breaking news
-
మైనార్టీలకు బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యత
మహబూబ్నగర్ న్యూటౌన్: మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ నిర్మాణం కోసం రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక వసతులతో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాల కోసం రూ.125 కోట్లు, ఇమాం, మౌజంలకు డబు బెడ్రూం ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగలకు, పేద ప్రజలకు ఇచ్చే కానుకలు నిలిచిపోయాయని అన్నారు. పదేళ్లలో మహబూబ్నగర్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, నామినేటెడ్ పదవుల్లో కూడా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం గురించి బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఆలోచన చేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ పక్షాన పోరాటం చేసి నిధులు సాధిస్తానన్నారు. సమావేశంలో మైనారిటీ నాయకులు రెహమాన్, మోసిన్, అహ్మద్, ఇమ్రాన్, మోసిన్ ఖాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా ఎన్నికల విధుల నిర్వహణ
మహబూబ్నగర్ న్యూటౌన్: లోక్సభ ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. గురువారం న్యూఢిల్లీ నుంచి ఆయన పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఎక్కు వ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు చేరుకున్నాయని, ఈవీఎం బ్యాలెట్ యూనిట్ల ఎఫ్ఎల్సీ, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని, హోం ఓటింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తిచేయాలని, హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. పోలింగ్ కంటే ముందుగానే వందశాతం ఓటర్ సమాచార స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందించాలని, పోలింగ్ కేంద్రం లొకేషన్ ఓటర్లకు తెలిసేలా చర్య లు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ సిబ్బందికి ఆహారం, ఇతర వసతులు కల్పించాలన్నారు. పోలింగ్ సకాలంలో ప్రారంభించాలని, అంతకు ముందు మాక్ పోల్ నిర్వహించాలని సూచించారు. సెక్టార్ అధికారులు పోలింగ్ నిర్వహణలో కీలకపాత్ర పోషించాలని, పోలింగ్ రోజు జిల్లాకేంద్రాల్లో నిపుణులైన అధికారులచే కంట్రోల్ రూం, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని, సీ విజిల్ యాప్పై ప్రచారం, పోలింగ్ శాతం పెరిగేలా ఓటరు అవగాహన కల్పించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న, చిన్న ఇబ్బందులను అధిగమించి.. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. మహబూబ్నగర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రవినాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 54 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలినవి త్వరలోనే అందిస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, డబ్బు, మద్యం ప్రభావం లేకుండా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టామన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భూటియా మాట్లాడుతూ నామినేషన్ల దాఖలు చివరి రోజు ను ంచి స్క్రూట్నీ, ఉపసంహరణ, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, వ్యయ పరిశీలన, రిజిష్టర్ల నిర్వహణ అంశాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. వ్యయ పరిశీలకులు వరుణ్ రంగస్వామి మాట్లాడుతూ పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయ రిజిష్టర్లు మొదటి వ్యయ పరిశీలన పూర్తిచేశామన్నారు. ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ స్లిప్పులు వంద శాతం పంపిణీ చేయాలి సీనియర్ డిప్యూటీఎన్నికల కమిషనర్నితేష్ వ్యాస్ -
పోలింగ్ సమయం పొడిగింపు : కలెక్టర్
