breaking news
Ad - Sakshi_Home_Sticky
-
పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు
నారాయణపేట: లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా లోక్సభ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ జిల్లా అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. మిగిలిన ఓటర్లకు సైతం పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీ – విజల్, డయల్ 1950 నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ● ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఈవీఎంల అప్పగింత నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంల తరలింపు వరకు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, డబ్బు, మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి నారాయణపేట: జిల్లాకు అదనంగా వచ్చిన బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు మయాంక్ మిట్టల్, అశోక్ కుమార్, ఆర్డీఓ మధుమోహన్, సహాయ రిటర్నింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 31 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఒక్కో పోలింగ్ బూత్లో అదనంగా బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు జిల్లాకు అదనంగా 700 బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని.. నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్కు 337, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్కు 355 కేటాయించినట్లు వివరించారు. వాటిని నారాయణపేట, మక్తల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్ర పర్చనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఈవీఎంల గోదామును కలెక్టర్ పరిశీలించారు. -
రాయితీ విత్తనాలపై ఆశలు
మరికల్: వానాకాలం సీజన్లో సాగు చేసే పంటలకు గతంలో మాదిరిగా రాయితీపై విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ నిర్ణయం అమలైతే రైతులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో సాగు చేసే పంటల వివరాలు, అవసరమయ్యే విత్తనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రతి ఏడాది జీలుగ, జనుము విత్తనాలకే రాయితీ అందిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలకు రాయితీ ఇస్తుండగా, రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చాక రాయితీ ఇవ్వడాన్ని మానుకున్నారు. మిగితా పంటల విత్తనాలకు కూడా ఎట్టకేలకు రాయితీ పునరుద్ధరిస్తామని చెప్పడం రైతులకు ఊరట కలిగిస్తోంది. పత్తి, వరి సాగుపైనే మొగ్గు జిల్లాలో రైతులు ముందుగా పత్తి సాగు ఎక్కువగా, ఆ తర్వాత వరి పంటకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కంది పెద్ద ఎత్తున సాగు చేయగా, ఇప్పుడు ఆ స్థానాన్ని పత్తి భర్తీ చేస్తోంది. రైతుల అవసరాలు అదునుగా తీసుకొని వ్యాపారులు నచ్చిన ధరకు విత్తనాలు విక్రయిస్తున్నారు. వచ్చే వానాకాలం సీజన్కు ప్రభుత్వం విత్తన ధరలు, రాయితీని ఖరారు చేయకపోయినా, రాయితీ ఇస్తామని ప్రకటిండంతో ఆశలు చిగురించాయి. ఏ విత్తనాలపై ఎంత మేరకు రాయితీ ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా ప్రభుత్వం అన్ని విత్తనాలకు రాయితీపై అందజేస్తే రైతులు కొద్దిమేరా లాభాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు కావాల్సిన విత్తనాలపై అందించిన నివేదిక ఇలా.. పంట ఎకరాలు విత్తనాలు వరి 1,69,000 42,250 కందులు 55,000 1,650 పెసర 3,000 240 అముదం 2,000 40 వేరుశనగ 12,000 720 మొక్కజోన్న 1,200 96 గతేడాది వరకు జీలుగ, జనుము విత్తనాలకే రాయితీ మిగితా విత్తనాలకు అమలైతే తగ్గనున్న ఆర్థిక భారం జిల్లాలో పత్తి, వరి సాగు అధికం సబ్సిడీ ఉండాలి వానాకాలంలో సాగు చేసే అన్ని రకల విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందజేయాలి. పెరిగిన పెట్టుబడులతో లాభాలు రావడం లేదు. ఎక్కువగా నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందజేస్తుందని ఆశిస్తున్నాం. – నర్సిములు, రైతు, కన్మనూర్ ఖరారు కాలేదు ఏ విత్తనాలకు ఎంతమేరకు రాయితీ ఇస్తారనే విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి ఖరారు కాలేదు. విత్తనాల అంచనా మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. – జాన్ సుధాకార్, జిల్లా వ్యవసాయాధికారి -
