breaking news
-
నీ కళ్లు చల్లబడ్డాయా.. బాబూ!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘వలంటీర్లను అడ్డుకున్నావు.. ఇంటి వద్దకే వచ్చే పింఛన్లు ఆపావు.. ఎర్రటెండలో బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడేలా చేశావు.. నీ కళ్లు చల్లబడ్డాయా.. బాబూ’ అంటూ అవ్వాతాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పూర్తి ఆరోగ్యంతో ఉన్న యువతే ఎండ తీవ్రత, వడగాడ్పులకు భయపడి ఇల్లు కదలడం లేదు. అలాంటిది మమ్మల్ని పింఛన్ల కోసం కిలో మీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి మండు టెండలో పడిగాపులు కాసేలా చేశారు. మా ఉసురు తగులుతుంది’ అంటూ చంద్రబాబు, నిమ్మగడ్డకు వితంతువులు, దివ్యాంగులు శాపనార్థాలు పెట్టారు. బ్యాంకుల వద్ద బారులు ఎన్టీఆర్ జిల్లాలోని ఏ మూలకు వెళ్లినా గురువారం బ్యాంకుల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో పెన్షన్ల కోసం అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు క్యూలైన్లలో పడ్డ అగచాట్లే మళ్లీ దర్శనమిచ్చాయి. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేదంటూ చంద్రబాబు ముఠా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడంతో మే నెల ఎండల్లోనూ ఇంటి నుంచి బయటకు రావాల్సిన దుస్థితి దాపురించిందని వారంతా ఆవేదన చెందుతున్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ పరిస్థితేమిటని అవ్వాతాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 2,36,726 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వారందరికీ వలంటీర్ వ్యవస్థ ద్వారా 58 నెలలుగా ఇంటి వద్దే పింఛన్లు అందాయి. వలంటీర్ వ్యవస్థను నిలిపివేయ డంతో పింఛన్దారులు ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఏప్రిల్ నెలలో పెన్షన్లు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నెలలో బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి డీబీటీ ద్వారా, లేని వారికి ఇంటి వద్ద అందజేయాలని నిర్ణయించారు. డీబీటీ ద్వారా 1,82,721 మందికి, బ్యాంకు ఖాతాలు లేని ఇంటి నుంచి కదలలేని 54,005 మందికి ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో లబ్ధిదారుల్లో మూడొంతుల మంది బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 58 నెలల్లో ఎన్నడూ లేని అగచాట్లు వారికి వచ్చి పడ్డాయి. మండే ఎండ.. క్యూలో ఉక్కపోత చాలా గ్రామాల్లో బ్యాంకులు లేవు. ముఖ్యంగా శివారు గ్రామాల లబ్ధిదారులు కిలోమీటర్ల దూరం వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటోల్లో, ఇతరుల సాయంతో బ్యాంకుల వద్దకు వెళ్లిన లబ్ధిదారులు క్యూలో ఉక్కపోతతో నరకయాతన అనుభవించారు. 43 డిగ్రీల ఎండలో అల్లాడిపోయారు. అంతా ఆరవై ఏళ్లు పైబడిన వారే కావడంతో కొందరు ఉక్కపోతకు సొమ్మసిల్లిపోయారు. జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఐదారు కిలో మీటర్ల దూరంలోని మైలవరం వెళ్లాల్సి వచ్చింది. వీరులపాడు మండలం జుజ్జూరు శివారు రంగాపురానికి చెందిన వారు ఆరు కిలో మీటర్ల దూరంలోని జుజ్జూరు వెళ్లి వడగాడ్పులకు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు, నిమ్మగడ్డపై అవ్వాతాతల ఆగ్రహం శాపనార్థ్థాలు పెట్టిన వితంతువులు, దివ్యాంగులుబాబు వల్లే ఈ ఇబ్బంది ఇంతకు ముందు ప్రతి నెలా ఇంటి వద్దే పింఛన్ తీసుకున్నాం. ప్రతి నెలా తెల్లవారక ముందే వలంటీర్ వచ్చి డబ్బులు వచ్చేవాడు. వలంటీర్లను కోర్టుకు వెళ్లి రానీకుండా ఆపేశారు. రెండు నెలలుగా పింఛన్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ నెల డబ్బులు బ్యాంకుల్లో వేశామన్నారు. మండుటెండలో మైలవరం వెళ్లి పెన్షన్ తీసుకున్నాం. చంద్రబాబు వల్లే మాకీ దుస్థితి. – ఎల్లమ్మ, కుంటముక్కల, జి.కొండూరు మండలం క్యూలైన్ చూసి తిరిగొచ్చా ఈ నెల పింఛన్ డబ్బులు బ్యాంకులో వేశారు. డబ్బుల కోసం మండు టెండలో బ్యాంకుకు వెళ్లాను. అక్కడ పెద్ద క్యూలైన్ ఉండటంతో నిలబడ లేక పెన్షన్ తీసుకోకుండా తిరిగి ఇంటికి వచ్చాను. ఈ ఐదేళ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదు. ప్రతి నెలా ఒకటో తేదీనే తాతా అంటూ వలంటీర్ వచ్చి ఇంటి వద్దే పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. ఈ వయసులో మమ్మల్ని బ్యాంకుల చుట్టూ తిప్పుతారా? – యర్రంశెట్టి నరసింహారావు, గులాబీతోట, విజయవాడ -
యూటీఎస్ యాప్తోసులభంగా రైల్ టికెట్
రైల్వే స్టేషన్(విజయవాడ పశ్చిమ): యూటీఎస్ యాప్ ద్వారా సులువుగా రైల్ టికెట్ పొందొ చ్చని విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫిసర్ మండు రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సబర్బన్ స్టేషన్లకు 20 కిలో మీటర్లు, నాన్ సబర్బన్ స్టేషన్లకు 50 కిలో మీటర్లు వరకు ఈ సదుపాయం ఉండే దని, ప్రస్తుతం దానిని సవరించారని పేర్కొన్నారు. యూటీఎస్ యాప్ ద్వారా ఎన్ని కిలోమీటర్లకు అయిన టికెట్ను పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారు, ప్లాట్ఫాం టికెట్, సిజన్ టికెట్లతో ప్రయాణించే వారికి ఈ యాప్ ఎంతో సౌలభ్యంగా ఉంటుందని సూచించారు. ఈ యాప్ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంగారు తాపడం పనులకు రూ.2 లక్షల విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్కు చెందిన భక్తులు గురువారం రూ.2 లక్షల విరాళం సమర్పించారు. హైదరాబాద్ ఎస్ఆర్నగర్కు చెందిన జాస్తి కిషోర్ కుటుంబం అమ్మ వారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈఓ కె.ఎస్.రామరావును కలిసి బంగారు తాపడం పనులకు రూ.2 లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పిం చారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మద్యం విక్రయాల్లో నిబంధనలు పాటించాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలకు అనుగుణంగానే మద్యం విక్రయాలు జరపా లని జిల్లా మద్య నిషేధ, అబ్కారీ అధికారి శ్రీనాథుడు గురువారం ఓ ప్రకటనలో సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచా మని హెచ్చరించారు. ప్రభుత్వ రిటైల్ అవుట్ లెట్లు, బారుల్లో విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 2,200 తనిఖీలు చేశామని పేర్కొన్నారు. మార్చి 16 తర్వాత రెండు కోడ్ ఉల్లంఘన కేసులు, ఒక బార్పై కేసు, ఏడు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశామని వివరించారు. ఆయా కేసుల్లో ఐదుగురు సూపర్వైజర్లు, ఐదుగురు సేల్స్మన్లు, మరో ఐదుగురు ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుల్లో రూ.32,80,200 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మద్యం తయారీ డిస్టిలరీలు, మద్యం డిపోలు, మద్యం రిటైల్ సేల్స్ దుకాణాలు అన్నింటినీ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని శ్రీనాథుడు తెలిపారు. మద్యం సరఫరా వాహనాలను జీపీఎస్తో అనుసంధానించామని వివరించారు. ఎకై ్సజ్ నేరాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ఎన్టీఆర్ జిల్లా కంట్రోల్రూమ్ నంబర్లు 99897 52780, 95731 17687కు, స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 91541 06528, 81219 09444లకు సమాచారం ఇవ్వాలని కోరారు. భార్యను చంపిన కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష చిలకలపూడి(మచిలీపట్నం): భార్యను చంపిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం తీర్పు చెప్పారు. నిడుమోలు గ్రామానికి చెందిన కోట దుర్గారావు 2015లో మరియమ్మను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం తరువాత దుర్గారావు గడ్డ యల్లమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధ్ధలు ఏర్ప డ్డాయి. దుర్గారావు యల్లమ్మతో ఎక్కువగా ఉండటంతో మరియమ్మ నిలదీసింది. 2020 మే ఐదో తేదీ రాత్రి సమయంలో దుర్గారావు మద్యం తాగి భార్య మరియమ్మను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. దీనిపై కూచిపూడి పోలీస్స్టేషన్లో మరియమ్మ బంధువులు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సియాద్రి చిన్నారావు తొమ్మిది మంది సాక్షులను ప్రవేశపెట్టారు. విచారణలో దుర్గారావు భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని రుజువు కావటంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
No Headline
● నెమలిలో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం రాష్ట్రంలో పేరెన్నికగన్న ఆలయం ● ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ● సుమారు లక్ష ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ప్రధాన పంటలుగా వరి, పత్తి, మిర్చి సాగుచేస్తున్నారు. ● తిరువూరు నియోజకవర్గంలో 360 చెరువులు ఉన్నాయి. అధిక శాతం భూములు చెరువునీటితోనే సాగవుతున్నాయి. ● విస్సన్నపేటలో ఏటా వేసవిలో మామిడితాండ్ర తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ● పుట్రేల మారెమ్మతల్లి దేవస్థానం కూడా ప్రముఖ ఆలయంనియోజకవర్గ ప్రత్యేకతలు -
బ్యాంకు లావాదేవీలపై డేగ కన్ను
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుమానిత, అసాధారణ బ్యాంకు లావాదేవీలపై డేగ కన్నుతో నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ సూచించారు. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్లో సమన్వయం, వేగంగా సమాచార మార్పిడితో సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీ పి.హెచ్.డి.రామకృష్ణ, జిల్లా వ్యయ పరిశీలకులు వి.జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్ తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్య, ఎంసీఎంసీ ద్వారా సర్టిఫికేషన్, సీ–విజిల్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ ద్వారా సీజ్ చేసిన మొత్తాలను వివరించారు. సీపీ రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఇప్పటి వరకు 60 కేసులు బుక్ చేశామన్నారు. 11 అంత ర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు, 8 అంతరజిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశామన్నారు. జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, భద్రతా ప్రణాళిక, ఈవీఎం గార్డింగ్, స్ట్రాంగ్ రూమ్స్ భద్రత తదితరాలను సీపీ వివరించారు. అనంతరం వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ మాట్లాడుతూ.. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థుల వ్యయ పరిశీలన ఇతర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రలోభాలు లేని వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలతోపాటు పోస్టల్ ఆర్డర్లు, యూపీఐ పేమెంట్లపైనా ప్రత్యేకంగా దృష్టికేంద్రీకరించాలన్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్స్, నగదు ఉపసంహరణలపై నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కేసులు గమనిస్తే, వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. డబ్బు, మద్యం తదితరాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వివిధ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులు టీం వర్క్ చేసి వాటిని నిరోధించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో కలిసి సాధారణ ఎన్నికలు–2024పై పోలింగ్ అధికారులకు సూచనల బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, ఎంసీఎంసీ మెంబర్ డాక్టర్ వెలగా జోషి, వివిధ విభాగాల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్న వలసలు
నందిగామటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయని శాసనమండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి గురువారం రాత్రి స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలోని పెద్దవరం గ్రామానికి చెందిన పసుపులేటి పుల్లారావు, రామిశెట్టి కొండ, చందర్లపాడు మండలం రామన్నపేట గ్రామానికి చెందిన షేక్ నాగుల్, షేక్ ఉద్దండు, షేక్ జాన్సైదా, షేక్ మస్తాన్, పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని హనుమంతపాలెంకు చెందిన దారెల్లి దానయ్య, కన్నెకంటి యోహాను, మందా కొండాలతో పాటు పార్టీలో చేరిన వారికి అరుణకుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరుణకుమార్ మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు నమ్మటం లేదని, ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చంద్రబాబు మాదిరిగా మోసం చేయడని చెప్పారు. గతంలో చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని జగన్మోహన్రెడ్డి మాత్రం 99 శాతం మేర హామీలను అమలు చేసి చెప్పాడంటే.. చేస్తాడంతే అనేంతగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వ్యవసాయాభివృద్ధి సంస్థ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా బ్రహ్మేశ్వరరావు, నాయకులు మంచాల చంద్రశేఖర్, సింగంశెట్టి మల్లికార్జునరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు, మందా మరియమ్మ, కొమ్ము విజయరాజు, పసుపులేటి రామయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019