breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ఎండకు చేపలు విలవిల
బోయినపల్లి(చొప్పదండి): ఎండలు దంచి కొడుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు వెడెక్కుతోంది. ఎండల ధాటికి చెరువుల్లోని చేపపిల్లలు చనిపోతున్నాయి. ఇటీవల వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, తంగళ్లపల్లి మండలం మండేపల్లి చెరువుల్లో భారీగా చేపలు చనిపోయాయి. వేడిమికి నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు(ఆక్సిజన్) తగ్గి పోతోంది. 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో విపరీతమైన ఉష్ణోగ్రతలకు నీళ్లలో ఉన్న చేపలు ప్రాణాలు కోల్పోతున్నాయి. జిల్లాలో 440 చెరువులు, రెండు ప్రాజెక్టులు జిల్లాలోని 13 మండలాల్లో 440 చెరువులు, కుంటలు ఉన్నాయి. బోయినపల్లి మండలం మాన్వాడలో మిడ్మానేరు ప్రాజెక్టు, గంభీరావుపేట మండలంలో ఎగువమానేరు ప్రాజెక్టులు ఉన్నాయి. సముద్రలింగాపూర్లో సింగసముద్రం చెరువు, వేములవాడ, విలాసాగర్ లార్జ్ ట్యాంకులు ఉన్నాయి. గత వర్షాకాలం సీజన్లో జిల్లాలోని 440 చెరువుల్లో 1.40 కోట్ల మేర చేపపిల్లలను వదిలినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఇందులో మిడ్మానేరు ప్రాజెక్టులో 28 లక్షలు, ఎగువ మానేరు ప్రాజెక్టులో 11 లక్షల చేపపిల్లలు వేశారు. 8 వేల మంది మత్స్యకారులు జిల్లాలో చేపల పెంపకం ద్వారా 8,400 మంది మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 135 మత్స్య పారిశ్రామిక సహకారా సంఘాలు, వేములవాడలో మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం, ఎగువమానేరులో మత్స్య మార్కెటింగ్ సొసైటి ఉంది. మత్స్య కార్మికులు చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. గతేడాది 6వేల టన్నుల చేపల దిగుబడి మిడ్మానేరు, ఎగువమానేరు ప్రాజెక్టులు, 440 చెరువుల్లో కలుపుకుని గతేడాది ఆరు వేల టన్నుల మేర చేపల దిగుబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిడ్మానేరు ప్రాజెక్టు పరిసరాల్లో నిత్యం సుమారు 1 నుంచి 2 టన్నుల మేర చేపల దిగుబడి వస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఎండకు విలవిల చెరువుల్లో సలసలా కాగుతున్న నీళ్లలో ప్రాణవాయువు కరిగి పోతుంటే అందులోని చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. ఈక్రమంలో చేపల వృత్తితో జీవనోపాధి పొందుతున్న పలువురు మత్స్యకారులు కష్టాలకోర్చి చేపలు పడుతున్నారు. మిడ్మానేరు పరిసరాల్లో తెప్పే ఆధారంగా విసురుడు వలతో ఎండ తగలకుండా చేపలు పడుతున్నారు. ఎండలతో చేపల దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చనిపోతున్న చేపలు చెరువులు, కుంటల్లో అడుగంటిన జలాలు అత్యధిక ఉష్ణోగ్రతలకు ఆవిరి అవుతున్న నీరుజిల్లాలో చేపల పెంపకం వివరాలు ప్రాజెక్టులు : మిడ్మానేరు, ఎగువ మానేరు చెరువులు, కుంటలు : 440 వేసిన చేపపిల్లలు : 1.40 కోట్లు మత్స్యకార్మికులు : 8,400 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు : 135 -
ఉనుక లారీ బోల్తా
రామగుండం: కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు ఉనుక లోడుతో వెళ్తున్న లారీ మల్యాలపల్లి సబ్స్టేషన్ దాటిన తర్వాత మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న రామగుండం ఎస్సై సతీశ్ ఘటనా స్థలికి చేరుకొని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ వేముల రాంబాబును టోల్ప్లాజాకు చెందిన పొక్లెయిన్ సాయంతో సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రుడికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ రాంబాబును జగ్గయ్యపేట, చిలకల్లు గ్రామం, కృష్ణ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసుజమ్మికుంట: ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో వీడియో విడుదల చేసినందుకు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశి క్రెడ్డిపై గురువారం కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట టౌన్ సీఐ రవి తెలిపారు. గతనెల 29న ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఓ వీడియో విడుదల చేస్తూ.. అందులో ‘నాడు సుభిక్షం– నేడు సంక్షోభం’ అంటూ మాట్లాడారు. 30న జరిగిన ముఖ్యమంత్రి సభలో రైతుబీమా, మ హాలక్ష్మి, దళిత బంధు, భరోసా, అడబిడ్డలకు తులం బంగారం, మత్స్యకారుల సమస్యలు, నేతన్నవస్త్రాల విక్రయం, మద్దతు ధర పథకా లపై ప్రజలు ప్రశ్నించాలని వీడియో విదుల చేశారు. వీడియో ప్రజలను రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఉందని, కౌశిక్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. వ్యభిచార ముఠా అరెస్ట్జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని బైపాస్రోడ్ దేవిశ్రీ గార్డెన్స్ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గురువారం రా త్రి అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు కోదాడకు చెందిన మహిళలతోపాటు, ఓ విఠుడిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
వరికొయ్యలకు నిప్పుతో ప్రమాదం
కోనరావుపేట(వేములవాడ): వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మోటార్లు, పైపులు, విద్యుత్ తీగలు కాలిపోయాయి. ధర్మారం శివారులోని పెద్ద చెరువుకట్ట కింద ఓ రైతుపొలంలో ఉన్న కొయ్యకాళ్లకు నిప్పుపెట్టారు. మంటలు పెరిగి పెద్దగా మారడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు మల్లెవేణి బాలకిషన్, తిరుపతి, అమరేందర్, నందం, రాజు, ముత్తయ్య, ఐలయ్యలకు సంబంధించిన మోటార్లు, పైపులు, వైర్లు కాలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న పశువులను రైతులు కాపాడుకోగలిగారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్షన్నర మేర ఆస్థినష్టం జరిగినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. బీ– థర్మల్లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తిరామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ కేంద్రంలో మిల్స్ విభాగంలో తలెత్తిన సాంకేతికలోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. గత నెల బాయిలర్లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఏప్రిల్ 23న ఉత్పత్తిని పునరుద్ధరించారు. మళ్లీ ఆరు రోజుల తర్వాత 29న మిల్స్లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోగా ఇప్పటికీ ఇంజినీర్లు, ఉద్యోగులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా విద్యుత్ కేంద్రంలో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో తిరిగి పునరుద్ధరించేందుకు లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో బీ–థర్మల్ కేంద్రం మనుగడపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రజలు కోరుతున్నారు. రూ.3.77లక్షలు పట్టివేత జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె వద్ద పట్టణ ఎస్సై మన్మథరావు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం వాహనాల తనిఖీ చేపట్టగా ధరూర్కు చెందిన పిన్నం లచ్చయ్య ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2లక్షల నగదును పట్టుకుని సీజ్ చేశారు. అలాగే తహసీల్ చౌరస్తాలో పట్టణ ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా సారంగాపూర్ మండలం అర్పపల్లికి చెందిన కుడుకల రాజయ్య ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.1.77 లక్షల నగదును సీజ్ చేసి గ్రీవెన్సెల్కు పంపించారు. -
పాపం పసిప్రాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బుడి..బుడి నడకలతో అల్లరిచేసే కొడుకు మంచానికే పరిమితం కావడంతో ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. మూడేళ్ల వయస్సులోనే ఆ చిన్నారి బోన్మ్యారోతో బాధపడుతుండడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్న వారికి రూ.25లక్షలు ఖర్చు చేస్తేనే కొడుకు బతుకుతాడన్న వైద్యుల మాటలతో నిశ్చేష్టులయ్యారు. దాతలు స్పందించి తమ కొడుకు చికిత్సకు సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన అందెమాసుల సంధ్య–రాజు దంపతుల కుమారుడు జిస్మిత్(3) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించినా ఆరోగ్యం కుదుట పడలేదు. వైద్యుల సూచనలతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు బోన్మ్యారోకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాలుడిని అక్కడే అడ్మిట్ చేసుకొని వెంటనే ‘బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్’ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. అందుకు రూ.26 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచిన దంపతులు చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులు చూస్తున్నారు. దాతలు స్పందించి తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.87906 36095లో ఫోన్పే, గూగుల్ పే చేయాలని కోరుతున్నారు. బోన్మ్యారోతో బాధపడుతున్న చిన్నారి దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు హైదరాబాద్ కిమ్స్లో చికిత్స శస్త్రచికిత్సకు రూ.26లక్షలు అవసరం -
రాజన్న ఆదాయం రూ.1.52 కోట్లు
వేములవాడ: వేములవాడ రాజన్నకు 21 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,52,15,575 నగదుతోపాటు బంగారం 218 గ్రాములు, వెండి 11.500 కిలోలు సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య గురువారం హుండీ లెక్కింపు కొనసాగింది. కరీంనగర్ ఏసీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ, ఏఈవో హరికిషన్, జయకుమారి, బి.శ్రీనివాస్, ప్రతాప నవీన్, ఆలయ ఉద్యోగులతోపాటు రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. తానా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ కరీంనగర్టౌన్: తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా) 2024–25 సంవత్సరానికి జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో తెలంగాణ జోన్–2 నుంచి ఉపాధ్యక్షుడిగా నగరంలోని డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... కొత్త జిల్లాల్లో తానా నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా శ్రీనివాస్ ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తరహాలో కంటి వైద్య సేవలు కరీంనగర్టౌన్: కరీంనగర్ రేకుర్తి కంటి ఆస్పత్రిలో హైదరాబాద్ తరహా వైద్యసేవలు అందిస్తున్నామని డాక్టర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యశాల చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి అన్నారు. గురువారం లయన్స్క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో రెటీనా చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన వేణుమూర్తి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన రేకుర్తి కంటి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యులతో రెటీనా చికిత్స అందించడం జరుగుతోందన్నారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలని అన్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రెటీనా చికిత్సకు విశేష స్పందన లభించినట్లు తెలిపారు. దుబాయ్లో బాలపల్లి యువకుడి ఆత్మహత్య జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం బాలపల్లికి చెందిన బైరి రంజిత్కుమార్ (34) నాలుగు రోజుల క్రితం దుబాయ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఇక్కడి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు తీవ్రంగా రోదిస్తున్నారు. రంజిత్కుమార్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు దుబాయ్లో ఉన్న మిత్రులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. రంజిత్కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రంజిత్ది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019