Sakshi News home page

తొలి రోజు ముగ్గురు

Published Tue, May 7 2024 3:10 AM

-

నల్లగొండ: వరంగల్‌– ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య ఒక్కో సెట్‌ నామినేషన్‌ వేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్లు సమర్పించారని నల్లగొండ కలెక్టర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు ప్రారంభం

Advertisement

homepage_300x250