-
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
బీఎస్పీ గూటికి మందా
● మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం ● నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. 1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం.. మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు. -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
తిరుమలనాథస్వామి జాతర ప్రారంభం
నారాయణపేట రూరల్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభుగా వెలిసిన తిరుమలనాథస్వామి జాతర బుధవారం ప్రారంభమైంది. ముందుగా శ్రీలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అభిషేకం, అర్చన, మహామంగళహారతి కార్యక్రమాలు కనులపండువగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం కల్యాణం నిర్వహించి, సాయంత్రం స్వామివారి పల్లకిసేవా వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారు, స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. నేడు రథోత్సవం ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా ఆలయంలో స్వామివారికి అమృతస్నానం, నైవేద్యం తదితర పూజా కార్యక్రమాల అనంతరం జాతర ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆత్మగౌరవాన్నిదెబ్బతీస్తే సహించం నారాయణపేట: మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కర్రెప్ప అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి మాదిగ ఉద్యమం మీద, నాయకత్వం మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా మాదిగలను అస్తిత్వం లేకుండా చేయాలని కుట్రపూరితంగా రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వటం లేదని ఆరోపించారు. కచ్చితంగా భవిష్యత్తులో మాదిగలకు సముచిత స్థానం ఉందని రేవంత్రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, భవిష్యత్ లో న్యాయం అంటే ప్రస్తుతం న్యాయం జరగలేదని గుర్తించాలన్నారు. అంతే కాకుండా మాదిగలకు చిన్నా చితక నామినేటెడ్ పదవులలో అవకాశం ఇచ్చి అవే పెద్ద పదవులు అని మరోసారి కించపరిచే విధంగా మాట్లాడిన తీరును తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు ఆనంద్, వెంకటేష్, తిరుపతి, కృష్ణ, మహేష్ ఉన్నారు. అలరించినవసంత కవితోత్సవం స్టేషన్ మహబూబ్నగర్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్ స్కౌట్స్, గైడ్స్ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్గౌడ్, గుముడాల చక్రవర్తి గౌడ్, జగపతిరావు, వెంకటేశ్వర్రావు, కమలేకర్ శ్యాంప్రసాద్రావు, అనురాధ, జమున కవితలు వినిపించారు. -
నేటినుంచి నామినేషన్ల పర్వం
పాలమూరు/మహబూబ్నగర్ న్యూటౌన్/జడ్చర్ల: పార్లమెంట్ ఎన్నికల పర్వంలో మొదటి అంకం నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలు కానుంది. 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రాల్లో ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ చాంబర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణీత వేళల్లో పోటీదారుల నుంచి నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లను స్వీకరించనున్నారు. సెలవు దినమైన ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు వేయాలని, నామినేషన్ల దాఖలు రోజు జన సమీకరణ, ర్యాలీలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం రాకకు జడ్చర్లలో ఏర్పాట్లు మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జడ్చర్లకు హెలీకాప్టర్లో వస్తారని అధికారులు తెలిపారు. సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో హెలీప్యాడ్ను పరిశీలించారు. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం వంశీచంద్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అరుణ నామినేషన్కు హాజరుకానున్న లక్ష్మణ్ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ గురువారం ఉదయం 11.15గంటలకు మహబూబ్నగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 8గంటలకు కాటన్ మిల్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణ గార్డెన్కు చేరుకుని అక్కడి నుంచి క్లాక్టవర్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత క్లాక్టవర్లో నిర్వహించే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ బీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. పకడ్బందీగా చేపడతాం: కలెక్టర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆయా జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదులిస్తూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులతో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈపాటికే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త బలం చూసుకుంటున్న అభ్యర్థులు తొలి రోజే నామినేషన్ దాఖలు చేయనున్న డీకే అరుణ రేపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ కూడా.. హాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డి 25 వరకు గడువు, 26న పరిశీలన.. 29న ఉపసంహరణకు అవకాశం -
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 130 రోజులైనా రూ.రెండు లక్షల రైతు రుణాన్ని ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. తమ హయాంలో పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో పంటలు చేతికి అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నందుకు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థులు స్థానికేతరులని, స్థానికంగా ఉండే మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
పల్లెల్లో దళారుల దందా!
