breaking news
Ad - Sakshi_Home_Sticky
-
4 మండలాల్లో 45 డిగ్రీలకు పైనే..
భువనగిరిటౌన్ : భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గురువారం ఒక ప్రాంతం అని లేకుండా జిల్లా అంతటా ఎండ తీవ్రత కనిపించింది. ఉదయం 11నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మూడొంతుల మండలాల్లో 42.30 నుంచి 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా అడ్డగూడూరులో 45.5, మోత్కూరు మండలం బుజిలాపురం 45.3, ఆత్మకూర్(ఎం), రామన్నపేట మండలం వెల్లంకిలో 45 డిగ్రీల ఎండ కాసింది. మిగతా ప్రాంతాల్లోనూ భానుడు ఠారెత్తించాడు. వేడిగాలులూ తోడవడంతో ప్రజలు విలవిల్లాడారు. అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూర్(ఎం) మండలాలను రెడ్ జోన్గా, మిగతా మండలాలను ఆరెంజ్ జోన్గా వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరించింది.ఫ నిప్పులు కురిపిస్తున్న భానుడు ఫ వేడి గాలులకు జనం విలవిల ఉష్ణోగ్రతలు ఇలా.. మండలం ఉష్ణోగ్రత అడ్డగూడూరు 45.5 బుజిలాపురం 45.3 ఆత్మకూర్(ఎం) 45.0 వెల్లంకి 45.0 జనగాం 44.6 మోటకొండూరు 44.1 గుండాల 44.1 చౌటుప్పల్ 43.8 -
సెంటిమెంట్ ప్రయత్నాలు పనిచేయవు
చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం : ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కులం, మతం సెంటిమెంట్ తీసుకువస్తున్నాడని, ఆయన ప్రయత్నాలు పని చేయవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ పరిధిలోని తంగడపల్లి రోడ్డులో, సంస్థాన్నారాయణపురంలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం పేరిట 2014లో ప్రజలు ఓటేశారని, ఇప్పుడు సిద్ధంగా లేరన్నారు. డాక్టర్గా బూర నర్సయ్యకు ఎంతో గౌరవం ఇస్తానని, ఆయనే తనౖపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్ కొడుకు, అల్లుడూ జైలుకెళ్లక తప్పదు కేసీఆర్ కొడుకు, అల్లుడు కూడా జైలుకు పోతారని రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. కారు పూర్తిగా చెడిపోయిందని,స్క్రాప్కు వెళ్లడమే మిగిలిందన్నారు. మునుగోడు ప్రజలకు నా జీవితం అంకితమని, ప్రాణత్యాగం చేయడానికై నా సిద్ధమన్నారు. అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి సమస్యలపై ఢిల్లీలో పోరాటం చేసి నిధులు తీసుకువస్తానన్నారు. అంతకుముందు చౌటుప్పల్లో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. చౌటుప్పల్ రోడ్ షోలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, బ్లాక్, మున్సిపల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహగౌడ్, బోయ దేవేందర్, నారాయణపురంలో సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెలకంటి సత్యం, కాంగ్రెస్ నాయకుడు పున్న కై లాష్నేత, ఎంపీపీ గుత్త ఉమాదేవి, జెడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, గుత్తా ప్రేమ్చందర్రెడ్డి, పార్టీ సంస్థాన్నారాయణపురం మండల ఆధ్యక్షుడు ఏపూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
బీజేపీ, కాంగ్రెస్ మఽధ్యే పోటీ
సాక్షి, యాదాద్రి : భువనగిరి లోకసభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని బీజేపీ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. గురువారం భువనగిరిలోని వివేరా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో లేదన్నారు. ఢిల్లీలో మోదీ ఉండాలంటే భువనగిరిలో బీజేపీని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి తాను సీఎంకు దగ్గర, అన్నీ మీరే చూసుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. 