Sakshi News home page

సెల్ఫీ పాయింట్‌

Published Sat, Apr 20 2024 1:25 AM

- - Sakshi

ఓటుహక్కు ప్రాధాన్యం చైతన్యం కల్పించడంలో భాగంగా వరంగల్‌ కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశారు. వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.ప్రావీణ్య, అధికారులతో కలిసి సెల్ఫీ దిగి ప్రారంభించారు. పబ్లిక్‌గార్డెన్‌, వరంగల్‌ రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి యువకులను ఆకర్షించి ఓటు నమోదు శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ శ్రీనివాస్‌, జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి భాగ్యలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

– కాళోజీ సెంటర్‌

Advertisement

homepage_300x250