మరికల్: ధాన్యం నాణ్యతగా లేదని.. సరిగ్గా ఎండబెట్టలేదని.. వర్షాలు పడితే ధాన్యం మరింత తడిసి నష్టం వాటిళ్లుతుందంటూ.. భయపెట్టడంతోపాటు తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు కొందరు దళారులు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను లైసెన్స్ లేని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుట్టుగా పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలించేస్తున్నారు. ఎక్కువ ధరకు అక్కడి మిల్లర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో యాసంగి వరి పంటలు కోతకు రావడంతో మార్కెట్ శాఖ నుంచి లైసెన్స్లు లేని వ్యాపారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. అప్పుడే కోత వేసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా తూకాల్లో మోసం చేస్తు కర్ణాటక మిల్లర్లకు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ధరలు తగ్గించి.. ఉగాది పండుగకు ముందు యాసంగి కోతలు ప్రారంభం కాగానే వ్యాపారులు కర్ణాటక రాష్ట్రం సిందనూర్, మాన్వి, గంగవతి, రాయచూర్ మిల్లర్ల నుంచి లారీలను రప్పించి క్వింటా ధాన్యం రూ.2,230 నుంచి రూ.2500 వరకు రైతుల వద్ద కొనుగోలు చేశారు. ఉగాది తర్వాత రంజాన్ పండుగ రావడంతో వరుసగా వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ సమయంలో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. టెండర్ ధరలు తెలియకపోవడంతో మిల్లర్లు, దళారీ వ్యాపారులు కలిసి ధాన్యంలో నాణ్యత లేదని వంకాలు చెప్పి ఏకంగా క్వింటాపై రూ. 400 తగ్గించారు. లేదంటే ధాన్యం ఆరబెట్టి అమ్మితే క్వింటా రూ.2,550కి కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఆకాల వర్షాలకు భయపడ్డిన రైతులు తక్కువగా ధరకే విక్రయించి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. దళారీల దందా.. మరికల్ మండలం తీలేర్, వనపర్తి జిల్లా ఆత్మకూర్కు చెందిన దళారులు వరిధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. వీరు గత పదేళ్ల నుంచి ఽవానాకాలం, యాసంగిలో జిల్లా వ్యాప్తంగా పలు మండల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. కోత వేసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు ఈ వ్యాపారులకు ఫోన్ చేయగానే క్షణాల్లో అక్కడికి వాలిపోతారు. ధాన్యాన్ని పరిశీలించి వారు కోత వేసిన పంటలో తేమ, తాలు, బెర్కు ఉందన్ని ఇలా లేనిపొని పేర్లు పెట్టి మార్కెట్ కంటే తక్కువ ధరకు భేరం అడతారు. లేదంటే ఈ ధాన్యాన్ని ఎవరూ కొను గోలు చేయరని, వెళ్లిపోతామని రైతులను భయపెట్టిస్తారు. మొత్తంగా క్వింటా రూ.2100 చొప్పున కొనుగోలు చేసి కర్ణాటక మిల్లర్లకు తరలిస్తున్నారు. అక్కడ క్వింటా రూ.3000 చొప్పున వ్యాపారులకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పలుమార్లు ఇంటికి తిప్పించుకొని రూ.100కి రూ.2 చొప్పున కమీషన్ గానీ బ్యాగు పేరిట కిలో, తాలు పేరిట కిలో కట్ చేసి మిగితా డబ్బులను నెల రోజుల తర్వాత రైతుల చేతిలో పెడుతున్నారు. మార్కెట్ శాఖ అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న నకిలీ వ్యాపారులపై వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ఒకే ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరికల్లో లారీలోకి ధాన్యం ఎక్కిస్తున్నఓ దళారీకి చెందిన కూలీలు ఆదాయమంతాకర్ణాటక రాష్ట్రానికే.. జిల్లాలో యాసంగి సాగులో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం పక్షం రోజుల కిందట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేంద్రాలకు రైతులు ధాన్యం తేవడానికి సముఖంగా లేరు. ఇప్పటికే కర్ణాటకలో వరి ధాన్యానికి క్వింటాకు రూ.2,800 నుంచి రూ.3 వేల మధ్య పలకడంతో అక్కడి మిల్లర్లు ఇక్కడి దళారీ వ్యాపారులను రంగంలోకి దింపారు. వారికి నేరుగా లారీలను పంపించి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన వ్యవసాయ మార్కెట్లకు రావాల్సిన కమీషన్ ఆదాయం కర్ణాటక వ్యవసాయ మార్కెట్లకు, మిల్లర్లకు చేరుతుంది. 95వేల ఎకరాల్లో వరిసాగు జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 95,926 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 96 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ రైతులకు అకాల వర్షాల భయం పట్టుకోవడంతో ధాన్యం ఆరబెట్టెందుకు భయపడి వారు దళారులను సంప్రందిస్తున్నారు. వారు చెప్పిన ధరకే ధాన్యం అమ్ముకోవడంతో తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు వరి ధాన్యం కొనుగోలు కర్ణాటకకు తరలించి.. అధిక ధరకు విక్రయం చక్రం తిప్పుతున్న తీలేర్, ఆత్మకూర్ వ్యాపారులు ఉగాది వరకు క్వింటా రూ.2500పలికిన ధర ఒక్కసారిగా రూ.400 తగ్గడంతో రైతుల అయోమయం చర్యలు తీసుకుంటాం వ్యవసాయ మార్కెట్ అనుమతి లేకుండా, రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేసిన లైసెన్స్ లేని వ్యాపారులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ధాన్యం పక్క రాష్ట్రానికి తరలించకుండా కర్ణాటక సరిహద్దు వద్ద గట్టి నిఘా ఏర్పాటుచేస్తాం. – దేవాదాసు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
