breaking news
-
నిప్పుల వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తోంది. గురువారం భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉండగా.. ఏకంగా 22 మండలాల్లో హీట్వేవ్ నమోదైంది. కర్నూలు జిల్లాలో గూడూరు, కౌతాళం మండలాల్లో హీట్ వేవ్ నమోదు కావడం గమనార్హం. వడగాడ్పుల తీవ్రతకు వృద్ధులు, బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్లలు, రోగులు అల్లాడుతున్నారు. నంద్యాల జిల్లాలోని 8 మండలాల్లో 46 డిగ్రీలపైన, 10 మండలాల్లో 45 డిగ్రీలకుపైన, 4 మండలాల్లో 44 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్లలో 46.7, ఆళ్లగడ్డలో 46.6, మహానందిలో 46.4, నందికొట్కూరు, సంజామలలో 46.3, దొర్నిపాడు, కోవెలకుంట్లలో 46.1, పాణ్యంలో 45.9, మిడుతూరులో 45.9, బండిఆత్మకూరులో 45.7, శ్రీశైలంలో 45.6, రుద్రవరంలో 45.5, పగిడ్యాలలో 45.3, ఆత్మకూరు, చాగలమర్రిలో 45.2, కొత్తపల్లిలో 45.1, శిరువెళ్లలో 45, గడివేములలో 44.9, పాములపాడు, అవుకులో 44.7, నంద్యాలలో 44.6 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మండలాల్లో హీట్వేవ్ నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా గూడూరు, కర్నూలులో 45.3, కౌతాళంలో 44.9, ఎమ్మిగనూరులో 44.5, కోడుమూరులో 44.4 సి..బెళగల్లో 44.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్లలో 46.7 డిగ్రీలు కర్నూలు, గూడూరుల్లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత -
No Headline
ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు శేఖమ్మ. ఆస్పరికి చెందిన ఈమె పింఛన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇంటి నుంచి అతి కష్టం మీద ఎస్బీఐ సేవా కేంద్రం వద్దకు వచ్చింది. అయితే క్యూలో నిలబడలేక సేవా కేంద్రం ఎదుటే కూర్చుండిపోయింది. తమలాంటి వృద్ధులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్లు ద్వారా ఇంటి దగ్గరకే వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చే వారని, ఏఇబ్బందులు ఉండేవి కాదని ఈమె తెలిపారు. రెండు నెలలు నుంచి పింఛన్ డబ్బులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కష్టాలు తెచ్చి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. – ఆస్పరినిలబడే శక్తి లేక.. -
బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ను త్వరగా పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కర్నూలు ప్రాంతీయ ముద్రణాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈవీఎంలపై అతికించే బ్యాలెట్ పేపర్లను కర్నూలులోనే ముద్రిస్తున్నట్లు చెప్పారు. మొదట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లను ముద్రించి డిస్పాచ్ చేయాలన్నారు. 16 మంది కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే రెండో బ్యాలెట్ యూనిట్ను ఏర్పాటు చేయాల్సిన పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీల బ్యాలెట్ ముద్రించిన తరువాత ముద్రించాలన్నారు. అనంతరం ఏఏ నియోజకవర్గాల బ్యాలెట్పేపర్ల పూర్తి అయింది, ఎన్ని నియోజకవర్గాలకు బ్యాలెట్ పేపర్లను పంపారనే విషయాలను ప్రింటింగ్ ప్రెస్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్.మోహన్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. కాగా, బ్యాలెట్ పేపర్లను పటిష్ట బందోబస్తు మధ్య సంబంధిత నియోజకవర్గాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్వో భార్గవ్తేజ, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య సంబంధిత నియోజకవర్గాలకు పంపాలి -
No Headline
ప్రతి నెలా ఒకటో తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పండుగ వచ్చేది. ఇంటి వద్దకే వలంటీర్లు వచ్చి ఠంచన్గా పింఛన్ అందజేసేవారు. అవ్వాతాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేది. మందులకు, ఇతర ఖర్చులకు నెలంతా ఎవరి దగ్గర చేయిచాపాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఒకటో తేదీ వచ్చిందంటే పింఛన్ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలవుతోంది. గత నెలలో సచివాలయాలకు.. ఈ నెల బ్యాంకులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమను కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బుద్ధిచెబుతామని హెచ్చరిస్తున్నారు.● చంద్రబాబూ మాపై మీకెందుకు పగ ● వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి కష్టాలు తెచ్చిపెట్టావు ● నెలనెలా ఇంటి వద్దే పింఛన్ తీసుకునే వెసలుబాటు రద్దు చేయించావు ● నీవూ వద్దు.. నీ మోసపూరిత హామీలూ వద్దు ● మండిపడుతున్న పింఛన్ లబ్ధిదారులు -
No Headline
ఈ వృద్ధుడి పేరు లక్ష్మన్న, చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామానికి చెందిన ఈయన పింఛన్ డబ్బు కోసం ఉదయాన్నే 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరాడు. కాలి నడకన ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ఉదయం 9 గంటలకల్లా చిప్పగిరి చేరుకున్నాడు. ప్రతి నెలా వలంటీర్ వచ్చి ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడని గుర్తు చేశారు. చంద్రాబాబు పింఛన్ ఇంటి దగ్గరకు రాకుండా చేశారని, చానా ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ గ్రామానికి ఎంలాంటి రవాణా సౌకర్యాలు లేవని, సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఒంటిరిగా వచ్చినట్లు చెప్పారు. ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. – చిప్పగిరికాలినడకన ఐదు కిలోమీటర్లు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019