శుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024
ఎల్కతుర్తి: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కలికట్టుగా, ఐక్యతతో కృషి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఆయన ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజల్ని చైతన్యపర్చాలని సూచించారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలుపునకు కృషి చేయాలని నాయకులకు కోరారు. అనంతరం రాష్ట్ర లారీ అసోసియేషన్ నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, నాయకులు సుకినె సంతాజీ, గోలి రాజేశ్వర్రావు, శనిగరం వెంకటేశ్, గుడెల్లి నవీన్, కడారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్