breaking news
-
క్లుప్తంగా
యువకుడిపై కేసుతాండూర్: అన్నదమ్ములను దూషించడమే కాకుండా వారిపై చేయి చేసుకున్న ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు మాదారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపా రు. తాండూర్ మండలం మాదారం టౌన్షిప్కు చెందిన మడికంటి శ్రావణ్, సన్నాయిల రాజు గురువారం ఉదయం ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనతో గొడవ పెట్టుకున్న శ్రావణ్ను చితగ్గొట్టాలనే ఉద్దేశంతో రాజు అతని ఇంటికి వెవెళ్లి బూతులు తిట్టాడు. అతని అన్న మడికంటి సతీష్ అక్కడికి వెళ్లి ఎందుకు తిడుతున్నావని అడిగాడు. కోపంతో ఊగిపోయిన రాజు సతీష్ను సైతం కొట్టి దుస్తులు చించేశాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్టీసీ జేఏసీ కార్యవర్గం ఎన్నికమంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మంచిర్యాల డిపోలో టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. ఈ సందర్భంగా జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కన్వీనర్గా వి.భీమేశ్వర్రావు, చైర్మన్గా తోట సత్తయ్య, కోశాధికారిగా నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా మామిడిపల్లి శ్రీనివాస్, కోకన్వీనర్లుగా కేఎస్ రావు, గోలి శంకర్, దుర్గయ్య, రాజేశం, కార్యవర్గ సభ్యులుగా జ్యోతి, మురళి, పీఆర్ రావు, శంకర్, రాజేశ్వర్, అనూష, రమేశ్, బాపన్న ఎన్నికై నట్లు కన్వీనర్ వీబీరావు తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూ ర్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని రాజేశ్వర్రావుపల్లెలో గురువారం మధ్యాహ్నం పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి రూ.6,100 నగదు, రెండు పేకాట సెట్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో గడ్డం రవీందర్రెడ్డి, మారు వెంకటరెడ్డి, సీపెల్లి మొగిళి, గాడిపెల్లి సురేందర్, ఎనగందుల వెంకటేశ్, ఎనగందుల నందయ్య ఉన్నారు. రెండు లారీలు ఢీ.. తప్పిన ప్రమాదంజైపూర్: మండలంలోని ఇందారం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రాత్రి రెండు లారీ లు ఢీకొన్నాయి. జైపూర్ పవర్ ప్లాంటు నుంచి మంచిర్యాల వైపు బూడిద లోడ్తో వెళ్తున్న లారీని మంచిర్యాల నుంచి గోదా వరిఖని వైపు వెళ్తున్న మరో లారీ క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ లు బలంగా ఢీకొన్నప్పటికీ డ్రైవర్లకు ఎ లాంటి గాయాలు కాలేదు. పెద్ద ప్రమాదం తప్పిందని ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలా బాద్ జిల్లాలో డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 6 నుంచి బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ బీఏ (ఎల్) రెండో, ఆరో సెమిస్టర్ పరీక్షలు, ఈ నెల 7 నుంచి నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ను విడుదల చేసినట్లు కేయూ పరీక్షల ని యంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు ప రీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 6, 8, 10, 16, 18, 21, 25, 29వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వర కు, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఆరో సె మిస్టర్ ప రీక్షలు ఈ నెల 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆందోళన
నెన్నెల: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల కార్మికులు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వేతనాలు వెంటనే మంజూరు చేయాలంటూ నినాదాలు చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీతాలు ఇవ్వకపోతే విధులు బహిష్కరించి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నగదు పట్టివేతకాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని చొప్పరిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద గురువారం రాత్రి నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.98 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కరీంనగర్కు చెందిన ఎండీ అక్రం వద్ద రూ.98 వేల నగదు లభించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేసి ఎస్ఎస్టీ టీంకు అప్పగించినట్లు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని సూచించారు. హత్య కేసులో ఆరుగురికి జీవితఖైదు వాంకిడి: మండలంలోని ఖిరిడి గ్రామంలో జరిగిన హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సేషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.వీ రమేశ్ గురువారం తీర్పునిచ్చినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. భూతగాదాలో 2019 జూన్ 21న తొడాసం బొజ్జి రావు, సెడ్మకె గంగారాం, సెడ్మకె తెలంగ్రావు, సెడ్మకె యశ్వంత్రావు, సెడ్మకె జంగు, తొడసం శారద ఖిరిడి గ్రామానికి చెందిన రాయిసిడాం శ్యాంరావు(52), రాయిసిడాం తారాబాయి(45) దంపతులను గ్రామ శివారులో గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. మృతుల కుమారుడు రాయిసిడాం విలాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అప్పటి సీఐ రాణాప్రతాప్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుత సీఐ శ్రీనివాస్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బీజేపీతోనే పేదల అభివృద్ధికోటపల్లి: బీజేపీతోనే పేదల అభివృద్ధి సాధ్యమని ఎంపీ వెంకటేశ్ నేత ఆన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎంపీ వెంకటేశ్నేత, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమలుకానీ హమీలీచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని, గోమాస శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