వాతావరణం
ఉదయం నుంచిఎండ తీవ్రత ఉంటుంది. అప్పుడప్పుడు వడగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. మెరిసిన ఆత్మకూర్ ఆణిముత్యం సివిల్స్లో 278 ర్యాంకుసాధించిన ఎహ్తేదా ముఫస్సీర్ ఆత్మకూర్: యూపీఎస్సీ ఫలితాల్లో ఆత్మకూర్కు చెందిన ఎహ్తేదా ముఫస్సీర్ ప్రతిభచాటింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆలిండియా 278 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికై ంది. ఆత్మకూర్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు సయ్యద్ఖాసిం కుమారుడు ఇబ్రహిం ఖలీల్కు ఇద్దరు కుమార్తెలు రుఫియా, ఎహ్తేదా ముఫస్సీర్, కుమారుడు సయ్యద్ తఫస్సూల్ ఉన్నారు. రెండో కుమార్తె ఎహ్తేదా ముఫస్సీర్ పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని ఆకృతి పాఠశాలలో చదివి 2014లో 10/10 గ్రేడ్ను సాధించిన ఆమె.. ఇంటర్ బైపీసీ సిరి కళాశాలలో పూర్తి చేసి 987 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. అనంతరం ఢిల్లీలోని లేడి శ్రీరాం కళాశాలలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ విద్యను 2020లో పూర్తి చేసింది. తర్వాత సోదరి రుఫియాతో కలిసి ఎహ్తేదా ముఫస్సీర్ ఇంట్లోనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యి.. 2023లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు హాజరైంది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 278 ర్యాంకు సాధించగా.. ఆమె సోదరి రుఫియా ఫలితాల్లో స్వల్ప తేడాతో వెనకబడిపోయింది. ఎహ్తేదా అత్యుతమ ర్యాంకు సాధించడంతో ఆత్మకూర్లో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తాతయ్యే స్ఫూర్తి.. ‘మా తాతయ్య సయ్యద్ఖాసీం రిటైర్డు ఉపాధ్యాయుడు. తాను, తన కుమారులు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నామని.. మీరు ఇంకా గొప్పస్థాయిలో కలెక్టర్ కావాలని తరచుగా చెప్పేవారు.’ అని ఎహ్తేదా చెప్పారు. దీంతో పదో తరగతి నుంచే గట్టిగా నిర్ణయించుకొని సివిల్స్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. 278 ర్యాంకు రావడంతో మా తాతయ్య కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలబడలన్నదే తన లక్ష్యం అని వివరించారు. -
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే..
నారాయణపేట: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందంతో ఒక్కటైనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో నారాయణపేట పట్టణ, మండల, ఊట్కూర్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ను బీజేపీకి తాకట్టుపెట్టారని సీఎం రేవంత్రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని.. నారాయణపేటలో కాంగ్రెస్పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్థికి ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి తెరవెనుక మద్దతు తెలిపిన విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. పాలమూరులో సైతం కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు తెలిపినందుకే ఈరోజు వారిని పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జనమంతా మళ్లీ కేసీఆర్ వైపే చూస్తున్నారన్నారు. నేను పక్కా లోకల్.. బీజేపీ, కాంగ్రెస్పార్టీల అభ్యర్థులిద్దరూ స్థానికేతరులని.. తాను మాత్రం స్థానిక అభ్యర్థినని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిపించారని.. ఇప్పుడు కూడా మరో అవకాశం ఇచ్చారని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని.. అదేవిధంగా ఎంపీగా మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. డీకే అరుణను ఓడిస్తా.. చిట్టెం నర్సిరెడ్డి కుమార్తెనంటూ చెప్పుకొంటున్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణను ఓడించి తీరుతామని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు టీడీపీ నుంచి ఇదే పాలమూరు ఎంపీ టికెట్ ఇస్తే తన తండ్రి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారని, ఇప్పుడు సైతం అదే జరుగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్య యాదవ్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, ఊట్కూర్ జెడ్పీటీసీ అశోక్గౌడ్, పేట మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, జిల్లా, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ -
నీటిఎద్దడి తలెత్తకుండా చూడాలి
మక్తల్: వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పారేవుల వద్ద ఉన్న ఇంటెక్వెల్ను పరిశీలించారు. అదనపు మోటార్లు ఏర్పాటుచేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని మిషన్ భగీరథ ఈఈ వెంకట్రెడ్డిని ఆదేశించారు. అనంతరం పంపింగ్ కేంద్రం, హెడ్వర్క్స్, 10 ఎంఎల్డీ ఫిల్టర్బెడ్లను పరిశీలించారు. నిత్యం ఎన్ని ఎంఏఎల్డీ నీరు పంపింగ్ అవుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం చిట్యాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. కూలీల పేర్లను మస్టర్లలో నమోదు చేయాలన్నారు. మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీచేసి ప్రసవాల సంఖ్య పెంచాలని కోరారు. కొత్తగా వచ్చిన స్టాఫ్నర్సుల్లో అయిదుగురిని జిల్లా ఆస్పత్రికి పంపించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, శిక్షణ కలెక్టర్ గరిమా, మిషన్ భగీరథ అధికారులు తదితరులు ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
