ఆర్థిక ఒడిదుడుకులు | - | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఆర్థిక ఒడిదుడుకులు

Published Fri, Feb 21 2025 1:09 PM | Last Updated on Fri, Feb 21 2025 1:09 PM

ఆర్థిక ఒడిదుడుకులు

ఆర్థిక ఒడిదుడుకులు

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనకబాటు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్‌ రూరల్‌ 22, (వరంగ ల్‌), మహబూబాబాద్‌ 23వ స్థానంలో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్‌ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ’తెలంగాణ రాష్ట్ర గణాంకా ల నివేదిక– అట్లాస్‌–2024’లో ఈ వివరాలు వెల్లడించారు.

పడుతూ.. లేస్తూ 14, 15 స్థానాల్లోనే..

ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిగాను ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్‌ 22, మహబూబా బాద్‌ 23, జనగామ 29, జేఎస్‌ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైంది. కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్‌ వరంగల్‌ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆరిక వృద్ధిలో టాప్‌–2లో నిలిచినట్లు చెబుతున్నారు.

తలసరి ఆదాయంలో భూపాలపల్లి బెటర్‌..

2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655లతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 సంవత్సరం ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477లు తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్‌ రూరల్‌ (వరంగల్‌) గతంలో రూ.1,94,317లతో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్‌ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086 లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్‌ అర్భన్‌ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది.

పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్‌..

ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో ఉన్న 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్‌ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్‌ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 (89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా మహబూబాబాద్‌ జిల్లాలో 7.74.549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..

9,92,333

38,20,369

28,28,036

గ్రామీణ జనాభా

పట్టణ/నగరజనాభా

మొత్తం జనాభా

జిల్లా మొత్తం గ్రామీణ పట్టణ/నగరం

జనాభా జనాభా జనాభా

హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629

వరంగల్‌ 7,37,148 5,10,057 2,27,091

జనగామ 5,34,991 4,63,634 71,357

జేఎస్‌.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387

మహబూబాబాద్‌ 7,74,549 6,98,173 76,376

ములుగు 2,94,671 2,83,178 11,493

రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు

జేఎస్‌ భూపాలపల్లిలో తగ్గి... ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’

తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్‌ భూపాలపల్లి

హనుమకొండ జిల్లాలో అర్బన్‌ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే..

‘రాష్ట్ర గణాంకాల నివేదిక అట్లాస్‌–2024’లో వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement