breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మీకు ఓటు అడిగే అర్హతే లేదు
నల్లచెరువు: ‘‘ప్రతి నెలా 1వ తేదీ ఇంటికే వచ్చే పింఛన్ రాకుండా చేశారు. మేమిప్పుడు ఎర్రటి ఎండలో పడరానిపాట్లు పడుతుంటే.. మమ్మల్ని వచ్చి ఓటు అడుగుతున్నారు. మీకు మనసన్నదే లేదా..ఏ ముఖం పెట్టుకుని వచ్చారు’’ అంటూ టీడీపీ నేతలపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నల్లచెరువులో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బ్యాంకు వీధిలో పింఛన్ కోసం ఎర్రటి ఎండలో నిరీక్షిస్తున్న వృద్ధుల వద్దకు వెళ్లి చంద్రబాబుకు ఓటు వేయాలని కోరారు. దీంతో పలువురు వృద్ధులు, దివ్యాంగులు టీడీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ఇంటి పెద్దకొడుకులా ప్రతి నెలా 1వ తేదీ ఉదయమే వలంటీర్ను ఇంటికే పంపి పింఛన్ సొమ్ము అందేలా చూశారు. కానీ మీ చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం వలంటీర్ల సేవలు ప్రజలకు అందకుండా చేశారు. చంద్రబాబు ఘనకార్యం వల్లే మేమంతా మండుటెండలో పింఛన్ కోసం బ్యాంకుల ఎదుట నిలబడాల్సి వచ్చింది’ అని మండిపడ్డారు. తమను ఇంతలా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు ఓటు వేయాలని ఎలా అడుగుతున్నారంటూ నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే మాకు అవస్థలు టీడీపీ నాయకులపై పింఛన్దారుల ఆగ్రహం -
సత్యకుమార్ ఓసీనే!
● సోషల్ మీడియాలో విద్యార్హత పత్రాలు చక్కర్లు ● అందులో ఓసీగా పేర్కొన్న వైనం ధర్మవరం: తనను తాను యాదవ్గా చెప్పుకున్న సత్యకుమార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడినంటూ ఇన్నాళ్లూ ధర్మవరం ప్రజలను మోసం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీసీలను వంచించారు. కానీ సత్యకుమార్ చదువుకున్న సమయంలో ఓసీ అని పేర్కొన్న సర్టిఫికెట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ ఓట్ల కోసం గాలం.. ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తాను బీసీనంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసుకున్నారు. బీసీ సంఘాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టి బీసీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అలాగే తాను యాదవుడినని చెబుతూ ఆ సామాజికవర్గం ఓట్ల కోసం వల వేశారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో సైతం క్యాస్ట్ కాలంలో బీసీ అని మాత్రమే పొందుపరిచారు. తన సామాజికవర్గానికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంతో అందరికీ అనుమానాలు తలెత్తాయి. బండారం బట్టబయలు.. సత్యకుమార్ బండారం సోషల్ మీడియా వేదికగా బట్టబయలైంది. సత్యకుమార్ విద్యాభ్యాసం చేసిన ప్రొద్దుటూరు, మదనపల్లెలో చదివిన విద్యా సంస్థల్లో ఆయన సర్టిఫికెట్లలో ఇండియన్ మరాఠా (ఓసీ)గా పేర్కొన్నారు. ఆ ధ్రువీకరణ పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ధర్మవరం వాసులు విస్తుపోతున్నారు. అసలు పేరు సత్యనారాయణరావు.. వాస్తవానికి మహారాష్ట్ర మరాఠా కుటుంబానికి చెందిన సత్యకుమార్ అసలు పేరు సత్యనారాయణరావు, ఆయన తండ్రిపేరు నాగరాజరావు. వీరు ఓసీలు. ఈ విషయం ఆయన విద్యార్హత ధ్రువీకరణ పత్రాల్లో ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియవన్నట్లుగా ఆయన బీసీగా చెబుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం విస్మయాన్ని కల్గిస్తోంది. -
No Headline
నాటు సారా స్థావరంపై దాడులు కంబదూరు: మండలంలోని పాళ్లూరు గ్రామ పొలాల్లో ఉన్న నాటు సారా తయారీ స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. 1000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. తయారీ దారుడి నుంచి 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. రోబోటిక్ సర్జరీపై వైద్య విద్యార్థులకు అవగాహన అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం రోబోటిక్ సర్జరీపై వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ షాహిద్ రోబోటిక్ సర్జరీ ద్వారా కలిగే ప్రయోజనాలను విపులంగా తెలియజేశారు. శస్త్రచికిత్సలు ఎంత సులభంగా చేయవచ్చో పవర్పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. వెన్నెముక, యురాలజీ, గైనకాలజీ, అన్ని రకాల కేన్సర్లుకు రోబోటిక్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు మాట్లాడుతూ.. డాక్టర్ షాహిద్ వైద్య కళాశాల 2కే8 బ్యాచ్కు చెందిన విద్యార్థి అని, నారాయణ హృదయాలయలో జనరల్ సర్జరీ, హైదరాబాద్లోని ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీలో గ్యాస్ట్రోఎంటరాలజీ పూర్తి చేశారన్నారు. బిరియాట్రిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీలపై ఫెలోషిప్ పొంది విద్యనభ్యసించిన కళాశాలలోనే గెస్ట్ లెక్చర్ ఇవ్వడం స్పూర్తిదాయకమన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర రావు, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ వేముల శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ నవీన్, ప్రొఫెసర్లు డాక్టర్ భీమసేనాచార్, డాక్టర్ రామస్వామి, డాక్టర్ శివశంకర్ నాయక్, డాక్టర్ సుచిత్రశౌరి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
మడకశిర రూరల్: గ్రామీణ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పీఎస్ మంజువాణి సూచించారు. గురువారం ఆమె నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఆనంతరం నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లుతో సమావేశమై మాట్లాడారు. వైద్య చికిత్సల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆరోగ్య సురక్ష తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. చికిత్స కోసం పీహెచ్సీలకు వస్తున్న వారికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ఎవరైనా వ్యాధులతో బాధపడుతుంటే చికిత్స అందజేయాలన్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత రోజుల్లో బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలు 11 గంటల తర్వాత బయటికి రాకుండా అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి చికిత్సలు అందించండి డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి -
పోలింగ్ ఏజెంట్ల పాత్ర కీలకం
పుట్టపర్తి టౌన్/ హిందూపురం అర్బన్ : ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల తరపున ఓటరు పరిశీలనలో ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంటోంది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్లు కూర్చొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ప్రతి అభ్యర్థి తరపున ఒక పోలింగ్ ఏజెంటు, ఇద్దరు రిలీవర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరికి ఏజెంట్ పాసు జారీ చేస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు పాసులు జారీ చేసినా ఒకరు మాత్రమే బూత్లో కూర్చోవడానికి అనుమతి ఇస్తారు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించరాదు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి చీటీలను పంపడం కూడా నిషేధం. విశ్వాసపాత్రులకే అవకాశం.. పోలింగ్ బూత్ ఏజెంట్లుగా తమకు విశ్వాసంగా ఉండే వారినే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎంపిక చేస్తుంటారు. దానికి అనుగుణంగా వారు సైతం దొంగ ఓటర్లను సులువుగా గుర్తించి ఓటింగ్ను అడ్డుకుంటారు. పోలింగ్ బూత్లో ఏజెంట్ నిర్ధారించిన తర్వాతనే ఓటు వేసేందుకు ఓటరును అధికారులు అనుమతిస్తారు. ఏజెంట్ను ఇలా నియమించుకోవచ్చు: ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ అభ్యర్థి తరఫున పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉండాలనుకునే వారు తొలుత వారి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్తో పాటు ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ వేసి పార్టీ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఎన్నికల అధికారులకు దరఖాస్తు అందజేస్తారు. పరిశీలన అనంతరం పోలింగ్ బూత్ ఏజెంట్గా వ్యవహరించేందుకు అధికారులు అనుమతిస్తూ ఓ గుర్తింపు కార్డును జారీ చేస్తారు. ఓ పోలింగ్ బూత్కు సంబంధించి ఏజెంట్గా నియమితులైన వారు మరో బూత్లో కూర్చొనేందుకు వీలుండదు. అర్హతలు ఇవే.. పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించే వ్యక్తి ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉండాలి. పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి వచ్చే వారిని గుర్తించడానికి మాత్రమే వారికి అవకాశం ఉంటుంది. అంతకు మించి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు. ఏజెంట్గా నియమితులైన వారు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. ఏదైనా పార్టీ తరపున ప్రచారం చేసినట్లు పోలింగ్ సిబ్బంది గమనిస్తే ముందుగా హెచ్చరించి బూత్ నుంచి బయటకు పంపిస్తారు. దొంగ ఓటర్లను సులువుగా గుర్తు పట్టేస్తారు ఏజెంట్లుగా స్థానికులకే అవకాశం
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019