breaking news
Ad - Sakshi_Home_Sticky
-
కిడ్నీ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్
కాశీబుగ్గ: పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఓ వ్యక్తికి ఉచితంగా అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. నందిగాం మండలం కణితిఊరు గ్రామానికి చెందిన పాలవలస లక్ష్మణరావు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా అపెండిక్స్గా గుర్తించి సకల సౌకర్యాల నడుమ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత చక్కగా చూసుకుంటున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ.20వేలు ఖర్చవుతుందని, ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, పేదలు వినియోగించుకోవాలని కోరారు. తాను మరణించి.. మరో ఐదుగురికి బతుకునిచ్చి పొందూరు: మరణించినా సంపూర్ణ అవయవదానంతో చిరంజీవిగా నిలిచారు పొందూరుకు చెందిన వెంకుమహంతి శ్రీనివాసరావు(54). ఆయన విజయనగరం జిల్లాలో ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. గత నెల అధిక రక్తపోటు కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడులో రక్తం గడ్డకట్టింది. దీంతో విశాఖపట్నంలోకి విమ్స్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఇంతటి బాధను దిగమింగుకుని తన భార్య సునీత, కుమారుడు సంపూర్ణ అవయవదానానికి అంగీకరించారు. కళ్లు, కిడ్నీలు, కాలేయం, గుండె తదితర అవయవాలను ఐదుగురు వ్యక్తుల కోసం ఆస్పత్రులకు తరలించారు. దీనికి అధికారులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశా రు. శ్రీనివాసరావు మృతిపై పొందూరు శిష్టకరణ సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 36 రోజులకు రూ.31.85 లక్షలు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి హుండీల కానుకల ద్వారా రూ.31,85,917 మేరకు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ/డిప్యూటీ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ తెలియజేశారు. ఈమేరకు గురువారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం అనివెట్టి మండపంలో నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి గురువారం వరకు మొత్తం 36 రోజులకు హుండీల్లో లభించిన ఆదాయాన్ని లెక్కించగా.. నగదు రూపంలో రూ.30,74,034, చిల్లర రూపంలో రూ.1,11,883 వరకు లభించింది. అలాగే 24 గ్రాముల బంగారం, వెండి 1 కేజి 470 గ్రాముల వస్తువులతో పాటు పలు దేశాల కరెన్సీ కూడా కానుకల రూపంలో లభించాయి. జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్ పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపు ప్రక్రియలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు ద్వారపు అనూరాధ, ఎన్.కోటేశ్వర చౌదరి, లుకలాపు గోవిందరావు, ఆలయ సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు, జిల్లా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ రోజున ది వ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లు ఏర్పాటు చేస్తామ ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన వీల్చైర్లను నియోజకవర్గాల వారీగా పంపిణీ చేశారు. 1700 వీల్ చైర్లు, కంటి చూపు తక్కువ ఉన్నవారికి మాగ్నిఫయింగ్ అద్దాలు (భూతద్దాలు) 1700 వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్ఓ ఎం.గణపతి రావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, సహాయ సంచాలకులు కవిత తదితరులు పాల్గొన్నారు. -
No Headline
‘వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా...నువ్వు సీజ్ చేశావ్. ..చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా?’ అంటూ రాయలేని భాషలో ఒక మండల మెజిస్ట్రేట్గా ఉన్న పొందూరులో పనిచేసిన తహసీల్దార్ను కూన రవికుమార్ బెదిరించారు. ‘నీకెంత ఒల్లు బలిసిందిరా నా.. ‘డకా’...నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా.. డకా...’ సరుబుజ్జిలి ఈన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తిని ఫోన్లో కూన రవికుమార్ బెదిరింపు ఇది. శ్రీకాకుళంశుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024న్యూస్రీల్ -
‘శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత.. మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్లను ఉద్దేశించి కూన నోరు పారేసుకున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ముగ్గురే లోపలికి రావాలి అన్నందుకు పోలీసు అధికారులపై పై విధంగా విరుచుకుపడ్డారు.
టీడీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని కూన రవికుమార్ను నిలువరించేందుకు ఇంటికెళ్లిన పోలీసు అధికారులను నెట్టేసి నోటికొచ్చినట్టు దూషించారు. ‘నా ఇంటికి పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగకొట్టక(బూతు)పోతే చూద్దువుగాని.. నిన్ను ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా...నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో..’ అంటూ భౌతికంగా శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఆర్ఈసీహెచ్ ప్రసాద్ను కూన నెట్టేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇదీ టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ట్రాక్ రికార్డు. అధికారులంటే తన ఇంటిలో పని మనుషులే అన్నంత అలుసు ఆయనకు. అధికారంలో ఉన్నంతసేపూ ఆయన దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఆయన్ని చూస్తేనే ఉద్యోగులు, అధికారులు హడలెత్తిపోయిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక కూడా ఆయన నోటి దురుసు, దౌర్జన్యం తగ్గలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈ ఐదేళ్లలో ఎంతో మంది ఉద్యోగులను, అధికారులను దూషించారు. నోటికొచ్చినట్టు తిడుతూ బెదిరించారు. ఈయన నిర్వాకంపై పోలీసు స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్పై విడుదలైన పరిస్థితులు ఉన్నాయి. చివరికి రవికుమార్తో ప్రాణహాని ఉందని ఉద్యోగులు ఆందోళనకు దిగేంత వరకు వెళ్లారు. రౌడీషీట్ ఓపెన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కూన రవికుమార్ ఏకంగా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించారు. పింఛన్ల విషయంలో తన మాట విన లేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చా రు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని.. పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కరోనా నిబంధనల దృష్ట్యా గేటు వేస్తే వీరంగం సృష్టించారు. ఆగ్రహంతో ఉద్యోగులు కూన రవికుమార్తో పాటు ఆయన సోదరుడు అనుసరించిన తీరుపై ప్రభుత్వ ఉద్యోగులంతా గుర్రుగానే ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చా లా సందర్బాల్లో ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే పొరపాటున అధికారమిస్తే బతకనిస్తారా? అని ఆవేదనతో ఉన్నారు. ఏ పదవీ లేకుండానే అధికారులను బెదిరించడం, తంతాను అనడం.. బట్ట లూడదీసి కొడతానని బెదిరించడం వంటివి పరిణామాలను అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులే ఇబ్బంది పడుతుంటే.. చిన్నపాటి ఉద్యోగుల పరిస్థితి మరింత భయంకరమని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పలు సందర్భాల్లో ఆందోళనకు దిగడమే కాకుండా రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేసే వరకు వెళ్లారు. తమపై దౌర్జన్యం చేస్తున్న కూన రవి అండ్కోకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని ఉద్యోగులంతా ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కూన రవి సోదరుడిదీ అదే దౌర్జన్యం శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయంలో కూన రవికుమార్ సోదరుడు, కాంట్రాక్టర్ వెంకట సత్యనారాయణ బరితెగించి వ్యవహరించాడు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలున్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరు ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజనీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండ చెయ్యి ఎత్తి తన రౌడీయిజాన్ని చూపించారు. ‘ఎంత ధైర్యం రా... నాకే నోటీసు ఇస్తావా...నువ్వు ఏమనుకుంటున్నావ్...నేను కూన రవికుమార్ బ్రదర్ని.. జాగ్రత్త...ఇక్కడే పాతేస్తా...’ అంటూ ఇంజినీర్ మహంతిపై కూన వెంకట సత్యనారాయణ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి చాచి బెదిరించాడు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. -
చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి ఏనాడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చంద్రబాబుకు జనాలను ఓటు అడిగే హక్కు లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన గురువారం శ్రీకాకుళంలోని జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందించారని తెలిపారు. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, అమ్మ ఒడి తో విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధిలో భాగంగా నాలుగు సీ పోర్టులు నిర్మిస్తున్నామని, టెక్కలి దగ్గర రూ.4 వేల కోట్లతో మూలపేట పోర్టు వేగంగా జరు గుతున్నాయని, ఈ పనులు పూర్తయితే మరో రెండు, మూడు నెలల్లో ప్రపంచంతో కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. అలానే ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూ.800 కోట్లతో వాటర్ స్కీమ్, కిడ్నీ ఆస్పత్రి నిర్మించామని చెప్పారు. శ్రీకాకుళంలోని రిమ్స్లో ఎప్పుడూ సిబ్బంది కొరత ఉండేదని, కానీ ఈ ఐదేళ్లలో వైద్య వ్యవస్థలో సమూల మార్పులు చేసి ఖాళీలను భర్తీ చేశామన్నారు. సమ గ్ర భూ సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 వేల రెవె న్యూ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే నాలుగు వేల గ్రామాల్లో పనులు పూర్తి చేశామన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి రాదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు రాష్ట్రంలో అమలులోకి రాదని ధర్మాన స్పష్టం చేశారు. అనేక అధ్యయనాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్తో ఓ మోడల్ యాక్ట్ను తీసుకుని వచ్చిందన్నారు. కానీ అమలు చేయలేదని, దీని అమలుకి ముందు న్యాయవాదుల, మేధావుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు హయాంలో శ్రీకాకుళానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఒక్క కేంద్ర సంస్థనైనా ఇక్కడ నెలకొల్పలేదని గుర్తు చేశారు. అమరావతి అంటూ వ్యాపారం చేశారన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఆచరణ సాధ్యమేనా అన్నది గమనించాలన్నారు. చంద్రబాబు మళ్లీ జనాలను మోసగించేందుకు చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ చెబుతుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని ప్రశ్నించారు. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర స్థితిగతులు మారుతాయన్నారు. జనాలకు మేలు జరగాలంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే రావాలన్నా రు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ధర్మాన ప్రసాదరావుని, పేరాడ తిలక్ను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్సెల్ ప్ర ధాన కార్యదర్శి పిట్లా దామోదరరావు, రాష్ట్ర కార్యదర్శి పొన్నాడ వెంకటరమణారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి ఈశ్వరరావు, కార్యదర్శి ప్రస న్న, మాజీ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, ఆగూరి ఉమామహేశ్వరరావు, తంగి చంద్రశేఖరరావు, బైరి దామోదరావు, ఎన్ విజయ్కుమార్, మామిడి క్రాంతి, చిన్నాల జయకుమార్, గేడెల ఇందిరాప్రసాద్, జి.వాసుదేవరావు, పీస చంద్రశేఖర్ ఉన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ సమావేశంలో రెవెన్యూ మంత్రి ధర్మాన, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ -
చంద్రబాబూ నీకిది న్యాయమా..
చంద్రబాబూ నీకిది న్యాయమా. ఇది నీ పుణ్యమేనని అందరూ చెప్పుకుంటున్నారు. కడుపులో చల్ల కదలకుండా ఏ ఇబ్బందీ లేకుండా ఒకటో తేదీకి పింఛను డబ్బులు ఇచ్చేవారు. ఈ నెల కుర్రాళ్లు నన్ను మోసుకుంటూ రిక్షాలోకి ఎక్కించారు. పాక్కుంటూ బ్యాంకులోకి వెళ్లి డబ్బు తీసుకున్నాను. మళ్లీ పాత రోజులు గుర్తు చేశావు. నరక యాతన పెట్టావు బాబూ. – హిమండి వెంకటరావు, వెంగళరావు కాలనీ , ఆమదాలవలస మున్సిపాలిటీ ●
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019