breaking news
-
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి
భైంసాటౌన్: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(వరంగల్) మోహన్రావు అన్నారు. కన్స్ట్రక్షన్ సీఈ కేఎన్ గుత్తాతో కలిసి గురువారం భైంసాకు వచ్చారు. స్థానిక ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద గల విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించారు. విద్యుత్ సరఫరా, ఇబ్బందులు తదితర వివరా లను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఈ జైవంత్రావుచౌహాన్, డీఈఈ (ఎంఆర్టీ) శ్రీనివాస్, డీఈఈ(ఆపరేషన్స్) శ్రీనివాస్రెడ్డి, ఏడీఈ ఆదిత్య, ఏఈలు ఉన్నారు. -
జిల్లాలో పోలీస్ 30 యాక్ట్
నిర్మల్టౌన్: జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలరోజులు(మే 1 నుంచి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నతాఅధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని వివరించారు. ప్రజాధనానికి నష్టం కలిగించే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొన్నారు. నిషేధిత ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిషేధమని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగొద్దని సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. -
ఓట్ ఫ్రమ్ హోమ్
● దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు అవకాశం ● మూడు నియోజకవర్గాల్లో 636 మంది ఓటర్లు ● నేడు, రేపు హోం ఓటింగ్వివరాలు: జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 676 అనుమతించిన ఓట్లు 636 వృద్ధులు 232 దివ్యాంగులు 395 అత్యవసర సేవలు అవసరం గలవారు 9నిర్మల్చైన్గేట్: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. రెండు రోజులు... దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈనెల 3, 4 తేదీల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మధ్యలో ఇంటి నుంచే ఓటు వేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. రిటర్నింగ్ అధికారులు హోం ఓటింగ్ షెడ్యూల్ వివరాలను అభ్యర్థులకు తెలియజేయనున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,23,389 మంది ఓటర్లు నమోదు కాగా.. ఇందులో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు 21,312 మంది ఉన్నారు. ఫారం 12డీ ద్వారా 676 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 636 మంది ఓటు హక్కు పొందగలిగారు. 3న ఓటరు ఇంటికి ఎన్నికల అధికారులు వెళ్తారు. ఆ సమయంలో ఓటరు ఇంట్లో లేనిపక్షంలో తిరిగి 4న వస్తామని, ఇదే చివరి అవకాశమని ఓటరుకు అధికారులు తెలియజేస్తారు. రెండోసారి వెళ్లినప్పుడు కూడా ఓటరు లేకపోతే ఓటు వేసే అవకాశం కోల్పోతారు.సద్వినియోగం చేసుకోవాలి...ఈ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఫారం–12డీ దరఖాస్తు ద్వారా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 3, 4 తేదీల్లో ఓటువేసేలా ఏర్పాట్లు చేశాం. రెండు రోజులపాటు అధికారుల టీంలు ఆయా మండలాల పరిధిలో తిరిగి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుదారుల నుంచి స్వీకరిస్తారు. – ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎన్నికల అధికారి -
● ‘ఆసిఫాబాద్’ సభకు తరలివచ్చిన ప్రజలు ● కుమురంభీం, రాంజీగోండులను స్మరిస్తూ ఉత్సాహం నింపిన సీఎం ● ఆదివాసీ బిడ్డ సుగుణను గెలిపించాలని పిలుపు ● ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ● రేవంత్రెడ్డి పర్యటనతో కాంగ్రెస్లో జోష్
ఆసిఫాబాద్: గిరిజన పోరాట వీరులు కుమురంభీం, రాంజీగోండులను స్మరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. మండుతున్న ఎండల్లోనూ జనజాతర సభకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ పక్కన ఖాళీ స్థలంలో గురువారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు అధ్యక్షతన నిర్వహించిన జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వారం రోజుల నుంచి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, జిల్లా నాయకులతో కలిసి జనసమీకరణ చేపట్టారు. సభ ప్రారంభంలో ప్రాంగణం ఖాళీగా కనిపించినప్పటికీ చివరకు కుర్చీలు పూర్తిగా నిండిపోయాయి. ఖాళీగా ఉన్న కుర్చీల్లోకి ప్రజలను అనుమతించాలని డీసీసీ అధ్యక్షుడు పలుమార్లు పోలీసులను కోరడం కనిపించింది. ఎస్పీ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సభకు వచ్చిన వారిని అడుగడుగునా తనిఖీ చేశారు. మరాఠీ పాటలు.. ప్రసంగాలుజనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4 గంటలకు ఆయన ఆసిఫాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ముఖ్యమంత్రి రాక ఆలస్యం కావడంతో అప్పటివరకు కళాకారులు మరాఠీ పాటలు, నృత్యాలతో అలరించారు. ఉమ్మడి జిల్లా నాయకులతోపాటు ఆదివాసీ, దళిత సంఘాల నాయకులు ప్రసంగించారు. కొంతమంది నేతలు మరాఠీలో ప్రసంగించగా.. మరికొందరు తెలుగులో మాట్లాడారు. సీఎం రాక ముందే డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి జాదవ్ నరేశ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ ప్రసంగించారు. సభావేదిక పైకి చేరుకోగానే ముఖ్యమంత్రి స్టేజీని ఆనుకుని ఏర్పాటు చేసిన ర్యాంపుపై తిరుగుతూ ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. సంక్షేమం.. విమర్శలుఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రసంగం అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. తొలుత అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించిన ఆయన.. ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దాదాపు 25 నిమిషాలపాటు ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘ఇక్కడ సాగు నీరు, పోడు భూముల సమస్య ఉంది. ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు ఏళ్ల క్రితం మంజూరైనప్పటికీ.. ప్రాజెక్టుల్లో నీరున్నప్పటికీ సాగుకు ఉపయోగపడటం లేదు. లక్షన్నర ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యంతో సాగు నీరందడం లేదు’ అంటూ విమర్శించారు. కుమురం భీం ప్రాజెక్టు పూర్తయినా, కాల్వల నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. ఏళ్లుగా ఆసిఫాబాద్ మండలంలోని గుండి బ్రిడ్జి అసంపూర్తిగా ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ‘సీసీఐ పరిశ్రమ మూతపడిందని, ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నిస్తున్న బీజేపీని మీరు రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అక్రమంగా కేసులు పెట్టారని.. కుమురంభీం, రాంజీగోండు స్ఫూర్తిగా పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఉండాలి.. పోడు భూముల పట్టాలు అందాలంటే ఆత్రం సుగుణ గెలవాలని కోరారు. ఈ సందర్భంగా ‘బీజేపీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు ఇచ్చింది అని.. ఆత్రం సుగుణకు లక్ష మెజార్టీ అంటే పక్కా’ అని ప్రజలతో అనిపించి ప్రసంగం ముగించారు. సమావేశంలో మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. కేంద్రంలో అధికారం ఇవ్వండి. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా. ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధితోపాటు ఆరె కులస్తులు, మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించి అన్నివర్గాల సంక్షేమానికి పాటు పడతా. మహిళలకు వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ప్రజల ఆశలను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీయే. – సీతక్క, ఉమ్మడి జిల్లా మంత్రి కొంగు చాపి అడుగుతున్నా.. కొంగుచాపి అడుగుతు న్న ఒక్క అవకాశం ఇవ్వండి.. ఆదరించి గెలిపించండి. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం. 75 సంవత్సరాల చరిత్రలో ఆదివాసీ మహిళకు ఏ పా ర్టీ అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆదివాసీ బిడ్డను గెలిపించాలి. ఆదిలాబాద్ ఎంపీ స్థానం రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి. అభివృద్ధి పనులు, ఆరు గ్యారంటీలను చూసి ఓటేయండి. – ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిరిజర్వేషన్ల రద్దుకు కుట్ర ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ ఆదివాసీ దేవుళ్లను ఎప్పుడూ పూజించడు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పని చేసిన నగేశ్ ప్రజలకు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా అదే బాటలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యురాలైన ఆదివాసీ మహిళ ఆత్రం సుగుణకు టికెట్ కేటాయించింది. అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. – వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే -
సీఎం సమక్షంలో చేరికలు
నిర్మల్/సారంగాపూర్/నర్సాపూర్(జి)/లక్ష్మణ చాంద: కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపదాస్మున్షీ, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, చిన్నారెడ్డి తదితరులను కలిశారు. తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో ఐకేరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరా రు. సీఎం రేవంత్రెడ్డి కండువాలు వేసి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని సీఎం వారికి సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐకేరెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రఘునందన్రెడ్డి హైదరాబాద్లో మాజీ మంత్రి ఐకేరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సారంగాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి సీఎం రేంవత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇంద్రకరణ్రెడ్డి అనుచరులు అయిన నల్ల వెంకట్రామిరెడ్డి, మాధవరావు, మాజీ ఎంపీపీ మహిపాల్రెడ్డి, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆయిటి చందు, కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, వందమందికి పైగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నర్సాపూర్ (జి) మండల జెడ్పీటీసీ చిన్న రామయ్య, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ ఫసి, మాజీ ఉప సర్పంచ్ సట్ల సాయేంధర్, నిర్మల్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ బర్కుంట గంగారాం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019