Sakshi News home page

నిత్యం అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Apr 23 2024 8:40 AM

చెక్‌పోస్టులను పరిశీలిస్తున్న అనంతపురం 
రేంజ్‌ డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి  - Sakshi

అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న విడపనకల్లు, ఓబుళాపురం అంతరాష్ట్ర చెక్‌ పోస్టులను డీఐజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో డీఐజీ స్వయంగా పాల్గొన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు, లగేజీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి వేళ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో కలెక్టరేట్‌తో పాటు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును స్వయంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250