Sakshi News home page

స్వేచ్ఛ కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి

Published Tue, May 7 2024 5:25 AM

స్వేచ్ఛ కావాలంటే  కాంగ్రెస్‌కు ఓటేయండి

ఎంపీ అభ్యర్థి కడియం కావ్య

నయీంనగర్‌: దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తోందని, భవిష్యత్‌ తరాలకు స్వేచ్ఛా వాతావరణం కావాలంటే.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. గురువారం నయీంనగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ న్యాయవాదుల పరిచయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని, న్యాయవాదులు రాజ్యాంగానికి డాక్టర్లు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌, ఏఐసీసీ లీగల్‌ సెల్‌ కో–ఆర్డినేటర్‌ దామోదర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌ సెల్‌ మెంబర్స్‌ మహాత్మ, జగన్మోహన్‌రెడ్డి, వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ముదశిర్‌, హనుమకొండ బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ లడే శ్రీనివాస్‌, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ జయాకర్‌, నీలం శ్రీధర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250