఖ్యను పెంచి మరింత ఎక్కువమందికి వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో రూ. 21.15 కోట్లతో 100 నుంచి 150 పడకలకు పెంచారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో రూ.19.07 కోట్లతో 30 నుంచి 100 పడకలకు పెంచుతూ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. జిల్లాకు రెండు మల్టీస్పెషాల్టీ ఆస్పత్రులు ఒకప్పుడు గిరిజన ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కావాలంటే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. గిరిజనులెవరూ వైద్యం అందక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నూతనంగా ఏర్పడిన మన్యం జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో జిల్లాకు రెండు మల్టీస్పెషాల్టీ ఆస్పత్రులను ప్రభుత్వం మంజూరు చేసింది. గిరిజన గ్రామాలకు కేంద్రాలైన పార్వతీపురం, సీతంపేటలో ఒక్కో ఆస్పత్రికి రూ.49.29కోట్లు చొప్పున రెండింటికి రూ.98.58 కోట్లను మంజూరు చేశారు. గతం కన్నా మిన్నగా వైద్యసేవలుపార్వతీపురం పెద్దాస్పత్రిలో గతం కన్నా మిన్నగా వైద్యసేవలు అందిస్తున్నారు. గతంలో ఆస్పత్రికి వెళ్తే సరిగా పట్టించుకునేవారు కాదు. జగన్ బాబు అధికారంలోకి వచ్చాక ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. నాకు యాక్పిడెంట్ జరిగి చేయి విరిగింది. ఉచితంగా శస్త్రచికిత్స చేసి సమయానికి భోజనం అందించేవారు. 2017లో నా ఆరోగ్యం సరిగా లేక ఇక్కడే చేరాను. అప్పుడు కనీస వసతులు లేవు ఇప్పుడు సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారు. –నగిరి రామారావు, పెదగుడబ, గరుగుబిల్లి మండలం గతంలో రిఫర్ చేసేవారు గతంలో పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేరిన రోగులకు చిన్నపాటి సమస్య అయినా శ్రీకాకుళం రిఫర్ చేసేవారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు ఉండేవి కాదు. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏరియా ఆస్పత్రికి కోట్ల రూపాయలు వెచ్చించి ఆస్పత్రిరూపురేఖలు మార్చి, అధునాతన వైద్య పరికరాలు సమకూర్చారు. పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఫలితంగా రిఫర్ కేసులు తగ్గాయి. – గవర ప్రవీణ్కుమార్, అన్నవరం గ్రామం, పాలకొండ మండం -
బాబుకు టాటా చెప్పిన తమ్ముళ్లు
● వైఎస్సార్సీపీలో చేరిన నర్సిపురం టీడీపీ కార్యకర్తలు పార్వతీపురంటౌన్: పార్వతీపురం మండలంలోని నర్సిపురం గ్రామంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఈ మేరకు బుధవారం గ్రామంలోని కాపు వీధికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు, వారికి చెందిన 40 కుటుంబాల వారు వైఎస్సార్సీపీ పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి అలజంగి జోగారావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పిన అలజంగి జోగారావు వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం అందరూ సహకరించాలని మళ్లీ మన జగనన్న ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా పనిచేసి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో తర్లాడ శ్రీను, పారిశర్ల శంకరరావు, సుంకరి గంగరాజు, టి నాగభూషణ, చోడవరపు రాము, వి.ఈశ్వరరావులతో పాటు వారి కుటుంబసభ్యులు ఉన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు పీఏసీఎస్ చైర్మన్ కాపారపు సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ వెంపలి గురురాజు, పార్టీ సీనియర్ నాయకులు శెట్టి వెంకటరమణ, చెరుకుబిల్లి గంగరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాలూరులో 20 కుటుంబాలు సాలూరు: పట్టణంలోని బంగారమ్మపేట, డబ్బివీధికి చెందిన సుమారు 20 కుటుంబాల వారు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. బంగారమ్మపేటలో వైఎస్సార్సీపీ నాయకుడు సింగారపు ఈశ్వరరావు ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎస్పీ సింగారపు శశిభూషణ్, కర్రి అప్పలస్వామి ఆధ్వర్యంలో డబ్బివీధికి చెందిన శంబాన రమణ తదితర 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ సాలూరు అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర పార్టీ కండువాలు వేసి వైఎస్సార్సీపీ లోకి సాదరంగా ఆహ్వానించారు. అందరూ సమష్టిగా పనిచేసి వైఎస్సార్సీపీకి అఖండ మెజార్టీని అందించాలని రాజన్నదొర కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, పార్టీ నాయకులు జర్జాపుసూరిబాబు, జేసీఎస్ కన్వీనర్ గిరిరఘు తదితరులు పాల్గొన్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019