breaking news
-
కేసీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ పరిశీలన
కామారెడ్డి క్రైం: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న కామారెడ్డిలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ రోడ్షో రూట్ మ్యాప్ను గురువారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, నల్లమడుగు సురేందర్ పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లపై స్థానిక నేతలకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావు, నాయకులు పరికి ప్రేంకుమార్, జూకంటి ప్రభాకర్రెడ్డి, రామ్మోహన్, భూంరెడ్డి, లక్ష్మీనారాయణ, గైని శ్రీనివాస్, భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ సమయం పెరిగింది
కామారెడ్డి క్రైం: పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సాధారణ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకుని వంద శాతం ఓటింగ్ నమోదుకు సహకరించాలని కోరారు. అలాగే ఓటింగ్ గోప్యతను పాటిస్తూ పారదర్శకంగా హోం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటింగ్ను వీడియో రికార్డ్ చేస్తామని పేర్కొన్నారు. హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు 4, 5 తేదీలలో ఇంటి వద్ద అందుబాటులో ఉండి, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డి క్రైం: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర అంశాలు ఏమైనా ఉంటే సాధారణ ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఎన్నికల పరిశీలకుడు గోపాల్ జీ తివారి కామారెడ్డిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొ న్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏ విషయంౖపైనెనా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఆయనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల విషయంలో ఏవై నా సందేహాలు ఉంటే ఆయన నివృత్తి చేస్తార ని, సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తారని పేర్కొన్నారు. నేరుగా కలవడం వీలు కాని వారు 79956 92890 నంబర్లో సంప్రదించ వచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఫిర్యాదు చేయవచ్చు.. -
ఆదుకున్నోళ్లకే ఓటు వేయండి
గాంధారి/తాడ్వాయి: ఆపదలో ఆదుకున్నవారికి, సంక్షేమ పథకాలు అందించిన వారికే ఓటు వేయాలని, అబద్ధాలు ఆడేవారికి ఓటు వేయొద్దని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కోరా రు. గురువారం గాంధారి, తాడ్వాయి మండలాల్లో నిర్వహించిన రోడ్షోలలో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మె ల్యే జాజాల సురేందర్లతో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడా రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అబద్ధాలు చెప్పి, అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని మర్చిపోయారన్నారు. బీబీ పాటిల్ పదేళ్లు ఎంపీగా ఉండి ఏ అభివృద్ధి చేయలేదని, సురేష్ షెట్కార్ కూడా జహీరాబాద్ ఎంపీగా పనిచేసి ఉద్ధరించింది ఏమీలేదని, వీరిద్దరూ దద్దమ్మలేనని ఎద్దేవా చేశారు. బీబీ పాటిల్ పార్టీని మార్చినంత మాత్రాన బీజేపీకి ఎవరూ ఓటు వేయరన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ..తనను పెద్ద మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మీ సమస్యలపై పోరాడుతానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్రెడ్డి, తాడ్వాయి మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ నర్సిములు, జెడ్పీటీసీ రమాదేవి, బీఆర్ఎస్ పార్టీ గాంధారి మండలాద్యక్షుడు శివాజీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు పెద్దబూరి సత్యం, సత్యం రావు, బలరామ్ నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎస్వో మల్లికార్జున్ బాబు సూచించారు. గురువారం ఆయన అడ్లూర్, ఇస్రోజీవాడి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 28,189 మంది రైతుల నుంచి రూ. 342 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు రూ.235 కోట్లు చెల్లించామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
విధులను పారదర్శకంగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: లోక్సభ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఆదేశించారు. గురువారం ఆయన న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో మాట్లాడారు. పోలింగ్ సన్నద్ధతపై సమీక్షించారు. కలెక్టర్లు, ఎస్పీలకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 78 శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ సింధు శర్మ, ఎన్నికల విభాగం అధికారులు ప్రేంకుమార్, సుమలత, సరళ, స్వప్న, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019