breaking news
-
test webp article field
-
test article webppp
-
రాష్ట్రంలో కాంగ్రెస్తోనే కరువు
బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్హన్మకొండ: రాష్ట్రంలో కాంగ్రెస్తోనే కరువు వచ్చిందని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 5, 6, 51, 52, 53, 54, 57 డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్లో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ ఎలాంటి అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలోనే వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలు మంజూరు చేసిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ రహదారులు, గిరిజన యూనివర్శిటీ, భద్రకాళి బండ్, వేయిస్తంభాల గుడి మరమ్మతులు చేశారన్నారు. గ్రేటర్ వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని, మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నాయకులు రావుల కిషన్, కొలను సంతోశ్రెడ్డి, కందగట్ల సత్యనారాయణ, కురిమిండ్ల సది, చింతల రఘుపతి, రాజ్ కుమార్, రామకృష్ణ, ప్రవీణ్, మధుచంద్ర యాదవ్, దేవేందర్ రెడ్డి, బైరి లక్ష్మి పాల్గొన్నారు. -
డిగ్రీ కోర్సుల పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 6వ తేదీ నుంచి డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ బీఏ (ఎల్) 2వ, ఆరో సెమిస్టర్ పరీక్షలు, ఈ నెల 7వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ను విడుదల చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి గురువారం తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 6, 8, 10, 16, 18, 21, 25, 29వ తేదీ వరకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 7, 9, 15, 17, 20, 22, 28, 30 వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటవరకు జరగనున్నాయి. ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13వ తేదీ వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ కమిటీ నియామకంహన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ లీగల్ సెల్ కమిటీని గురువారం హనుమకొండలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సోమ భరత్కుమార్ ప్రకటించారు. అధ్యక్షుడిగా గుర్రాల వినోద్, ఉపాధ్యక్షులుగా శ్రీరాం కిరణ్ కుమార్, నాయిని రవి, వసంత్ యాదవ్, వేణు పటేల్, ఎంకే అంబేద్కర్, అంజయ్య గౌడ్, అబ్దుల్ నబీ, ప్రధాన కార్యదర్శిగా జి.శివరాజ్, కోశాధికారిగా పి.శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా పి.బస్వరాజు, శ్రీరామ్ నాయక్, మహేశ్ పటేల్, నవీన్ కుమార్, రాంప్రసాద్, అరుణ, కమిటీ సభ్యులు సమ్మిరెడ్డి, ప్రవీణ్ కుమార్, సంపత్, జాషువా, కె.ఉషా, రాజు, చాంద్ పషా, మల్లేశంను నియమించారు. గౌరవ సలహాదారులుగా ఎం.సహోదర్ రెడ్డి, జనార్ధన్ గౌడ్, గణేశ్, శ్యామ్ సుందర్ రావు, సోమేశ్వర్ రావు, బాల కిషన్ రావు, రంజిత్, భద్రయ్య, శ్రీనివాస్ రావు నియమితులైనట్లు వివరించారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్న్యూశాయంపేట: హజ్యాత్రకు వెళ్లే వారికోసం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్లో హనుమకొండ జిల్లా వైద్యాధికారి బి.సాంబశివరావు ప్రారంభించారు. యాత్రికులకు వాక్సినేషన్ను అందించిన అనంతరం వైద్య సిబ్బంది సలహాలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రహమాన్, వైద్యాధికారులు మఖ్తదార్ అహ్మద్, రుబీనా, సిబ్బంది, వాక్సినేషన్ కో–ఆర్డినేటర్ అనీస్ సిద్దిఖీ, సర్వర్ మోహియొద్దీన్ పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపుకేయూ క్యాంపస్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈనెల 4 వరకు పొడిగించినట్లు హనుమకొండ డీఐఈఓ గోపాల్ గురువారం తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 3వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో అప్రెంటిస్ డ్రైవ్రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏఎల్పీఎల్ఏ కంపెనీ గురువారం అప్రెంటిస్ డ్రైవ్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. మూడేళ్లుగా ఐదో సెమిస్టర్ చదువుతున్న మెకానికల్, ఎలక్ట్రానిక్ డిప్లొమా విద్యార్థులను ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో అంతర్జాతీయంగా పేరుపొందిన ఏఎల్పీఎల్ఏ కంపెనీ ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 23 మంది మెకానికల్, 43 మంది ఎలక్ట్రానిక్ విద్యార్థులు ఈఎంపికకు హాజరైనట్లు ఆయన తెలిపారు. -
ప్రశాంత ఎన్నికలకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు
వరంగల్ క్రైం: లోక్సభ ఎన్నికల నిర్వహణకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా బందోబస్తు, భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు దిగుతున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే నగదు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్పోస్టుల ఏర్పాటుతోపాటు పాత నేరస్తుల బైండోవర్, గుడుంబా, బెల్ట్షాపులపై ఉక్కుపాదం మోపారు. ఈనెల 13న వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఎన్నికల కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన పోలీస్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్కు చెందిన మూడు కంపెనీలు సుమారు 240 మంది సిబ్బంది ప్రజల మధ్య కవాతు నిర్వహించి ‘మీ రక్షణకు మేం ఉన్నాం’ అంటూ.. భరోసా కల్పించారు. వరంగల్ పార్లమెంట్ స్థానం.. వరంగల్ తూర్పు, పడమర, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకు విస్తరించి ఉంది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీలో 42 మంది అభ్యర్థులున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ వరంగల్ పార్లమెంట్ స్థానంతో పాటు నర్సంపేట మహబూబాబాద్, జనగామ భువనగిరి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా కమిషనరేట్ పోలీసులే బందోబస్తు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలు 784.. పోలింగ్ స్టేషన్లు 1,900 వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కోసం కమిషనరేట్ పరిధిలో 784 పోలింగ్ కేంద్రాలను, 1900 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంల తరలింపు, బందోబస్తు పర్యవేక్షణ కోసం 173 రూట్లు సిద్ధం చేశారు. పోలింగ్కు ముందు రోజు సాయంత్రం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాలు పోలీసుల కంట్రోల్లోకి వస్తాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సిబ్బంది ఉంటారు. భారీగా పట్టుబడిన నగదు.. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈనెల 2 వరకు స్థానిక పోలీసులు, చెక్పోస్టులు, ఎంసీసీ బృందాలు పట్టుకున్న వాటి విలువ రూ.2,44,25,919 ఉంది. వీటిలో మద్యం 5,400 లీటర్లు వాటి విలువ రూ.29 లక్షలు, గంజాయి 24 కిలోలు విలువ రూ. 5.68 లక్షలు, బంగారం , వెండి విటి విలువ రూ.11.14 లక్షలు, బియ్యం 1,480 క్వింటాళ్లు రూ. 41.46 లక్షలు. తదితరాలతో కలిపి మొత్తం రూ. 2,44,25,919 విలువైన నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుకున్నారు. గన్స్ డౌన్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ తుపాకులు 201 ఉన్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇప్పటికే 200 తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేశారు. 1 తుపాకీ లైసెన్స్ ఉన్న వ్యక్తి విదేశాల్లో ఉన్నారు. అతడి తుపాకీ బ్యాంకు లాకర్లో ఉంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిని పోలీస్ అధికారులు ఇప్పటికే 1,793 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న సుమారు 400 మంది రౌడీ షీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు టాస్క్ఫోర్స్ కార్యాలయంలో పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన, నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై రౌడీషీట్ ఓపెన్ చేయడానికి పోలీస్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. రూ. 50 వేల నగదు వరకే.. ఎన్నికల నిబంధనల ప్రకారం.. రూ. 50 వేలకు మించి నగదును ప్రజలు వెంట తీసుకెళ్లరాదు. రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బులు పట్టుబడితే సరైన పత్రాలను జిల్లా గ్రీవెన్స్ మానిటరింగ్ కమిటీకి చూపెడితే డబ్బులు తిరిగి ఇస్తారు. రూ.10 లక్షల్లోపు పట్టుబడితే జిల్లాలో ఏర్పాటు చేసిన కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. రూ. 10 లక్షలు దాటితే ఐటీ శాఖ అధికారులకు అప్పగిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రచార వాహనాలకు అనుమతిని స్థానికంగా ఆర్డీఓ, ఏసీపీలు, జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అనుమతిస్తారు. అనుమతి లేకుండా తిరిగే వాహనాల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు. నగదు పంపిణీ, ఇతర వస్తువులు పంపిణీ చేస్తే.. వరంగల్ పోలీస్ 87126 85257, వరంగల్ కలెక్టరేట్ 91542 52939, హనుమకొండ కలెక్టరేట్ 97017 7182 నంబర్లకు ఫిర్యాదు చేయాలి.చెక్పోస్టులు 23ఏసీపీలు 6హోంగార్డులు 757 విధుల్లో పోలీస్ సిబ్బంది 2,632 పట్టుబడిన నగదు రూ.1.56 కోట్లు బైండోవర్లు 1,793 మంది
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019