అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. నాల్గో రోజు సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు 34 నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఆరు సెట్ల నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 28 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.వినోద్కుమార్ వద్ద అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకరనారాయణ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, నాయకులు వెన్నపూస రవీంద్రారెడ్డి, రాజారామ్, పెన్నోబులేసు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా.. రెండో సెట్ను వైఎస్సార్సీపీ నాయకుడు పామిడి వీరాంజినేయులు దాఖలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా జి.లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాలగుండ్ల రవీంద్ర, జాతీయ చేనేత వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా ఉమ్మడిశెట్టి చిన్న వెంకట సుబ్బయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా జి.వి.రమణారెడ్డి, వడ్ల కేశవయ్య నామినేషన్లు దాఖలు చేశారు.
breaking news
Breadcrumb
- HOME
adsolute video ad after first para
adsolute_video_ad
Related news
-
మండుటెండలోనూ పోటెత్తారు..
ఉరవకొండ: పట్టణంలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా గ్రామాల నుంచి తరలివచ్చి విశ్వకు మద్దతు తెలిపారు. మహిళలు సైతం వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. డీజేలు, డ్రమ్స్, వాయిద్యాలు, తప్పెట్లు, బాణాసంచా పేలుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా కూడేరు సంగమేశ్వరస్వామి ఆలయం, పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి విశ్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను తన కుమారుడు, పార్టీ యువనేత ప్రణయ్రెడ్డి, నాయకులు ఏసీ ఎర్రిస్వామి, మూలగిరిపల్లి ఓబన్న, ఎంసీ నాగభూషణంతో కలిసి ఆర్ఓ కేతన్గార్గ్కు అందించారు. ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ఉప్పొంగిన ఉత్సాహంతో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కవితాహోటల్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఉరవకొండ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, నిండు మనసుతో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్, యాదవ, రజక కార్పొరేషన్ల చైర్మన్లు హరీష్యాదవ్, మీసాల రంగన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరన్న, ఆర్టీసీ రీజి నల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ‘విశ్వ’ నామినేషన్ భారీగా తరలివచ్చిన నాయకులు -
పదిలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ
అనంతపురం రూరల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో 1,172 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వీరిలో 964 మంది ఉత్తీర్ణత సాదించారు. 37 బీసీ వసతి గృహాల్లో 560 మందికి గాను 448 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. వీరిలో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని 360 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 321 మంది ఉత్తీర్ణత సాదించారు. వీరిలో 11 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 3 ఎస్టీ వసతి గృహాలు, 6 గురుకుల పాఠశాలల్లోని 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 195 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అత్యధికంగా గుత్తి ఎస్సీ బాలుర వసతి గృహం–1 విద్యార్థి డి.ఆసీఫ్ 570 మార్కులు, రాయదుర్గంలోని బీసీ (బాలికల) హాస్టల్ విద్యార్థిని అభిల 560 మార్కులు, గొల్లలదొడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థి గురుచరణ్ నాయక్ 533 మార్కులు సాధించారు. -
నిత్యం అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న విడపనకల్లు, ఓబుళాపురం అంతరాష్ట్ర చెక్ పోస్టులను డీఐజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో డీఐజీ స్వయంగా పాల్గొన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు, లగేజీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి వేళ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో కలెక్టరేట్తో పాటు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును స్వయంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. -
అప్పట్లో అభ్యర్థికో బ్యాలెట్ బాక్స్
పుట్టపర్తి టౌన్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో నేడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. 1952, 1957 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరికి ఓ బ్యాలెట్ బాక్స్ను ఏర్పాటు చేసేవారు. ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేస్తే వారికి కేటాయించిన పెట్టెలోనే బ్యాలెట్ పేపర్ వేయాల్సి ఉండేది. సంస్కరణల్లో భాగంగా 1962లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ బూత్కు ఓ బ్యాలెట్ బాక్స్ ఏర్పాట చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం ఆరంభం కావడంతో ఓటింగ్ ప్రక్రియలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. 25న చింత, వేరుశనగ చెక్క వేలం బుక్కరాయసముద్రం: ఈ నెల 25న బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్ జైలులో చింతపండు పంటకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ జైలు సూపరింటెండెంట్ చిన్నారావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలంలో పాల్గొనే వారు రూ.3వేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. వేలం ముగిసిన తర్వాత ధరావత్తును వెనక్కు చెల్లిస్తారు. అలాగే 25వ తేదీ జిల్లా జైలు ఆవరణలో 20 వేల కిలోల వేరుశనగ చెక్కకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ జైలు సూపరింటెండెంట్ రహమాన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం పాటలో పాల్గొనేవారు రూ.17,600 చెల్లించాల్సి ఉంటుంది. వేలం పాట ముగిసిన తర్వాత డిపాజిట్ సొమ్ము వెనక్కు చెల్లిస్తారు. సెల్ఫోన్ ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య బ్రహ్మసముద్రం : సెల్ఫోన్ చేతికి ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం ఎస్.కోనాపురం గ్రామానికి చెందిన రుద్రప్ప కుమార్తె రూప (16) తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో స్కూల్ మానేసింది. ఈ క్రమంలోనే ఇంటి పట్టునే ఉంటూ పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ వచ్చింది. ఇటీవల సెల్ఫోన్కు ఎక్కువగా అలవాటు పడడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు మందలించారు. రెండు రోజులుగా ఆమె చేతికి సెల్ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె క్షణికావేశంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలానికి వెళ్లిన ఆలస్యంగా ఇంటికి చేరుకున్న తండ్రి... ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ పరుశురాముడు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. డబ్బు, మద్యం పంచినా.. ప్చ్ ● ‘గుమ్మనూరు’ నామినేషన్ కార్యక్రమానికి జనం కరువు ● అసహనంతో పోలీసులపై గుమ్మనూరు ఈశ్వర్ జులుం గుంతకల్లు: విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచినా గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్ నామినేషన్ కార్యక్రమానికి జనం కరువయ్యారు. సోమవారం నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడ్డారు. విచ్చలవిడిగా డబ్బు, కేసుల కొద్దీ మద్యం, పదుల సంఖ్యలో వాహనాలు సమకూర్చినా ఫలితం కానరాలేదు. వచ్చిన కొద్ది మంది కూడా ఆలూరు నియోజకవర్గ వాసులే. గుంతకల్లు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఆసక్తి కనబరచకపోవడంతో తన సొంత నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జనాన్ని తీసుకొచ్చారు. ఇక.. నామినేషన్ సందర్భంగా గుమ్మనూరు నిర్వహించిన ర్యాలీలో కొంతసేపు కనిపించిన జితేంద్రగౌడ్ ఆ తర్వాత కనిపించకపోవడం గమనార్హం. పోలీసులపై గుమ్మనూరు కుమారుడి జులుం.. మద్యం, డబ్బు గుమ్మరించినా జనం రాకపోవడంతో గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ సహనం కోల్పోయాడు. పోలీసులపై జులుం ప్రదర్శించాడు. నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితోపాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని, అంతకంటే ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకోగా.. వారిపైనే దౌర్జన్యానికి దిగాడు. ‘నన్నే అడ్డుకుంటారా.. మీ కథేంటో త్వరలో చెప్తా’ అంటూ చిందులు తొక్కాడు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించాక తోక ముడిచాడు. పోలింగ్ కేంద్రాల పరిశీలన పెద్దపప్పూరు: మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన జూటూరు, చీమలవాగుపల్లి, నరసాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సోమవారం సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, ఎస్ఐ శరత్చంద్ర పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలను చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. -
విజయం మాదే: ఎమ్మెల్యే అనంత
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ర్యాలీలో భాగంగా గీతామందిరం సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు రూ.2 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనంతపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అప్పట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
Related News by category
-
No Headline
సాక్షి, పుట్టపర్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 4వ తేదీ (శనివారం) జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టేలా సీఎం సభ ఉండాలని నేతలు భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బి.నవీన్నిశ్చల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హిందూపురానికి వెళ్తారు. అక్కడ సభ అనంతరం హెలికాప్టర్లో పలమనేరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన.. హిందూపురం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ హెలిప్యాడ్ ఏర్పాటు కోసం ఎంజీఎం గ్రౌండ్ను పరిశీలించారు. ఎస్డీజీఎస్ కళాశాల గ్రౌండ్ను కూడా పరిశీలించి హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అధికారుల వెంట వైఎస్సార్ సీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కొండూరు వేణుగోపాల్రెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి, కొల్లకుంట ఆనంద్రెడ్డి తదితరులు ఉన్నారు. 11 గంటలకు హిందూపురం అంబేడ్కర్ సర్కిల్లో బహిరంగ సభ హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన చేసిన ఎస్పీ మాధవరెడ్డి, జేసీ అభిషేక్ కుమార్ -
రోజంతా ముచ్చెమటలు
అనంతపురం అగ్రికల్చర్: తగ్గేదేలే అన్నట్లుగా సూరీడు ప్రతాపం చూపిస్తుండటంతో ‘అనంత’ అగ్నిగోళంలా మండుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం జనజీవనానికి ఇబ్బందిగా మారుతోంది. భానుడి భగభగ లతో బెంబేలెత్తిపోతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీలు, రాత్రిళ్లు 27 నుంచి 32 డిగ్రీలకు ఎగబాకుతున్నాయి. గాలిలో తేమ ఉదయం 40 నుంచి 45 శాతం, మధ్యాహ్న సమయంలో 20 శాతానికి పడిపోతోంది. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న వడగాల్పులు జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాగల నాలుగు రోజులు మరింత వేడి.. రాగల నాలుగు రోజులు ఇలాగే ఉష్ణతాపం కొనసాగే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు రాయలసీమ జిల్లాల పరిధిలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవాలంటే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపారు. భానుడి భగభగలతో జనం బెంబేలు రాగల నాలుగు రోజులూ మరింత ఉష్ణతాపం -
స్వేచ్ఛగా ఓటు వేయండి : ఎస్పీ
అనంతపురం: ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గురువారం బీఎస్ఎఫ్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. పారదర్శక, ప్రశాంత ఎన్నికలే లక్ష్యమని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అంబేడ్కర్ కాలనీ వాసులకు ఓటు హక్కుపై చైతన్యం కలిగించారు. అనంతరం గౌసుల్ వారా వీధిలో ఉన్న మొరార్జీ మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. డీఎస్పీ జి.వీర రాఘవ రెడ్డి, బీఎస్ఎఫ్ అధికారి ధర్మేంద్రసింగ్, 14వ బెటాలియన్ డీఎస్పీ వెంకట రెడ్డి, సీఐలు రెడ్డప్ప, ధరణికిశోర్, నారాయణ రెడ్డి, జయంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బందోబస్తు పటిష్టంగా ఉండాలి బుక్కరాయసముద్రం: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. గురువారం బీకేఎస్, చెన్నంపల్లి, వెంకటాపురం, కేకే అగ్రహారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలను తరచూ సందర్శించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నార్పల/యల్లనూరు/పుట్లూరు: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. గురువారం నార్పల, యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మినారాయణ, జయ ప్రసాద్, సీఐలు శ్రీధర్, సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, ఎంపీడీఓ దస్తగిరి, ఈఓఆర్డీ రాముడు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ అనంతపురం ఎడ్యుకేషన్: ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ సేవలు ఇకపై ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్, అదనపు విద్యార్హతలు చేసేందుకు నేరుగా కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకుండా ఇంటి నుంచే సులభంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర కోర్సులు చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే లాగిన్ వివరాలు, రిజిస్ట్రేషన్ నంబరు ఎస్ఎంఎస్ ద్వారా, ఎంప్లాయిమెంట్ కార్డు లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళ్యాణి విజ్ఞప్తి చేశారు. న్యూస్రీల్ -
ప్రశాంత నగరి..‘పచ్చ’ గూండాగిరి
అనంతపురం: అనంతపురం నగరం ప్రశాంతతకు మారు పేరు. గొడవలు, కక్షలు, కార్పణ్యాలకు తావులేని ప్రాంతం. అలాంటి నగరంలో అలజడులు రేపేందుకు టీడీపీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారు. కాలనీల్లో ప్రజల మధ్య చిచ్చు రాజేసి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఎత్తుగడ వేస్తున్నారు. ఆయనకు టికెట్తోనే బీజం.. రాప్తాడులో వైఎస్సార్సీపీ నేత భూమి రెడ్డి ప్రసాద్ రెడ్డి హత్య కేసులో నిందితుడైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు అనంతపురం టీడీపీ టికెట్ కేటాయించడంతోనే అరాచక సంస్కృతికి బీజం పడినట్లయింది. టికెట్ ఖరారైన క్షణం నుంచే దగ్గుపాటి చుట్టూ రౌడీ షీటర్లు, హింసా ప్రవృత్తి గల వారు చేరిపోయారు. ఏకంగా రౌడీషీటర్లతోనే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఆయన తన వెంట నేరస్తులను తీసుకెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడిన నగరం రూరల్ పంచాయతీ పరిధిలో నాలుగు రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేత గుజ్జల నగేష్పై హత్యాయత్నం జరిగింది. మారణాయుధాలతో కిరాతకంగా నగేష్పై దాడి చేశారు. పచ్చ మూకలు పట్టపగలే సాగించిన ఈ వికృత క్రీడ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నగేష్ను కింద పడేసి కిరాతకంగా మారణాయుధాలతో దాడి చేస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరలైంది. ప్రధాన నిందితుడు దగ్గుపాటి అనుచరుడు.. నగేష్పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన జయరాం నాయుడు.. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు కావడం గమనార్హం. అనంత పురం రూరల్ పంచాయతీలో జయరాం నాయుడు భూ కబ్జాలకు అంతేలేదని ఆ ప్రాంతవాసులు చెబుతారు. పంచాయితీలు, దందాల్లో ఆరితేరిన వ్యక్తి అని తెలిపారు. ఈయనపై పోలీసుస్టేషన్లలో అనేక కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైఎస్సార్సీపీ నేత నగేష్పై జరిగిన హత్యాయత్నంలోనూ ఈయన కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైన ఆధారాలు కూడా లభించాయి. నగేష్పై కిరాతకంగా దాడి చేసిన నారాయణ స్వామి అలియాస్ పులితో జయరాం నాయుడు తరచూ ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. దాడికి అర గంట ముందు ఫోన్పే ద్వారా రూ.5 వేల నగదును నారాయణ స్వామికి జయరాం నాయుడు పంపినట్లు వెల్లడైంది. అలాంటి వ్యక్తికి అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ వంతపాడుతూ రెండు రోజుల క్రితం నగరంలో హల్చల్ చేయడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో మరెన్ని దారుణాలకు పచ్చ గూండాలు తెరలేపుతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. నేర ప్రవృత్తి గల వ్యక్తికి టికెట్ కేటాయించి అరాచకాలకు తెరతీసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో అరాచక సంస్కృతికి నాంది పలికిన టీడీపీ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బరితెగింపు అందులో భాగంగానే వైఎస్సార్ సీపీ నాయకుడు గుజ్జల నగేష్పై హత్యాయత్నం ప్రధాన నిందితుడు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు నేర ప్రవృత్తి గల వ్యక్తికి టికెట్ ఇచ్చిన చంద్రబాబుపై ప్రజల ఆగ్రహం
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019