సొంత ప్రిపరేషన్
సివిల్స్కు సిద్ధమయ్యే క్ర మంలో అనన్యరెడ్డి సొంత ప్రిపరేషన్పైనే ఎక్కు వగా దృష్టిపెట్టారు. ప్రతి రోజు 12 గంటల నుంచి 14 గంటలపాటు చదువుకునేవారు. సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోట్గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరు కుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్ను పూర్తిచేసే విధంగా ఆమె ప్రిపరేషన్ కొనసాగించారు. సివిల్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు. -
మెకానికల్ ఇంజినీర్కు 627వ ర్యాంక్
వెల్దండ: సివిల్స్ ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి ఉమ్మడి పంచాయతీ పోషమ్మగడ్డతండాకు వడ్తావత్ యశ్వంత్నాయక్ జాతీయ స్థాయిలో 627వ ర్యాంకుతో సత్తాచాటారు. తండాకు చెందిన ఉమాపతి, పద్మ దంపతుల మొదటి కుమారుడు యశ్వంత్. ఇతను ఇంటర్మీడియట్ నారాయణ కళాశాలలో, ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజినీయక్ పూర్తిచేశారు. తర్వాత సివిల్స్ సాధించడమే లక్ష్యంగా చదివి.. రెండోసారి ప్రయత్నంలో మెరుగైన ర్యాంకు సాధించాడు. తమ కుమారుడు సివిల్స్ సాధించడంతో తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థి సివిల్స్లో ర్యాంక్ సాధించడంతో తండావాసులు, బంధువులు అభినందించారు. -
నేడు శ్రీరామనవమివేడుకలు
● ముస్తాబైన ఆలయాలు నారాయణపేట రూరల్: శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. 69 చోట్ల సీతారాముల కల్యాణం, రథోత్సవాలు, శోభాయాత్రలు, పల్లకీసేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత ఆలయాల కమిటీ సభ్యులు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయాలు రంగురంగుల విద్యుద్ధీపాలు, మామిడి తోరణాలు, పూలతో కళకళలాడుతున్నాయి. జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణ్వాడి రామాలయం, మూలహనుమాన్, సాయిహనుమాన్, గొడుగుగేరి హనుమాన్, మెట్టుగడ్డ హనుమాన్ ఆలయాలతో పాటు జాజాపూర్ జట్టి హనుమాన్, అప్పిరెడ్డిపల్లి రాందేవునిగుట్ట, తిర్మలాపూర్ తిరుమలనాథస్వామి ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కల్యాణం, అనంతరం భక్తులకు అన్నదానం, సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ● వేడుకలు శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని ఎస్పీ యోగేష్గౌతమ్ కోరారు. మంగళవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పూర్తిస్థాయి బందోబస్తు కల్పించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. వరి పంట కోత ప్రయోగం ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్లో రైతు ఖాజామియా సాగు చేసిన వరి పంటను జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి జీవరత్నం, మండల గణాంక అధికారి చేతన్ బుధవారం సందర్శించి పంట దిగుబడి అంచన వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంటలో ఐదు మీటర్ల పొడవు, ఐదు మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో పంట కోత ప్రయోగం చేయగా 14.990 కిలోల దిగుబడి వచ్చిందని వివరించారు. విత్తన సేకరణ, సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, వాటికి అయిన ఖర్చులను రైతును అడిగి తెలుసుకున్నారు. రైతులు రాఘవేందర్గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
No Headline
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ అడ్డాకుల: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తాచాటింది. సివిల్స్– 2023 ఫలితాల్లో జిల్లాకేంద్రానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సివిల్స్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోనే గడిచింది. ఆమె ఐఏఎస్ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచే.. అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్నగర్లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్తో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ప్రారంభం నుంచి ఐఏఎస్ వైపు అడుగులు పడ్డాయి. దీంతో ఆమెను హైదరాబాద్లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేర్చారు. ఇంటర్ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్ కళాశాలలో ఏబీ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)లో చేరారు. డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్లైన్లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్తో ముందుకు సాగారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యాయని చెప్పారు. -
గర్వకారణం..
