breaking news
-
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నార్పల/యల్లనూరు/పుట్లూరు: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. గురువారం నార్పల, యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మినారాయణ, జయ ప్రసాద్, సీఐలు శ్రీధర్, సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, ఎంపీడీఓ దస్తగిరి, ఈఓఆర్డీ రాముడు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ అనంతపురం ఎడ్యుకేషన్: ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ సేవలు ఇకపై ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్, అదనపు విద్యార్హతలు చేసేందుకు నేరుగా కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకుండా ఇంటి నుంచే సులభంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర కోర్సులు చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే లాగిన్ వివరాలు, రిజిస్ట్రేషన్ నంబరు ఎస్ఎంఎస్ ద్వారా, ఎంప్లాయిమెంట్ కార్డు లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళ్యాణి విజ్ఞప్తి చేశారు. న్యూస్రీల్ -
No Headline
సాక్షి, పుట్టపర్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 4వ తేదీ (శనివారం) జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టేలా సీఎం సభ ఉండాలని నేతలు భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బి.నవీన్నిశ్చల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హిందూపురానికి వెళ్తారు. అక్కడ సభ అనంతరం హెలికాప్టర్లో పలమనేరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన.. హిందూపురం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ హెలిప్యాడ్ ఏర్పాటు కోసం ఎంజీఎం గ్రౌండ్ను పరిశీలించారు. ఎస్డీజీఎస్ కళాశాల గ్రౌండ్ను కూడా పరిశీలించి హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అధికారుల వెంట వైఎస్సార్ సీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కొండూరు వేణుగోపాల్రెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి, కొల్లకుంట ఆనంద్రెడ్డి తదితరులు ఉన్నారు. 11 గంటలకు హిందూపురం అంబేడ్కర్ సర్కిల్లో బహిరంగ సభ హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన చేసిన ఎస్పీ మాధవరెడ్డి, జేసీ అభిషేక్ కుమార్ -
రోజంతా ముచ్చెమటలు
అనంతపురం అగ్రికల్చర్: తగ్గేదేలే అన్నట్లుగా సూరీడు ప్రతాపం చూపిస్తుండటంతో ‘అనంత’ అగ్నిగోళంలా మండుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం జనజీవనానికి ఇబ్బందిగా మారుతోంది. భానుడి భగభగ లతో బెంబేలెత్తిపోతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీలు, రాత్రిళ్లు 27 నుంచి 32 డిగ్రీలకు ఎగబాకుతున్నాయి. గాలిలో తేమ ఉదయం 40 నుంచి 45 శాతం, మధ్యాహ్న సమయంలో 20 శాతానికి పడిపోతోంది. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న వడగాల్పులు జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాగల నాలుగు రోజులు మరింత వేడి.. రాగల నాలుగు రోజులు ఇలాగే ఉష్ణతాపం కొనసాగే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు రాయలసీమ జిల్లాల పరిధిలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవాలంటే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపారు. భానుడి భగభగలతో జనం బెంబేలు రాగల నాలుగు రోజులూ మరింత ఉష్ణతాపం -
ప్రశాంత నగరి..‘పచ్చ’ గూండాగిరి
అనంతపురం: అనంతపురం నగరం ప్రశాంతతకు మారు పేరు. గొడవలు, కక్షలు, కార్పణ్యాలకు తావులేని ప్రాంతం. అలాంటి నగరంలో అలజడులు రేపేందుకు టీడీపీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారు. కాలనీల్లో ప్రజల మధ్య చిచ్చు రాజేసి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఎత్తుగడ వేస్తున్నారు. ఆయనకు టికెట్తోనే బీజం.. రాప్తాడులో వైఎస్సార్సీపీ నేత భూమి రెడ్డి ప్రసాద్ రెడ్డి హత్య కేసులో నిందితుడైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు అనంతపురం టీడీపీ టికెట్ కేటాయించడంతోనే అరాచక సంస్కృతికి బీజం పడినట్లయింది. టికెట్ ఖరారైన క్షణం నుంచే దగ్గుపాటి చుట్టూ రౌడీ షీటర్లు, హింసా ప్రవృత్తి గల వారు చేరిపోయారు. ఏకంగా రౌడీషీటర్లతోనే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఆయన తన వెంట నేరస్తులను తీసుకెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడిన నగరం రూరల్ పంచాయతీ పరిధిలో నాలుగు రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేత గుజ్జల నగేష్పై హత్యాయత్నం జరిగింది. మారణాయుధాలతో కిరాతకంగా నగేష్పై దాడి చేశారు. పచ్చ మూకలు పట్టపగలే సాగించిన ఈ వికృత క్రీడ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నగేష్ను కింద పడేసి కిరాతకంగా మారణాయుధాలతో దాడి చేస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరలైంది. ప్రధాన నిందితుడు దగ్గుపాటి అనుచరుడు.. నగేష్పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన జయరాం నాయుడు.. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు కావడం గమనార్హం. అనంత పురం రూరల్ పంచాయతీలో జయరాం నాయుడు భూ కబ్జాలకు అంతేలేదని ఆ ప్రాంతవాసులు చెబుతారు. పంచాయితీలు, దందాల్లో ఆరితేరిన వ్యక్తి అని తెలిపారు. ఈయనపై పోలీసుస్టేషన్లలో అనేక కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైఎస్సార్సీపీ నేత నగేష్పై జరిగిన హత్యాయత్నంలోనూ ఈయన కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైన ఆధారాలు కూడా లభించాయి. నగేష్పై కిరాతకంగా దాడి చేసిన నారాయణ స్వామి అలియాస్ పులితో జయరాం నాయుడు తరచూ ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. దాడికి అర గంట ముందు ఫోన్పే ద్వారా రూ.5 వేల నగదును నారాయణ స్వామికి జయరాం నాయుడు పంపినట్లు వెల్లడైంది. అలాంటి వ్యక్తికి అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ వంతపాడుతూ రెండు రోజుల క్రితం నగరంలో హల్చల్ చేయడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో మరెన్ని దారుణాలకు పచ్చ గూండాలు తెరలేపుతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. నేర ప్రవృత్తి గల వ్యక్తికి టికెట్ కేటాయించి అరాచకాలకు తెరతీసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో అరాచక సంస్కృతికి నాంది పలికిన టీడీపీ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బరితెగింపు అందులో భాగంగానే వైఎస్సార్ సీపీ నాయకుడు గుజ్జల నగేష్పై హత్యాయత్నం ప్రధాన నిందితుడు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు నేర ప్రవృత్తి గల వ్యక్తికి టికెట్ ఇచ్చిన చంద్రబాబుపై ప్రజల ఆగ్రహం -
పోస్టల్ బ్యాలెట్కు 23,532 మంది దరఖాస్తు
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లావ్యాప్తంగా 23,532 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ వెల్లడించారు. నిర్దేశించిన తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన గురువారం తెలియజేశారు. ఎన్నికల విధులకు నియమించిన పోలింగ్ అధికారులు,అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్లు, అదేవిధంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వేతర ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు, ఎన్నికల విధుల్లో పనిచేసే ఇతర అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గానికి రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సేవల ఉద్యోగుల కోసం ఒక పోస్టల్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, ప్రభుత్వేతర ఉద్యోగులు తాము ఓటరుగా ఎన్రోల్ అయిన అసెంబ్లీ నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో, పోస్టల్ ఓటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించామన్నారు. ● ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు,అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పించామని కలెక్టర్ చెప్పారు. వీరి కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నిర్దేశించిన తేదీల్లో వెళ్లి ఓటు వేయాలి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్కుమార్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019