30 ఏళ్లుగా ప్రజలకు ఏం సేవ చేశాడో చెప్పాలని.. రాహుల్గాంధీ సంతకం ఫోర్జరీ చేయడం, క్యాసినోలు నడపడం, వ్యాపారాలు చేయడమే అయన పనా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేస్తాడో ప్రచారంలో ఎక్కడా చెప్పడం లేదన్నారు. కోమటిరెడ్డి సోదరులను సీఎం రేవంత్రెడ్డి మునగచెట్టు ఎక్కించారని, ఒకరిని సీఎం, మరొకరిని హోంమంత్రి అంటూ మభ్యపెట్టారని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీగా పని చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఏచిన్న ప్రాజెక్టు అయినా తెచ్చాడా అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే భువనగిరిని యోజకవర్గానికి రూ.9 వేల కోట్ల నిధులు తెచ్చానని గుర్తు చేశారు. దేశాన్ని అప్రతిష్టపాలు చేసింది కాంగ్రెస్సే : కాసం దేశాన్ని అప్రతిష్టపాలు చేసింది కాంగ్రెస్సేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల తర్వాత తన పదవి పోతుందన్న భయంతో మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై సీఎం రేవంత్రెడ్డి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. సమావేశంలో బీజేపీ జనగామ, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు దేశమంత్రెడ్డి, పాశం భాస్కర్, నాయకులు చాడ సురేష్రెడ్డి, శ్రీరాం శ్రీనివాస్, పడాల శ్రీనివాస్, కడియం రామచంద్రయ్య, దయానంద్గౌడ్, మొగులయ్య, బందారపు లింగస్వామి, చందామహేంద్ర్ గుప్తా పాల్గొన్నారు.ఫ సొంత ఎమ్మెల్యేలను చామల బ్లాక్మెయిల్ చేస్తుండు ఫ కోమటిరెడ్డి సోదరులను మునగ చెట్టు ఎక్కించిన రేవంత్రెడ్డి ఫ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ -
ఓటింగ్ శాతం పెంచాలి
సాక్షి,యాదాద్రి : ఓటింగ్ శాతం పెంపునకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు సహకరించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే కోరారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వారితో సమావేశం అయ్యారు. ఓటరు జాబితా, పోల్ చిట్టీల పంపిణీ, ఈవీఎంల ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ తదితర విషయాలను వివరించారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18,80,585 మంది ఓటర్లు ఉన్నారని, అందుకు అనుగుణంగా 2,141 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.ఇంటింటికీ పోల్ చిట్టీల పంపిణీ జరుగుతుందని, 8వ తేదీ లోగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. 4 తేదీన ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్, 5న కమీషనింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. 13,213 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోనున్నారని, 656 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3నుంచి 7వ తేదీ వరకు, మునుగోడు, భువనగిరి 4నుంచి 7, నకిరేకల్ 3నుంచి 8, తుంగతుర్తి 4నుంచి 6, ఆలేరు 3 నుంచి 4, జనగామ సంబంధించి 3 నుంచి 5 వ తేదీ వరకు హోం ఓటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే 13న పోలింగ్ సమయం గంట పాటు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఉదయం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తదితరులు పాల్గొన్నారు. -
సెక్టార్ అధికారుల పాత్ర కీలకం
సాక్షి,యాదాద్రి : ఎన్నికల్లో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని, పోలింగ్కు సంబంధించిన ప్రతి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే.జండగే సూచించారు. గురువారం కలెక్టరేట్లో సెక్టోరియల్ అధికారులకు పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోలింగ్ విధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 72 రూట్లకు 72 మంది సెక్టార్ అధికారులను నియమించామని, వీరంతా తమ పరిధిలోని రూట్ మ్యాపులపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో శాంతిభద్రతలు తలెత్తిన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకోవాలని, వెబ్ క్యాస్టింగ్ చేయాలని కోరారు. పోల్ చిట్టీలు వంద శాతం పంపిణీ అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈవీఎంలలో సమస్య తలెతినట్లయితే ప్రత్యామ్నాయంగా అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. పోలింగుకు 90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 7 గంటలకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు గంగాధర్, అమరేందర్ పాల్గొన్నారు. ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019