Sakshi News home page

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

Published Tue, May 7 2024 6:10 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

తొర్రూరు రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండలంలోని మడూరు, వెలికట్ట, చింతలపల్లి, గుర్తూ రు, కంఠాయపాలెం, ఫత్తేపురం, మాటేడు, చెర్లపాలెం, చీకటాయపాలెం, అరిపిరాల, వెంకటాపురం గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలు, విష ప్రచారాన్ని ప్రజలు నమ్మి తీవ్రంగా మోసపోయారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా... ఒక్క హమీ అమలు చేయలేదన్నా రు. ఇలాంటి ప్రభుత్వానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్‌, పార్టీ మండల అధ్యక్షులు సీతారాములు, మండల అభివృద్ధి కమిటీ చైర్మ న్‌ సోమేశ్వర్‌రావు, నాయకులు ప్రమోద్‌గౌడ్‌, కుర్ర శ్రీనివాస్‌, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, ఆయా గ్రామా ల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250