breaking news
-
రూ.60కోట్ల జరిమానా..
● మట్టి అక్రమ తవ్వకాలపై కన్నెర్ర ● 19 మంది గుర్తింపు.. 17మందికి పెనాల్టీ ● కోర్టును ఆశ్రయించిన పలువురు.. ఖమ్మంఅర్బన్: జిల్లాలో అనుమతులు లేకుండా, అనుమతి ఉన్నా పరిధి దాటి ఇబ్బడి ముబ్బడిగా మట్టితో పాటు స్టోన్ మెటల్ తవ్వకాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా సాగిందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ అంశాన్ని ఎన్ని కల ప్రచారంలోనూ అస్త్రంగా ఉపయోగించారు. తాము అధికారంలోకి రాగానే అక్రమాలను అరికట్టడమే కాక తవ్వకాలు చేపట్టిన వారి నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వసూలు చేస్తామని చెప్పారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధికారంలో కి రాగానే ఈ విషయంపై దృష్టి సారింంచారు. ఈమేరకు అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ జిల్లాలో 19 మందిని గుర్తించి 17 మందికి రూ.60 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఇటీవల మైనింగ్ శాఖ అధికా రులు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులు అందుకున్న వారు తవ్వకాలతో తమకేం సంబంధం లేదని కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. తవ్వకాలకు బ్రేక్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఖమ్మం, పాలేరు ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగానే అక్రమ మైనింగ్ కట్టడిపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపే వరకు ఎక్కడికక్కడ తవ్వకాలు నిలిపివేయించాలని ఆదేశించారు. దీంతో తవ్వకాలకు నిలిపేసిన అధికారులు.. అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు 19మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో 17మందికి రూ.3కోట్లు, రూ.5కోట్లు, రూ.8కోట్లు ఇలా అందరికీ కలిపి రూ.60 కోట్ల మేర జరిమానా చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మండలాల్లోనే అత్యధికంగా మట్టి తవ్వకాలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిసింది. జిల్లాలో ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎంత మేర తవ్వకాలకు అనుమతి ఉంది.. అక్కడ ఏ మేరకు తవ్వకాలు చేపట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించారనే అంశంపై ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఈటీఎస్(ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) శాటిలైట్ సర్వే చేయించి అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారికి జరిమానా విధించారు. కొందరు అనుమతి తీసుకోకపోగా.. ఇంకొందరు అనుమతి తీసుకున్నా పరిమితికి మించి మట్టి తవ్వకాలు చేపట్టి భవన నిర్మాణాలు, రహదారులు, రియల్ వెంచర్లకు తరలించినట్లు గుర్తించారని తెలిసింది. అయితే, జరిమానా నోటీసులు అందుకున్న వారు మాత్రం తవ్వకాలు, అక్రమాలతో తమకేం సంబంధం లేదంటూ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇక మైనింగ్ శాఖలో లోపాలను సరిదిద్దే క్రమాన ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులను సైతం బదిలీ చేయడంతో విచారణ వేగంగా సాగింది. మూడింటికే అనుమతి జిల్లా వ్యాప్తంగా మట్టి తవ్వకాలు కోసం మూడు మండలాల్లో మూడు క్వారీలకు మాత్రమే అనుమతి ఉంది. ఆ క్వారీలు కూడా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయని మైనింగ్శాఖ అధికారులు చెపుతున్నారు. ఎర్రుపాలెం మండల రాజుపాలెం, రఘునాథపాలెం మండలం కోయచలక, ఖమ్మం రూరల్ మండలం అరెకోడులో క్వారీలు ఉండగా.. ఇంకా చాలా చోట్ల అనుమతి లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ఇటీవల రఘునాథపాలెం, బల్లేపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి కేటాయించారు. ఈ భూమిలోనూ కొన్నాళ్ల క్రితం మట్టి తవ్వకాలు చేపట్టగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించి తవ్వకాలు చేపట్టిన వారితోనే గుంతలు పూడ్పించాలని సూచించారు.గతంలో ఓ క్వారీకి రూ.16కోట్ల పెనాల్టీ గతంలో రఘునాథపాలెం మండలం శివాయిగూడెం పువ్వాడనగర్ సమీపాన గుట్టపై అనుమతికి మించి తవ్వకాలు చేపట్టారని లీజ్దారులకు నాలుగేళ్ల క్రితం రూ.16 కోట్ల జరిమానా విధించారు. అయితే, లీజ్దారులు మాత్రం అనుమతి తీసుకున్న ప్రాంతంలోనే తవ్వకాలు చేపట్టామని, ఇతర ప్రాంతంతో తమకేం సంబంధం లేదని కోర్టును అశ్రయించగా.. ఆ కేసు కొనసాగుతోంది.అక్రమాలకు పాల్పడితే చర్యలు అనుమతికి మించి తవ్వకాలు చేపట్టినా, అక్రమంగా మట్టి తవ్వకాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకంటాం. ఈటీఎస్ సర్వే ద్వారా అక్రమ తవ్వకాలు చేపట్టిన వారికి జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశాం. ఇక ముందు ఎక్కడా ఇలాంటివి జరగకుండా పర్యవేక్షిస్తాం. – ఆర్.సాయినాఽథ్, మైనింగ్ ఏడీ -
నేను పక్కా లోకల్ !