ఆర్కే7లో వెంటిలేషన్ సమస్య తీర్చాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో కార్మికులు వెంటిలేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి బాజీసైదా గనిని సందర్శించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటిలేషన్ లేక పని స్థలాల వద్ద తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, నాణ్యమైన పనిముట్లు ఇవ్వడం లేదని, సైకిల్ షెడ్డు సరిపోవడం లేదని, సీఎంపీఎఫ్ రుణాలు పెండింగ్లో ఉన్నాయని నాయకుల దృష్టికి తెచ్చారు. అనంతరం నాయకులు గని మేనేజర్, ఏజెంట్ను కలిసి సమస్యలపై చర్చించారు. త్వరితగతిన పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఏరియా కార్యదర్శులు ప్రసాద్రెడ్డి, మారపల్లి సా రయ్య, బుచ్చయ్య, పిట్ సెక్రెటరీ బేర రవీందర్, నాయకులు దాడి రాజయ్య, మోతె లచ్చయ్య, ఆకు ల లక్ష్మణ్, గునిగంటి నర్సింహారావు, సంగం సదా నందం, అఫ్రోజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
కవ్వాల్లో ఆగని కలప స్మగ్లింగ్
● రాయికుంట బీట్లో విలువైన టేకు చెట్లు నరికివేత ● దుంగలను తరలించిన అక్రమార్కులు జన్నారం: కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో కలప స్మగ్లింగ్ ఆగడం లేదు. కఠినంగా ఉండాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారి చేసినా కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విలువైన టేకు చెట్లు నేలకొరుగుతున్నాయి. గతంలో పాతవి, పడిపోయిన చెట్లను తీసుకెళ్లే స్మగ్లర్లు ఇప్పుడు విలువైన టేకు చెట్లను ముక్కలుగా నరికి దుంగలను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. జన్నారం అటవీ డివిజన్లోని పలు బీట్లలో స్మగ్లింగ్ జరుగుతున్నట్లు ఇటీవల జరిగిన పలు సంఘటనల ద్వారా తెలుస్తోంది. గతంలో కారుతో కలప తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు అడ్డుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఇస్లాంపూర్ నుంచి కలప తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. చెట్లు నరికి ముక్కలు చేసి.. జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ కవ్వాల్ అటవీ సెక్షన్, రాయికుంట బీట్లో కొంద రు స్మగ్లర్లు విలువైన టేకు చెట్లను నరికి దుంగలను తరలించారు. చెట్ల మొదళ్లను పరిశీలిస్తే ఈ నరికివేత ఇటీవల కాలంలోనే జరిగినట్లు తెలుస్తోంది. రెండు విలువైన టేకు చెట్లను నరికి ముక్కలుగా చేసి అపహరించుకు పోయారు. మొదలు, చివరను అ క్కడే వదిలేశారు. మరో చెట్టు దుంగను తరలించి ఏర్పడకుండామొదలుకు నిప్పు పెట్టారు. ఈ తతంగమంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు అటుగా దృష్టి సారించకపోవడం గమనార్హం. గోదావరి దాటుతోందా? జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట్ రేంజ్ పరిధిలోని పలు బీట్ల నుంచి స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా కలపను గోదావరి దాటిస్తున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలోని పలు బీట్ల నుంచి స్మగ్లర్లు కలపను తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎడ్లబండ్లు, వాహనాల ద్వారా గోదావరి వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి గోదావరినది దాటించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఎఫ్డీవో మాధవరావు హయాంలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, గోదావరి తీర ప్రాంతాల్లో గస్తీ తిరిగేవారు. కొన్ని రోజులుగా అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు కలప రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ను ‘సాక్షి’ వివరణ కోరగా తనిఖీ చేయాలని సంబంధిత రేంజ్ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇద్దరిపై వేటు.. నెల రోజుల క్రితం ఆసిఫాబాద్ డివిజన్లోని జోడేఘాట్ రేంజ్ పరిధిలో కొందరు స్మగ్లర్లు అక్రమంగా నిల్వచేసిన కలపను అక్కడి అధికారులు పట్టుకున్నారు. ఆ కలప కవ్వాల్ సెక్షన్ నుంచి వచ్చినట్లు అనుమానం రావడంతో ఉన్నతాధికారులు బీట్ తనిఖీలు చేయించారు. తనిఖీల్లో రాయికుంట బీట్ నుంచి కలప తరలించినట్లు తేలడంతో ఉన్నతాధికారులు బీట్ అధికారి, సెక్షన్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన జరిగి నెల రోజులు గడువక ముందే మరో సంఘటన జరగడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సెక్షన్ పరిధిలోని అధికారులు వారికి కేటాయించిన క్వార్టర్లో ఉండకుండా నిత్యం రాకపోకలు చేయడంతో రాత్రి పూట స్మగ్లర్లు తమ పని సులువుగా కానిచ్చేస్తున్నారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల ద్వారా, నెత్తి మోతల ద్వారా సైజులను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019