మా కుటుంబానికి చెంది న దోనూరు అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉంది. ఆమె తండ్రి సురేష్రెడ్డి తన ఇద్దరు కుమార్తెల చదువుల కోసం గ్రా మాన్ని వదిలి మహబూబ్నగర్లో స్థిరపడ్డా రు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన అనన్యరెడ్డికి శుభాకాంక్షలు. – దోనూరు నాగార్జున్రెడ్డి, ఎంపీపీ, పొన్నకల్ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు యూపీఎస్సీ ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి జా తీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి పొన్నకల్కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. చదువులో రాణించి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పట్టుదలతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చని నిరూపించింది. – దోనూరు విజయకుమార్రెడ్డి, పొన్నకల్ -
రూ.86,400 నగదు సీజ్
కృష్ణా: మండలంలోని రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా చెక్పోస్టులో మంగళవారం ఎస్ఐ ఎండీ నవీద్, కేంద్ర సాయుధ బలగాలు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.86,400ల నగదు లభించడంతో ఆ నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఉట్కూర్కు వెళ్తున్న కురువ అంజప్ప ఎలాంటి అనుమతులు లేకుండా నగదును తీసుకెళ్తుండగా.. తాము స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదును తీసుకెళ్తే, వాటికి సంబంధించి ఆధారాలు లేకుంటే సీజ్ చేస్తామని చెప్పారు. అనంతరం ఆ నగదును నారాయణపేట్ గ్రీవెన్స్ కమిటీకి పంపించినట్లు వివరించారు. బాలానగర్లో రూ. 59 వేలు.. బాలానగర్: మండల కేంద్రంలోని చెక్పోస్టు వద్ద మంగళవారం రూ.59 వేలుపట్టుకున్నట్లు ఎస్ఐ తిరుప్పాజీ తెలిపారు. కర్నూలుజిల్లా దేవరకొండ మండలం బేతపల్లికి చెందిన లక్ష్మయ్య ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
ఓటమి భయంతోనే దిగజారుడు మాటలు
నారాయణపేట: జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన కాంగ్రెస్పార్టీ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మిగిలిన నేతల ప్రసంగాల్లో పసలేకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ ఓడిపోతుందనే భయం వారిలో కనిపించిందని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగూరావు నామాజీ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ను మించి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. కృష్ణా–వికారాబాద్ రైల్వేలైన్ను తానే తీసుకొచ్చానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. పార్టీ మారి పక్కనే కూర్చున్న మాజీ ఎంపీ జితేందర్రెడ్డిని అడిగితే చెప్పేవారన్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే గత ప్రభుత్వం భూమి కేటాయించకపోవడంతో వెనక్కి వెళ్లిందని తెలిపారు. జీఓనంబర్ 69కి శంకుస్థాపన చేశామని.. త్వరలో జిల్లాను సస్యశ్యామలం చేస్తామంటున్న సీఎం ఈ ఎత్తిపోతలకు కేంద్రం కేటాయించే 90 శాతం నిధులు తీసుకోకుండా పనులు చేపడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమం కోసం కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణను దొరసాని అని సంభోదించడం కాంగ్రెస్పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి తగదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే ముందు ఏ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇస్తుందన్న కనీస పరిజ్ఞానం లేకపోవడం, తెలివి లేని తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వరద జలాలతో నిర్మించే ఏ ప్రాజెక్టుకు కూడా కేంద్రం జాతీయ హోదా ఇవ్వదని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీశ్యాంసుందర్, పట్టణ అధ్యక్షురాలు నర్సమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య, ప్రధానకార్యదర్శి అప్పిరెడ్డిపల్లి రాము, దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్లు ప్రమీల, అనూష, జయశ్రీ, బీజేవైఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నేతనాగూరావు నామాజీ -
జల సంరక్షణలో భాగస్వాములవుదాం
కోస్గి: నీటిని వృధా చేయకుండా అవసరమైనంత వరకు వినియోగించుకుంటూ జల సంరక్షణలో అందరం భాగస్వాములవుదామని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మండల సర్వ సభ్య సమావేశానికి హాజరైన ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి జల సంరక్షణపై అధికారులు, ప్రజాప్రతినిధులకు జల సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి లభ్యత, ప్రాముఖ్యత, సంరక్షణ విధానం, నీటి విలువను తెలుసుకొని తమ కుటుంబ సభ్యులకు, చుట్టు పక్కల వారికి వివరించాలన్నారు. నీటి సంరక్షణపై అవగాహన లేకపోవడంతో చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదురుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా వాక్ ఫర్ వాటర్ స్వచ్చంద సంస్థ వాలంటర్ వీరు మల్లేష్ ప్రతిరోజు వాడే నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, భూగర్భ జలం పెంపొందించే విధానం, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతతోపాటు పలు అంశాలను వివరించారు. ఇదే క్రమంలో పట్టణంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో సైతం విద్యార్థులకు అవగాహన కల్పించి నీటి భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీపీ మదుకర్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మోసం చేయడమే అసలు గ్యారెంటీ