బీర్లు.. నో స్టాక్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 230 మద్యం దుకాణాల్లో అన్నిచోట్ల నో–స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. 15 రోజులుగా ఉమ్మడి జిల్లాలో స్టాక్ వచ్చిన పది నిమిషాల్లో ఖాళీ అవుతున్నాయి. తిమ్మాజిపేట, కొత్తకోట డిపోల నుంచి ఒక్కో దుకాణానికి 2–5 కేసుల వరకు మాత్రమే బీర్లు ఇస్తున్నారు. ఇచ్చిన స్టాక్ నిమిషాల వ్యవధిలో అయిపోవడంతో కష్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డిమాండ్కు తగ్గట్టుగా బీర్లు లేకపోవడంతో వ్యాపారులు సైతం నష్టపోతున్నారు. విపరీతంగా పెరిగిన ఎండలకు తోడు ఇటీవల లారీల సమ్మె జరగడంతో బీర్ల సరఫరా, ఉత్పత్తిలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటి అక్కడక్కడ కొంత వరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. ● గత 15రోజుల నుంచి తీవ్రమైన కొరత ● ఒక్క ఏప్రిల్లోనే ఉమ్మడి జిల్లాలో 4,02,961 కేసుల విక్రయం ● ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న ఎకై ్సజ్ అధికారులు ఉత్పత్తి తక్కువ కావడం వల్లే.. గతంలో ప్రతి ఏడాది వేసవి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో బీర్లు అధికంగా ఉత్పత్తి చేసి స్టాక్ చేసేవాళ్లు. ఈసారి అలా చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. ఈ నెల చివరి నాటి వరకు జిల్లాలో బీర్ల కొరత ఉంటుంది. ప్రొడక్షన్ తక్కువ కావడం వల్ల ఈ సమస్య వచ్చింది. – విజయ్భాస్కర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రైం: మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు చల్లని బీర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చల్లదనం ఉన్న బీర్లు మార్కెట్లో కొరత ఏర్పడటంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క ఏ ప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,02,961 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జి ల్లాలోని తిమ్మాజిపేట, కొత్తకోట మద్యం డిపోలకు బీర్లు సరఫరా చేస్తున్నారు. అయితే ఎండలు విపరీతంగా పెరగడంతో పాటు ఇటీవల ప్రొడక్షన్ సక్రమంగా లేకపోవడం ఇందుకు కారణమైంది. ఇప్ప టికే జిల్లాలో చాలావరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీర్లకు డిమాండ్ ఉన్న సమయంలో కొరత తలెత్తడంతో ఇటు మందుబాబులు, అటు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. నో స్టాక్ బోర్డులు -
హే.. భగవాన్
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. గురువారం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో 46.0, కొల్లాపూర్ 46.0 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. వెల్దండ, కల్వకుర్తి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, చిన్నచింతకుంట, నారాయణపేట జిల్లాలోని ధ న్వాడ, కృష్ణా, కొత్తపల్లి, గద్వాల జిల్లా వడ్డేపల్లి, అయిజ, అలంపూర్ మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై.. రెడ్ అలర్ట్కు చేరింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరిన్ని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 5 వరకు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు రెడ్ అలర్ట్ స్థాయి కి చేరుకుంటాయని చెబుతోంది. ఆదివా రం వరకు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం ఇదే మొదటిసారి. పలు మండలాల్లో రెడ్ అలర్ట్కు చేరుకున్న ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మరింత పెరిగే అవకాశం తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణుల సూచన -
డిగ్రీ కళాశాల ఏర్పాటు.. విద్యార్థులకు వరం
మద్దూరు: మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ఈప్రాంత విద్యార్థులకు వరంలాంటిదని పీయూ వైస్చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. మద్దూరు డిగ్రీ కళాశాల కరపత్రాన్ని గురువారం పీయూలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా మద్దూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిందన్నారు. దోస్త్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్లు పొందాలని సూచించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం.విజయ్కుమార్ మాట్లాడుతూ.. మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని కోర్సులు ఉన్నాయని.. స్థానిక విద్యార్థులు అడ్మిషన్ పొందేలా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019