మహబూబ్నగర్ న్యూటౌన్: పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు రిటర్నింగ్ అధికారి రవినాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ను ఈ నెల 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉండేదన్నారు. ఈసారి ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఓటర్లు ఈ విషయాన్ని గమనించి.. పెద్దఎత్తున పోలింగ్లో పాల్గొనాలని కోరారు. సీపెట్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్, కెమికల్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీ హైదరాబాద్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ ట్రైనింగ్ ఇన్చార్జ్ ఆంజనేయశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ విద్యార్థులకు పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్, అండ్ టెస్టింగ్ కోర్సు, ఎస్సెస్సీ వారికి ప్లాస్టిక్ టెక్నాలజీ అండ్ మౌల్డింగ్ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఆసక్తి గలవారు ఆన్లైన్లో వచ్చే నెల 9లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం సెల్ నం.94948 44571ను సంప్రదించాలని సూచించారు. ఎన్టీఆర్ కళాశాలకుఅభినందన పత్రం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ మేథో హక్కుల అవగాహన మిషన్లో భాగంగా ప్రజల్లో మేథో హక్కులపై విస్తృత అవగాహన కల్పించడం, డిజైన్లు, ట్రేడ్ మార్కులపై సమాజంలో అవగాహన తీసుకువచ్చినందుకు కళాశాలకు అభినందన పత్రం లభించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి అభినందన పత్రం రాగా.. గురువారం పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ఎన్టీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్కు అందజేశారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,010 జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగకు క్వింటాలు గరిష్టంగా రూ.7,010, కనిష్టంగా రూ.4,815 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,991, ఆముదాలు రూ.5,567, జొన్నలు గరిష్టంగా రూ.4,777, కనిష్టంగా రూ.2,110, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,570, కనిష్టంగా రూ.2,001, హంస గరిష్టంగా రూ.2,150, కనిష్టంగా రూ.1,929, రాగులు గరిష్టంగా రూ.3,259, కనిష్టంగా రూ.2,000 చొప్పున వచ్చాయి. సోనామసూరి ధర రూ.2,359 దేవరకద్ర మార్కెట్ యార్డులో గురువారం జరిగిన ఈనామ్ టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.1,904 ధరలు నమోదయ్యాయి. అలాగే హంసకు గరిష్టంగా రూ.1,959, కనిష్టంగా రూ.1,903, ఆముదాలు సరాసరిగా రూ.5,439 ఒకే ధర పలికింది. మార్కెట్కు దాదాపు 3 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
రాయితీకి స్పందన నామమాత్రమే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ముందస్తు ఆస్తిపన్ను (2024–25)కు సంబంధించి స్పందన నామమాత్రంగానే వచ్చింది. ఏటా ఆస్తిపన్నును ముందుగానే రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించింది. వాస్తవానికి మున్సిపల్ అధికారులు ప్రతి ఆరు నెలలకోసారి ఆస్తిపన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసులను చెల్లింపుదారులకు అందజేస్తున్నారు. అయితే పట్టణ ప్రజలు మాత్రం ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే చెల్లిస్తూ వస్తున్నారు. దీనిని అధిగమించడానికి ఈ రాయితీని ప్రవేశపెట్టారు. కాగా, ఇచ్చిన నెల రోజుల గడువు కాస్త గత నెల 30వ తేదీతో ముగిసింది. మున్సిపాలిటీల వారీగా ఇలా.. మహబూబ్నగర్ పట్టణంలో 50,460 అసెస్మెంట్ల (ఇళ్లు, ఇతర వాణిజ్య భవన సముదాయాలు)కు గాను పాత బకాయిలు కలుపుకొని రూ.46.70 కోట్లు ఆస్తిపన్ను రావాల్సి ఉంది. గత నెల 1 నుంచి 30 వరకు ఐదు శాతం రాయితీ కింద 10,133 మంది 2024– 24కి గాను ముందస్తు ఆస్తిపన్ను చెల్లించారు. వీరి ద్వారా మున్సిపాలిటీకి రూ.7.58 కోట్లు (16.23 శాతం) వచ్చింది. దీని కోసం 31 మంది మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరిగారు. ముఖ్యంగా పెద్ద పద్దుల కింద రూ.లక్ష మొదలుకొని రూ.