నారాయణపేట రూరల్: సంక్షేమ పథకాలు అందించడం కాకుండా ప్రజలను మోసం చేయడమే రేవంత్ సర్కార్ ఇచ్చిన అసలు గ్యారెంటీ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నారాయణపేట మండలంలోని సింగారం, జలాల్పూర్ గ్రామాల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఆయన హయాంలోనే దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు కలిసి రావాలని కోరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మోదికి ఎవరు సాటిరారని, ఎంపీగా తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. పలువురు వివిద పార్టీల నాయకులు బీజేపీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కమలంలోనే రతంగపాండురెడ్డి.. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొత్తకాపు రతంగపాండురెడ్డి తిరిగి కమలంలోనే కొనసాగనున్నారు. పట్టువీడిన ఆయన సోమవారం డీకే అరుణతో కలిసి తన సొంత గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సాయిబన్న, గణపశ్రీనివాస్, నాగిరెడ్డి, నారాయణరెడ్డి, అశోక్, హన్మంతు, చంద్రప్ప, నర్సింహా, ఎల్లప్ప, భరత్, లక్ష్మప్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను విస్మరించిన కాంగ్రెస్
కోస్గి: రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేసిన కేసీఆర్ అన్నివర్గాల ప్రజల కోసం పథకాలు అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పాలనలో పూర్తిగా విఫలమైందని, చివరకు ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న బాలింతలకు ఇచ్చే కేసీఆర్ కిట్లు బంద్ అయ్యి తిట్లు చాలయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం కోస్గిలో ఏర్పాటు చేసిన కొడంగల్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ రూ.90 వేల కోట్లతో సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి కావాల్సినన్ని ట్రాన్స్ఫార్మర్లతో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వ్యవసాయ రంగం అతలాకుతలమైందన్నారు. రైతులకు రూ.15 వేల రైతు భరోసా, 24 గంటల విద్యుత్, వరికి అదనపు బోనస్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులతోపాటు తులం బంగారు పేరుతో ఆడబిడ్డలు, స్కూటీల పేరుతో చదువుకున్న యువత, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులు, నాలుగు డీఏలు అంటూ ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 హామీలను అమలు చేయాలన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఏ ఒక్క కార్యకర్త భయపడవద్దని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అవకాశం ఇవ్వండి.. గతంలో కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్లో తనవంతు పాత్ర పోషించానని, తనపై నమ్మకంతో కేసీఆర్ మరోమారు అవకాశం ఇచ్చారని, మీరందరు ఆశీర్వదించి రెండోసారి అవకాశం ఇస్తే అభివృద్ధికి కృషిచేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. స్థానికుడిగా ఉన్న తనకు పాలమూరు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, స్థానికేతరులకు అవకాశం ఇచ్చి మోసపోవద్దన్నారు. ఎందరు భయబ్రాంతులకు గురి చేసిన కేసీఆర్ను వదిలేది లేదని, ఇతర పార్టీల మాయమాటలు నమ్మకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ప్రజలు బాధపడుతున్నారు.. కేసీఆర్ పాలనలోనే అన్నివర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాయని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి పెద్ద తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్కు ఓటేసి ఆశీర్వదిస్తే ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు మరోమారు మోసపోకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతునిచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు నుంచి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలన్నారు. కేసీఆర్ కిట్లు బంద్ అయ్యి తిట్లు చాలయ్యాయి అక్రమ కేసులకు భయపడం.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు చివరి వరకు కేసీఆర్తోనే ఉంటా తన సోదరుడు పట్నం మహేందర్రెడ్డి పార్టీ మారాడని, తాను కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అయోమయ పరిస్థితి సృష్టిస్తున్నారని, తాను చివరి వరకు బీఆర్ఎస్ను వీడేది లేదని, కేసీఆర్తోనే ఉంటానని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారని హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లానని.. అవసరమైతే కొడంగల్లోనే ప్రత్యేకంగా ఓ లీగల్ సెల్ ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని అధిష్టానం భరోసా ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, స్పోర్ట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, నాయకులు మహిపాల్, బాల్సింగ్, సలీం, విజయ్కుమార్, రాజు, మోహన్రెడ్డి, జనార్దన్రెడ్డి, మధుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
