Sakshi News home page

ఎన్నికల నియమావళి పాటించాలి

Published Fri, Apr 19 2024 1:40 AM

ఎన్నికల నియమావళి పత్రాలను 
విడుదల చేస్తున్న ఆర్వో  చంద్రముని - Sakshi

సూళ్లూరుపేట రూరల్‌: ఎన్నికల నియమావళిని అఽభ్యర్థులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల ఆర్వో చంద్రముని తెలిపారు. సూళ్లూరుపేట తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్‌ కమిషన్‌ అందజేసిన ఎన్నికల నియమావళి పత్రాలను ఆర్వో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులతో వచ్చే వ్యక్తులు నామినేషన్‌ కేంద్రం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 22వ తేదీలోపు సబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Advertisement

homepage_300x250