Sakshi News home page

‘విద్యుత్‌’ పోస్టర్ల ఆవిష్కరణ

Published Tue, May 7 2024 3:10 AM

-

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): విద్యుత్‌ భద్రతా వారోత్సవాల పోస్టర్లను గురువారం సర్కిల్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి సబ్‌డివిజన్‌ ఓఅండ్‌ఎం, సర్కిల్‌ సిబ్బందికి విద్యుత్‌ ప్రమాదాలు–నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యుత్‌ ఎస్‌ఈ కె.రమేష్‌ మాట్లాడుతూ భద్రతా సూత్రాలను పాటిస్తూ ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆఫీసర్‌ ఇ.మురళి, నందయ్య, బి.వెంకటరత్నం, కె.వేణు, ఎండీ యాసిన్‌, పి.ప్రభాకర్‌, ఎ.రఘురామయ్య, పి.బుజ్జికన్నయ్య, హెచ్‌.దేవా, ఎస్‌కే రజియాబేగం, కె.పావని, కె.హరిత పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250