breaking news
-
జనసేనానీ సామాజిక న్యాయం ఇదేనా?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనాల్లో కష్టపడి తిరిగిన వారికే జనసేన సీట్లు కేటాయిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పదేపదే చెప్పిన మాట ఇది. తీరా ఎన్నికల సీట్ల కేటాయింపులో పొత్తుల పేరు చెప్పి నమ్ముకున్న నాయకులను నట్ట్టేటా ముంచిన వైనంపై జనసేన కార్యకర్తలు, నాయకులు భగ్గుమన్నారు. అటువంటి నియోజకవర్గాల్లో కై కలూరు ఒకటి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు ప్రచారం చేయడానికి శుక్రవారం ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ తాలూకా సెంటర్కు రానున్నారు. నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావం నుంచి బీసీ వర్గానికి చెందిన బుసనబోయిన వెంకటేశ్వరరావు (బీవీ రావు) కష్టపడి పనిచేశారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన 10,738 ఓట్లు తెచ్చుకున్నారు. అప్పటినుంచి జనసేన ఇన్చార్జిగా సేవలు అందించారు. జనసేన సీటు తనకు దక్కుతోందని ఆశపడ్డారు. తీరా కూటమి పేరుతో చంద్రబాబు మాటలు విని పవన్ కల్యాణ్ బీవీ రావుకు కనీసం బీజేపీకి సీ టు కేటాయిస్తున్నామని కూడా చెప్పలేదు. దీంతో బీవీ రావు తీవ్ర మనస్తాపం చెందారు. అగ్రవర్ణ నా యకులకే అగ్రతాంబూలం ఇస్తున్న పవన్ కల్యాణ్ తీరు నచ్చక బీవీ రావు వైఎస్సార్సీపీలో చేరారు. బీసీలంటే చిన్నచూపు : ఉమ్మడి కృష్ణాలో విజయవాడ నుంచి పోతుల మహేష్ గతంలో జనసేన నుంచి పోటీ చేసి 18 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కై కలూరులో బీవీ రావు 10,738 ఓట్లు సాధించారు. పొత్తుల్లో భాగంగా ఈ రెండు సీట్లనూ ఈసారి బీజేపీకి కేటాయించారు. కై కలూరులో కామినేని శ్రీనివాస్, విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి సీట్లు దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్ అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిస్తారని బీసీలంటే చిన్నచూపు అని బీసీ వర్గాలు ఇప్పటికే ఆయన తీరును ఎండగడుతున్నాయి. వాస్తవంగా జనసేన 21 సీట్లలో ఆ పార్టీలో ఉన్న పాతవారికి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కాయని ఆ పార్టీ నాయకులే గగ్గోలు పెడుతున్నారు. కామినేనికి జై కొట్టాలా.. ఐదేళ్లుగా కై కలూరు నియోజకవర్గంలో కానరాని కామినేని ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. కేవలం పొత్తులు కుదిరినప్పుడు మాత్రమే కామి నేని తెరపైకి రావడం రివాజుగా మారింది. కోవిడ్ సమయంలోనూ ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్కే పరిమితమయ్యారు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించాలని వస్తున్న పవన్కల్యాణ్ ఆకర్షణకు లొంగే ప్రసక్తి లేదని నియోజకవర్గ యువత అంటోంది. పదేళ్లు కష్టపడిన బీవీ రావును కాదని కామినేనికి మద్దతు కనీసం సీటు మార్పు విషయం చెప్పకుండా అవమానం చంద్రబాబు చేతిలో పవన్కల్యాణ్ కీలుబొమ్మ నేడు కై కలూరు ప్రచార సభకు పవన్ -
పండుటాకులపై బాబు పగ
కక్షతో ఏడిపింఛెన్ ● టీడీపీ కుట్రలతో పెన్షన్ కష్టాలు ● మండుటెండలో పింఛన్దారుల అవస్థలు ● బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ● చంద్రబాబు కుతంత్రాలపై మండిపాటు ● రెండో నెలా తప్పని తిప్పలు ఏలూరు(మెట్రో): రాజకీయ పంతంతో పండుటాకులపై పచ్చ నేతలు పగ తీర్చుకుంటున్నారు. ప్రతి నెలా ప్రశాంతంగా జరిగే సామాజిక పింఛన్ల పంపిణీని అడ్డుకుని మండుటెండల్లో పేదలను అవస్థ లు పాలుచేస్తున్నారు. ప్రతినెలా ఒకటో తారీఖున వేకువజామున వలంటీర్ల ద్వారా అందించే పింఛన్ను అడ్డుకున్నారు. సజావుగా సాగే పెన్షన్ల ప్రక్రియకు గండికొట్టారు. పచ్చనేతల చర్యలకు పండుటాకులు, దివ్యాంగులు, వితంతువులు మండుటెండలో విలవిలలాడుతున్నారు. బ్యాంకుల వద్ద బారులు గతంలో పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్ సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా ఒకటో తారీఖున గడప చెంతకే అందించేలా ఏర్పాట్లు చేశారు. వలంటీర్లు వేకువజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బులు అందించేవారు. ఇలా పెన్షన్దారులకు జగన్ సర్కారు అన్నివిధాలా అండగా నిలిచింది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు, పవన్కళ్యాణ్ వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దే పెన్షన్ల అందించడాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. గతనెలలో పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయాల వద్ద అధికారులు పింఛన్లు పంపిణీ చేశారు. అయితే ఈనెల సచివాలయాలకు కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేసేలా ఆదేశాలొచ్చాయి. అధికారులు అకౌంట్లు ఉన్న లబ్ధిదారుల ఖాతాలకు పెన్షన్ నగదు జమచేశారు. దీంతో వృద్ధులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయా ల్సి వస్తోంది. ఇళ్ల నుంచి బ్యాంకులకు ఆటోలు, సహాయకుల సాయంతో వెళ్లాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా గురువారం ఇదే పరిస్థితి కనిపించింది. నడవలేని స్థితిలో ఉన్నవారి ఇళ్లకు వెళ్లి అధికారులు పింఛన్ సొమ్ములు అందించారు. జిల్లాలో 2.69 లక్షల మంది.. జిల్లాలోని 31 మండలాల్లో 2,69,888 పింఛన్లకు గాను ఈనెల 2,54,029 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో (94.12 శాతం) పెన్షన్ సొమ్ములు జమచేశారు. అలాగే 64,338 మందికి ఇళ్ల వద్ద అందించేందుకు ఏర్పాట్లు చేయగా 56,081 మందికి (87.17 శాతం) పంపిణీ పూర్తయ్యింది. మండుటెండలో ఎన్ని తిప్పలో.. బ్యాంకు వద్ద అలసి సొలసి.. -
మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్
ఏలూరు(మెట్రో): జిల్లాలో సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్ల నియామకానికి సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియను గురువారం జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్ పాఠక్, ఎస్ఏ రామన్ల సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.పుష్పమణి కలెక్టరేట్లోని ఎన్ఐసీలో నిర్వహించారు. జిల్లాలో 415 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 495 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ నీలాద్రి, ఎన్ఐసీ అధికారి శర్మ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు సమక్షంలో..
చింతలపూడి: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి చేసే సత్తా సీఎం వైఎస్ జగన్కు మాత్రమే ఉందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్బాబు అన్నారు. చింతలపూడి నగర పంచాయితీ పరిఽధిలోని గాజులవీధి, గణేష్ కాలనీలకు చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్ సీపీ నాయకుడు డోకల రాము ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు, అసెంబ్లీ అభ్యర్ధి కె విజయరాజు, ఏఎంసీ ఛైర్ పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి, ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు సోదరి పొన్నాల అనిత వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏఎంసీ ఛైర్ పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి, ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు సోదరి పొన్నాల అనిత, మండల సచివాలయాల కన్వీనర్ ఎం రాంబాబు, పార్టీ పట్టణ కన్వీనర్ కొప్పుల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు గంధం రామ్మోహన్రావు, గోపిరెడ్డి, గొట్టాపు బాబు, ఎం.దుర్గారావు, కె దినేష్రెడ్డి, ఎస్.భరత్రెడ్డి, మిరియాల దిలీప్, వెంపా కృష్ణ, రామరాజు నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేటి నుంచి హోమ్ ఓటింగ్
ఏలూరు(మెట్రో): జిల్లాలో శుక్రవారం నుంచి 5వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు హోమ్ ఓటింగ్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారన్నారు. జిల్లాలో 906 మంది హోమ్ ఓటింగ్కు అర్హులని, ఎన్నికల సిబ్బంది ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారి ఇళ్లకు వెళ్లి హోమ్ ఓటింగ్కు చర్యలు తీసుకుంటారన్నారు. హోమ్ ఓటింగ్ విధానంలో సెక్టోరల్ ఆఫీస్, మైక్రో అబ్జర్వర్, పోలింగ్ బూత్ అధికారి, ఆర్మ్డ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్ ఉంటారన్నారు. ఓటింగ్ ప్లాట్ఫాం ఏర్పాటుచేసి ఓటింగ్ విధానం పూర్తి సీక్రెట్గా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా ఉంగుటూరులో 223 మంది, దెందులూరులో 95 మంది, ఏలూరులో 114 మంది, పోలవరంలో 92 మంది, చింతలపూడిలో 120 మంది, నూజివీడులో 109 మంది, కై కలూరులో 153 మంది హోం ఓటింగ్ను వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం.. జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును ఈనెల 4, 5 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఆయా నియోజకవర్గాల వారీగా ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో 906 మందికి అవకాశం 4, 5 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఉంగుటూరు నియోజకవర్గం: ఉంగుటూరు మండలం నారాయణపురం జెడ్పీ హైస్కూల్. దెందులూరు నియోజకవర్గం: పెదపాడు మండలం వట్లూరులోని సీఆర్ రెడ్డి మహిళా కళాశాల. ఏలూరు నియోజకవర్గం: ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల. పోలవరం నియోజకవర్గం: కోటరామచంద్రాపురంలోని ఐటీడీఏ కార్యాలయం. చింతలపూడి నియోజకవర్గం: చింతలపూడి లోని గురుభట్లగూడెం రోడ్డులోని జెడ్పీ బాలికల హైస్కూల్. నూజివీడు నియోజకవర్గం: నూజివీడులోని ట్రిపుల్ఐటీలోని ఏబీ–1 బ్లాక్. కైకలూరు నియోజకవర్గం: కైకలూరులోని పాత తహసీల్దార్ కార్యాలయం.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019