Sakshi News home page

కేసీఆర్‌ రోడ్‌ షో విజయవంతం

Published Tue, May 7 2024 6:10 AM

కేసీఆర్‌ రోడ్‌ షో విజయవంతం

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌ షో విజయవంతమైందని, తన గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత ధీమా వ్యక్తం చేశారు. మానుకోటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, కేసీఆర్‌ను కావాలనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఈసీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ క్రేజ్‌ తగ్గదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మకై బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయని, ప్రజలు ఆ పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మానుకోటపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. మానుకోటలో మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌ షోకు అశించిన దాని కంటే ఎక్కువ మంది జనాలు వచ్చారన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెంకన్న, నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్‌ రెడ్డి, కెఎస్‌ఎన్‌ రెడ్డి, ముత్యం వెంకన్న, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు,

ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత

Advertisement

homepage_300x250