
తగ్గిన చలి గాలులు
సాక్షి, పాడేరు: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తున్నప్పటికీ చలిగాలుల తీవ్రత తగ్గింది. పాడేరు,అరకులోయ,లంబసింగితో పాటు పలు ప్రాంతాల్లో ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. లైట్లు వేసుకునే వాహనాలను నడపవలసి వచ్చింది. జి.మాడుగులలో 13.9, చింతపల్లిలో 14, జీకే వీధిలో 14.3, పెదబయలులో 15.5, డుంబ్రిగుడలో 15.7, ముంచంగిపుట్టులో 15.9, పాడేరులో 16, అరకులోయలో 16, అనంతగిరిలో 16.2, హుకుంపేటలో 16.8, కొయ్యూరులో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు బుధవారం నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment