Sakshi News home page

విజయం మాదే: ఎమ్మెల్యే అనంత

Published Tue, Apr 23 2024 8:40 AM

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అనంత, శంకరనారాయణను 
గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం - Sakshi

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ర్యాలీలో భాగంగా గీతామందిరం సమీపంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు రూ.2 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనంతపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్‌ సీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అప్పట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250