కోటి వరకు చెల్లించే వారు సుమారు వంద మంది ఉండగా అందరి నుంచి వసూలు చేయగలిగారు. ఏకంగా ఈసారి వాసవీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ (రాజ్వీర్– పాత సూర్యలక్ష్మి కాటన్మిల్లు) నుంచి రూ.91 లక్షలు, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నుంచి రూ.43.03 లక్షలు, చెన్నయ్ షాపింగ్ మాల్ నుంచి రూ.6.17 లక్షలు, సుశృత ఆస్పత్రి, పిస్తా హౌస్ నుంచి రూ.ఐదు లక్షల చొప్పున, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) నుంచి రూ.3.09 లక్షలు, మల్లిక ఆస్పత్రి నుంచి రూ.3 లక్షలు, నాగార్జున హైస్కూల్ నుంచి రూ.2.15 లక్షలు, ఎల్ఐసీ నుంచి రూ.లక్ష రాబట్టగలిగారు. ఇక 2023– 24లో సుమారు 48 వేల అసెస్మెంట్లకు గాను గతేడాది ఇదే సమయంలో ముందస్తు ఆస్తిపన్ను కింద 8,182 మంది నుంచి రూ.6.20 కోట్లు (13 శాతం) వసూలు చేశారు. గతేడాది కంటే ఎక్కువే.. 2024–25కి గాను ఐదు శాతం రాయితీ కింద ముందస్తు ఆస్తిపన్నును నెల రోజుల్లోనే 16.23 శాతం రాబట్టగలిగాం. గతేడాది (2023–24) ఇదే సమయంలో 13 శాతమే వచ్చింది. ఈసారి మున్సిపల్ సిబ్బంది కృషితో 3.23 శాతం ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా పెద్ద పద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టి వసూలు చేశాం. – మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్నగర్ భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3,495 అసెస్మెంట్లకు గాను పాత బకాయిలు కలుపుకొని రూ.2.65 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ముందస్తు ఆస్తిపన్ను కింద 258 మంది నుంచి రూ.18 లక్షలు (6.79 శాతం) మాత్రమే వచ్చింది. జడ్చర్ల పట్టణంలోని 17,938 అసెస్మెంట్లకు గాను పాత బకాయిలు కలుపుకొని రూ.5.17 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ముందస్తు ఆస్తిపన్ను కింద 3,373 మంది నుంచి రూ.1.14 కోట్లు (22.05 శాతం) వసూలు చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీకి రూ.7.58 కోట్లు రాక జడ్చర్లకు రూ.1.14 కోట్లు, భూత్పూర్కు రూ.18 లక్షల రాబడి ముందస్తు ఆస్తిపన్నుకు ముగిసిన గడువు -
కాంగ్రెస్తోనే పేదలకు సంక్షేమం
గద్వాల అర్బన్/కేటీదొడ్డి/మల్దకల్: కాంగ్రెస్తోనే పేదలకు సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమవుతుందని నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎంపీ ఆభ్యర్ధి మల్లురవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఽ ధరూరు మండలం నెట్టెంపాడ్, మల్దకల్ మండలంలోని మద్దెలబండ, గట్టు మండలంలోని మాచర్లకు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారికి మల్లురవి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, సినీ నటి దివ్యవాణి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వెంకటస్వామిగౌడ్, రాజశేఖర్రెడ్డి, కుర్వ శ్రీనివాసులు, జగదీష్, వెంకట్రాములు, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. మ్యానిఫెస్టో కరపత్రాలు విడుదల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిరుపతయ్య భారతీయ యువజన కాంగ్రెస్ మ్యానిఫెస్టో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని ఆశీర్వాదించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్ గౌడ్, రాజేంద్ర, బీఆర్ తిమ్మన్న, ఇలియాస్, సత్యం తదితరులు ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉంటా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఆశీర్వదిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని ఎంపీ అభ్యర్థి మల్లురవి అన్నారు. గురువారం రాత్రి కేటీదొడ్డి మండలంలోని సుల్తాన్పురం, ఎర్సందొడ్డి, చింతలకుంట, నందిన్నెలో జెడ్పీచైర్పర్సన్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని రంగాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ హామీలను నమ్మవద్దన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి అన్నారు. మల్దకల్ మండలంలోని బిజ్వారం, అమరవాయి, ఎల్కూరు, పాల్వాయి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019