Sakshi News home page

తిరుమలలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

Published Fri, Apr 19 2024 1:40 AM

-

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సహస్రదీపాలంకారసేవ నిర్వహించారు. ఆ తరువాత శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం సుగ్రీవుడు, అంగధుడు ఉత్సవమూర్తులను వేంచేపు చేసి, వారితోపాటు ఆంజనేయస్వామివారికి పుష్పమాలలు సమర్పించారు.

Advertisement

homepage_300x250