జనజాతరకు సర్వం సిద్ధం
నారాయణపేట: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం 6 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు రానున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనజాతరకు నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ, ధన్వాడ, మరికల్, దామరగిద్ద, నారాయణపేట టౌన్, మండలాల నుంచి జనాన్ని భారీఎత్తున తరలించేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి ఏర్పాట్లు చేశారు. జనజాతరకు దాదాపు 50 వేల మందిని తరలించి సభను విజయవంతం చేసేందుకు సంకల్పించారు. సభకు సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి మహబూబ్నగర్లోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక, ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పర్యవేక్షించి ఏర్పాట్లు పరిశీలించారు. సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం జనజాతర సభకు ఉమ్మడి జిల్లా నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ యోగేష్ గౌతమ్ భద్రతాపరమైన సూచనలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో బందోబస్తు 12 సెక్టార్లుగా విభజించి పకడ్బందీగా భద్రత కల్పించాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు. పబ్లిక్ గ్యాలరీ, పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ సెక్టార్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీలు నాగేంద్రుడు, రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు లింగయ్య, మహేష్, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేడు ‘పేట’కు సీఎం రేవంత్రెడ్డి రాక భారీగా జనసమీకరణకు శ్రేణుల తలమునకలు 670 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పటిష్ట బందోబస్తు.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి జనజాతర బహిరంగ సభకు రానుండటంతో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీస్శాఖ 670 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పకడ్బందీగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 65 మంది ఎస్లు, 75 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు 415, మహిళా పోలీసులు 50, 2 రోప్ పార్టీలు, 2 టీఎస్ఎస్సీ ప్లాటున్స్, స్పెషల్ పార్టీ పోలీసులు, 2 ఐటీబీపీ ప్లాటూన్స్తో బందోబస్తు నిర్వహించనున్నారు. -
ఖజానా గలగల..
వివరాలు 8లో uపేట మార్కెట్యార్డుకు లక్ష్యానికి మించి ఆదాయం రూ.5.43 కోట్ల ఆదాయం ఈ ఏడాది రూ.3.60 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.5.43 కోట్లు ఆదాయం వచ్చింది. పేట మార్కెట్యార్డుకు ఏటేటా లక్ష్యానికి మించి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మార్కెట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. – భారతి, మార్కెట్ కార్యదర్శి, నారాయణపేట నారాయణపేట: జిల్లా కేంద్రంలోని నారాయణపేట వ్యవసాయ మార్కెట్యార్డులో జోరుగా క్రయ, విక్రయాలు కొనసాగడంతో ఆదాయం గతేడాదికంటే ఈ ఏడాది పెరిగింది. జిల్లాలో వ్యవసాయ రంగంలో రైతులు వానాకాలం, యాసంగిలో పంటలతో పురోగతి సాధిస్తున్నారని చెప్పవచ్చు. కోస్గి, మక్తల్ మార్కెట్ యార్డులలో క్రయవిక్రయాలు తక్కువగా ఉన్నప్పటికీ చెక్పోస్టులు, రైస్మిల్లులు, కాటన్ మిల్లుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మార్కెట్ యార్డుల్లో జరిగిన ధాన్యం క్రయవిక్రయాలతో వచ్చిన ఆదాయంతో ఖజనా గలగలలాడుతుంది. ఈఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపుతో లక్ష్యానికి మించి ఆదాయం పెరిగింది. పత్తి, వరి, కంది, వేరుశనగపైనే ఆదాయం.. జిల్లాలో వ్యవసాయమే జీవనాధారం. రైతులు ప్రధానంగా పత్తి, వరి, కంది వేరుశనగ పంటలపై అసక్తి చూపి పండించిన పంటలకు నారాయణపేట, మక్తల్, కోస్గిలో వ్యవసాయ మార్కెట్లలో విక్రయించారు. క్రిష్ణ నది పరివాహకంలో నీటి వనరులు ఉండడం, చెరువులు, బోరు బావుల కింద పంటలను పండించారు. లక్ష్యాన్ని మించి.. జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి మూడు మార్కెట్యార్డుల్లో లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం వచ్చింది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్, ఊట్కూర్ మండలాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని సమీప ప్రాంతాల నుంచి పంట ఉత్పత్తులతో వ్యాపార లావాదేవీలు జరగడంతో లక్ష్యానికి మించిన ఆదాయం సమకూరింది. ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పైనే మార్కెట్సెస్ అధికంగా రావడంతో పేట మార్కెట్కు ఏటేటా ఆదాయం పెరుగుతున్న ప్రస్తుతం ఉన్న గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి మారుతుందానే ఆశాభావం అధికార యంత్రాంగం భావిస్తుంది. చెక్పోస్టుల నుంచి ఆదాయం జిల్లాలోని నారాయణపేట గంజ్ దగ్గర, మరికల్లో హైదరాబాద్రోడ్లో, మక్తల్ మార్కెట్ పరిధిలోని క్రిష్ణ మండలం టైరోడ్ దగ్గర, కోస్గిలో ఒకటి చొప్పున చెక్పోస్టులు ఉన్నాయి. మార్కెట్ యార్డు పరిధిలోని చెక్పోస్టులతోనే మార్కెట్లకు అదనపు ఆదాయంతో ప్రతి ఏడాది రూ.లక్షల ఆదాయం వస్తుంది. జిల్లాకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో యాద్గీర్, క్రిష్ణ సరిహద్దులో శక్తినగర్ బార్డర్లో ఉన్నాయి. జిల్లా మీదుగా వెళ్లే ఈ వాహనాలు భారీగా మార్కెట్ సెస్ను వసూలు చేస్తున్నారు. జిల్లాలోని మక్తల్ మార్కెట్, కోస్గి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు తక్కువగానే జరుగుతాయి. జిల్లాలోని 24 రైస్మిల్లులు, 6 కాటన్మిల్లులు, 1 దాల్మిల్, 37 మంది ఖరీదుదారులు, 55 మంది కమిషన్ ఏజెంట్లు నిర్వహించే క్రయ విక్రయాలతో మార్కెట్లకు ఆదాయం వస్తుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వేరుశనగ, పత్తి, వరి, కందిపైనే మార్కెట్సెస్ మక్తల్, కోస్గి మార్కెట్లకు చెక్పోస్టుల నుంచే అధికం.. -
‘కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు’
భూత్పూర్: ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరు చెబుతోందని, వాటిని నమ్మి మోసపోవద్దని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, అధైర్యపడకుండా ఉండాలని వారు సూచించారు. ఆదివారం భూతూ్ప్ర్లో నిర్వహించిన సమావేశంలో వారితోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు వంద రోజులకే కాంగ్రెస్ పాలనపై విసుగు చెందారని, మళ్లీ బీఆర్ఎస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాలం గడుపుతారే తప్ప అమలు చేయడం వారి వల్ల కాదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడుల్లా రాముడి పేరుతో రాజకీయం చేస్తుందని, రాముడు వారికే కాదు మనందరికీ రాముడే అని, దేవుడి పేరుతో రాజకీయం చేయడం తగదన్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఎంపీగా మళ్లీ గెలిపించడానికి కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన ఏంటోనని ప్రజలకు అర్థమైందని, నాలుగు నెలల్లో తెలంగాణలో కరువుఛాయలు అలుముకున్నాయని విమర్శించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, మహ్మద్ సాధిక్, సరోజ్రెడ్డి, ఖాజ, రామురాథోడ్, మాధవరెడ్డి, యాదిరెడ్డి, యాద య్య, వెంకట్రాములు, జాకీర్ పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డులకు ఐదేళ్లలో వచ్చిన ఆదాయం (రూ.కోట్లలో)
ఏడాది నారాయణపేట కోస్గి మక్తల్ లక్ష్యం ఆదాయం లక్ష్యం ఆదాయం లక్ష్యం ఆదాయం 2018–19 1.40 0.98 0.97 0.30 1.80 1.04 19–20 1.05 1.23 0.33 0.87 1.30 0.89 20–21 1.15 1.97 0.75 0.68 ––– 1.01 21–22 2.28 3.59 0.30 0.19 1.45 1.28 22–23 3.00 4.30 1.30 1.55 2.08 3.15 23–24 3.60 5.43 1.22 1.61 2.81 4.38 -
అమరుల ఆశయాల కోసం పనిచేస్తేనే నిజమైన నివాళి
వీపనగండ్ల: సీపీఎం సిద్ధాంతాల కోసం అహర్నిశలు పనిచేసి, పేదల కష్టాల్లో పాలుపంచుకున్న నాయకులు మరణిస్తే, వారి ఆశయాల కోసం పనిచేసినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ అన్నారు. ఆదివారం బొల్లారంలో సీపీఎం నాయకులు రాములు ఇటీవల మృతిచెందగా.. ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాములు విద్యార్థి ఉద్యమంతో పాటు ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారన్నారు. కులతత్వ నిర్మూలన కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యపరిచిన మహామనిషి అని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంతో పేద ప్రజలకు అండగా నిలిచినవారం అవుతామన్నారు. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. హిందూ ముస్లింల మధ్య తగాదాలు సృష్టించి ఓట్లు రాబట్టాలని చూస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణజ్యోతి, జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, నాగిరెడ్డి, భాస్కర్రెడ్డి, పుట్ట ఆంజనేయులు, లక్ష్మి, మేకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Pagination
test article noti
this is test t2
this is test t1
test article1
test article not
test article t3
test article t2
test article t1
Video notification check
Body Photo Second notification check
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement