breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ఎరువుల దుకాణాల తనిఖీ
ధరూరు: మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ అండ్ పెస్టిసీడ్స్ దుకాణాలను గురువారం గద్వాల వ్యవసాయ శాఖ ఏడీఏ సంగీతలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపధ్యంలో రైతులకు అవసరమయ్యే ఎరువులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దుకాణాలతో పాటు గోదాంలో ఉన్న నిల్వలను, రికార్డుల్లో చూయిస్తున్న నిల్వలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీలర్లకు సూచించారు. అలాగే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. ప్రతి కొనుగోలుకు సంబంధించి రైతులు డీలర్ల నుంచి రషీదులు పొందాలన్నారు. ఏడీఏ సంగీతలక్ష్మి -
పోలింగ్ సమయం పొడిగింపు
గద్వాల రూరల్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా పౌరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు పోలింగ్ సమయాన్ని ఇంతకు ముందు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఉండేది. ప్రస్తుతం దీనిని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించి పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి గద్వాల రూరల్: మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్జైవన్షి ఆధ్వర్యంలో వనపర్తి ఓసీలోని ఎన్ఐసీ కేంద్రంలో వనపర్తి, గద్వాల జిల్లాలకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్లను వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్, గద్వాల అదనపు కలెక్టర్ అపూర్వచౌహన్ సమక్షంలో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం అయ్యప్ప, ఈడీఎం శివ పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి మల్దకల్: ఓటు విలువైంది. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జెడ్పీ సీఈఓ కాంతమ్మ సూచించారు. గురువారం మల్దకల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్డీఓ నర్సింగరావుతో పాటు ఆధికారులు సుధారాణి, రమేష్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఓటరుకు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బాల్యవివాహాలు, బాలకార్మిక నిర్మూలనపై అవగాహన కల్పించారు. సీడీపీఓ కమలాదేవి, నాగరాణి, ఎంపీఓ ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గద్వాల మార్కెట్యార్డు సమాచారం గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 645 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టంగా రూ.7,039, కనిష్టంగా రూ.3,002, సరాసరి రూ.5,729 ధరలు పలికాయి. 21 క్వింటాళ్ల ఆముదం రాగా.. గరిష్టంగా రూ.5,429, కనిష్టంగా రూ.4,666, సరాసరి రూ.5,429 ధరలు వచ్చాయి. 4,081 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.1,509, సరాసరి ధర రూ.1,669 ధరలు వచ్చాయి. 26 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ.1,702 పలికింది. -
‘రెండోసారి మోసపోతే మనదే తప్పు’
అయిజ: అమలు చేయలేని హామీలు చెబితే చాలామంది మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని, ఒక సారి మోసపోతే అవతల వారిది తప్పవుతుందని, రెండో సారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వేసిన వారిదే తప్పవుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్రెడ్డి ఫంక్షన్హాల్లో అయిజ మండల మున్సిపాలిటీ, మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరవగా.. ఎమ్మెల్సీ మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో 30 వేలకు పైగా బీఆర్ఎస్కు మెజార్టీ ఇచ్చారని అదే స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేసి, వేయించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గెలిచిన వెంటనే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని, ఇప్పుడేమో ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెబుతున్నారన్నారు. ప్రజలను నమ్మించి ఎంపీ ఎన్నికల్లో ఓట్లేయించుకునేందుకు రెండో సారి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. అలంపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారని, ఎంపీగా ప్రవీణ్కుమార్ను గెలిపిస్తే ముగ్గురి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. -
ఉత్సాహంగా ఎడ్లబండ్ల గిరక పోటీలు
గట్టు: మండల పరిధిలోని బల్గెరలో నిర్వహిస్తున్న దిగంబరస్వామి జాతర సందర్భంగా గురువారం ఎడ్లబండ్ల గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ పోటీల్లో నాలుగు బహుమతులను కర్నూల్ జిల్లాకు చెందిన ఎడ్ల బండ్లు దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఎడ్ల బండ్ల పోటీల్లో 3,721.3 ఫీట్ల దూరం గిరకను లాగి మొదటి బహుమతి రూ.20 వేలను కర్నూల్ జిల్లా హాలహర్వి ఈరన్నకు చెందిన ఎడ్ల దక్కించుకుంది. ద్వితీయ బహుమతి రూ.15 వేలను గుమ్మురాళ్ల పాలకుర్తికి చెందిన ఎడ్ల బండి 3,692.2 ఫీట్ల దూరం ఎడ్ల బండి గిరకను లాగి దక్కించుకున్నాయి. తృతీయ బహుమతి రూ.10 వేలను నల్గొండ రంగన్న ఎడ్ల బండి 3,608.9 ఫీట్ల ఎడ్ల బండి గిరకను లాగి దక్కించుకున్నాయి. నాలుగో బహుమతి రూ.5 వేలను రంగన్నకు చెందిన ఎడ్ల బండి 3,594 ఫీట్ల దూరం లాగి దక్కించుకున్నాయి. పోటీల్లో మొత్తం 15 జతల ఎడ్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. బాసు శ్యామల, హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న జొన్నల కొనుగోళ్లు
రాజోళి: మండలంలో జొన్నల కొనుగోలు కొనసాగుతోంది. పీఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కొనుగోళ్లలో భాగంగా మండలంలోని రాజోళి, పచ్చర్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పచ్చర్లలో గురువారం 43 మంది రైతులకు సంబంధించి 1,781 బస్తాలను కొనుగోలు చేసినట్లు పీఏసీఎస్ సీఈఓ రవికుమార్ తెలియజేశారు. కాగా.. రాజోళిలోని కొనుగోలు కేంద్రంలో బుధవారం నుంచి గన్నీ బ్యాగుల కొరత ఉందని, అందుకే అక్కడ గురువారం కొనుగోలు జరగలేదన్నారు. గన్నీ బ్యాగులు అందుబాటులోకి రాగానే రాజోళిలో కూడా కొనుగోళ్లు జరుగుతాయని వివరించారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019