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించి.. కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఆ ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయలేకపోయారు. అయినా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం తొందరపాటు చర్య. నా విజయానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకాచౌదరి, పార్టీ నేతలు, కేడర్ కృషి చేస్తున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండగా.. అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తా. నేను స్థానికేతరుడినని చెబుతున్న వారు మా స్వస్థలం కూసుమంచి మండలం చేగొమ్మగా గుర్తించాలి..’ అని ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి పేర్కొన్నారు. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురాంరెడ్డి వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..●ప్రజల నుంచి స్పందన బాగుంది.. గత నెల 25న నామినేషన్ వేసింది మొదలు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ప్రచారం చేస్తున్నాం. కార్యకర్తలతో భేటీ అవుతూ సభల్లో పాల్గొంటున్నాం. ఇప్పటి వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తయింది. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈనెల 4న కొత్తగూడెంలో సీఎం రేవంత్రెడ్డి ప్రచారానికి వస్తున్నారు. దీంతో మాకు మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ●కాంగ్రెస్కే పట్టం ఖాయం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తమ సత్తా చూపించారు. గత పదేళ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉద్యోగ నియామకాలు, రైతులకు రూ.లక్ష రుణమాఫీ, పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇక రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ఏమైందో అందరం చూస్తున్నాం. ఉద్యోగ నియామక పరీక్షల పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఇక ఎమ్మెల్యేలు ప్రజలను అనేక విధాలుగా అవస్థ పెట్టారు. వీటితో విసిగిపోయిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పు చెప్పారు. అదేమాదిరి లోక్సభ ఎన్నికల్లోనూ ఫలితాలు వస్తాయి. దేశవ్యాప్తంగా శక్తివంతంగా తయారైన ఇండియా కూటమి.. సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో సత్తా చాటుతుంది. ●150 రోజులకే ఉలుకెందుకు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన పదేళ్లు పాలించి సమస్యలు పరిష్కరించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 150 రోజుల్లోనే ఆయనకు అంత ఉలుకెందుకు? కరెంట్ కోతలున్నాయని ఆరోపిస్తున్నారు. జిల్లా, రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ ఇబ్బందులు లేవు. కావాలనే కేసీఆర్, ఆ పార్టీ శ్రేణులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 65 లక్షల మంది రైతులకు రైతుబంధు ముట్టింది. మిగిలిన హామీలను కూడా మా ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుంది. ●అందరూ కలిసి వస్తున్నారు.. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో అన్నిచోట్ల పర్యటించేలా షెడ్యూల్ తయారు చేసుకున్నాం. జిల్లాలో ముగ్గురు శక్తివంతమైన మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంపీ రేణుకాచౌదరి వస్తున్నారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ప్రచారంలో కలిసొస్తున్నారు. ఏళ్ల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాముఖ్యత లభించింది. గతంలో జలగం వెంగళరావు ఉన్నప్పుడు ఇలా ఉండేది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు. ●సమస్యల పరిష్కారంపై దృష్టి నేను గెలవగానే లోక్సభ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తా. ఖమ్మంలో యూనివర్సిటీ మాత్రమే కాదు.. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రియ విద్యాలయం కూడా లేదు. స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ మూతపడింది. ఇక భద్రాచలం రోడ్–కొవ్వూరు రైల్వేలైన్ డిమాండ్ నెరవేరడం లేదు. కొత్తగూడెంలో విమానాశ్రయం.. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి పనులు చేయిస్తా. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ రేణుక, పార్టీ శ్రేణుల కృషితో గెలుస్తా.. లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే రిపీట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్వి తొందరపాటు విమర్శలు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్లో మూడు తరాలు నేను స్థానికుడిని కాదని కొందరు విమర్శిస్తున్నారు. మాది కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఇక్కడ వ్యాపారాలు కూడా ఉన్నాయి. మా నాన్న నాలుగు సార్లు లోక్సభ, నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మా తాత ఉమ్మడి జిల్లాలో పార్టీ కోసం పనిచేశారు. అలా మూడు తరాలుగా మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉంది. నేను గతంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశించినా కొన్ని కారణాలతో పోటీ చేయలేకపోయాను. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలుస్తా. -
వడదెబ్బతో వృద్ధుడు మృతి
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లికి చెందిన వృద్ధుడు పూనాటి రామయ్య(83) గురువారం వడదెబ్బ బారిన పడి మృతి చెందాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఆయన వడదెబ్బ బారిన పడగా మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. రామయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగాపురంలో రెండు గేదెలు మృతి నేలకొండపల్లి: మండలంలోని మంగాపురంలో రెండు గేదెలు ఆకస్మాత్తుగా మృతి చెందాయి. గ్రామానికి చెందిన భూక్యా సైదులు గేదెలు రోజు మాదిరిగా గురువారం మేతకు వెళ్లాయి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాయి. పాడిపై ఆధారపడి జీవిస్తున్న సైదులు కుటుంబం ఈ ఘటనతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక మండలంలోని చెరువుమాధారంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో గురువారం ప్రమాదవశాత్తు నాలుగు గేదెలు పడ్డాయి. మేతకు వెళ్లిన సమయాన తాగునీటి కోసం వెళ్లి బావిలో పడినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని గుర్తించే లోగా చీకటి పడడంతో బయటకు తీసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. విద్యుదాఘాతంతో ఎద్దు, మేక... రఘునాథపాలెం: మండలంలోని పంగిడిలో తెగి పడిన విద్యుత్ తీగలను తాకడంతో షాక్కు గురైన ఎద్దు, మేక మృతి చెందాయి. ఇటీవల వచ్చిన ఈదురుగాలులతో గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. అయినా సరఫరా నిలిపివేయకపోవడంతో గురువారం శంకర్కు చెందిన ఎద్దు, చిన్నాకు చెందిన మేక తీగను తాకగా షాక్ గురై మృతి చెందాయి. సమాచారం అందుకున్న విద్యుత్శాఖ అధికారులు వివరాలు సేకరించారు. -
అరచేతిలో సమగ్ర సమాచారం
ఖమ్మంసహకారనగర్: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడమే కాక ఓటర్లకు సులువుగా సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ రకాల యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా ఓటరు ఎక్కడ నుంచైనా సెల్ఫోన్ ద్వారా పలు వివరాలు తెలుసుకునే వెసలుబాటు కలుగుతోంది. అంతేకాక పలు వెబ్సైట్ల ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా కొన్ని యాప్లు, వెబ్సైట్ల వివరాలు... ● ఓటరు హెల్ప్లైన్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమాన ఓటరు జాబితాలో పేరు ఉందో, లేదో తెలుసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈమేరకు వివిధ వెబ్సైట్ల (voter.gov.in, ceotelangana.gov.in, nvsp.in, voterhelpline)ను ఏర్పాటుచేశారు. వీటిలో పేరు, ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ తదితర ఆధారాల ప్రకారం జాబితాలో పేరు, ఉందా లేదా అని చూడడంతో పాటు పోలింగ్ బూత్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇంకా సులభంగా ఓటు వివరాలు తెలుసుకునేందుకు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 1950 ఫోన్ చేయొచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ నిరంతరాయంగా పనిచేస్తుంది. ● కేవైసీ యాప్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను తెలుసుకోవాలంటే గతంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్లో కేవైసీ(నో యువర్ క్యాండిడేట్) యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే లోక్సభ బరిలో ఎందరు అభ్యర్థులు ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాక అభ్యర్థి విద్యార్హతలు, వారి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు ఇలా అన్ని వివరాలు తెలిసిపోతాయి. ●● సక్షం యాప్ వృద్ధులు, దివ్యాంగుల కోసం సక్షం యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ఈ యాప్లో వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అధికారులు వృద్ధులు, దివ్యాంగుల నుంచి ముందుగా దరఖాస్తులు స్వీకరించి హోం ఓటింగ్కు అవకాశం కల్పించారు. -
● పతి కోసం సతి !
ఖమ్మం లోక్సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరఫున ఆయన సతీమణి వినీలరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి వినోద్రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లుతో కలిసి వాకింగ్ చేస్తూ వాకర్లను ఓట్లు అభ్యర్థించారు. ఆతర్వాత ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో జరిగిన సభలోనూ పాల్గొన్నారు. ఇక వినోద్రావు సతీమణి వినీల ఖమ్మం 9, 53వ డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన ఆమె కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి వినోద్రావు గెలిపించాలని, తద్వారా జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఇక వినోద్రావు కుమారులు తాండ్ర వినీత్, వినయ్ సైతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. – ఖమ్మం మామిళ్లగూడెం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019