Sakshi News home page

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సమరోత్సాహం

Published Fri, Apr 19 2024 1:40 AM

వెంకటగిరి రూరల్‌ : పార్టీలో చేరిన కడగుంట టీడీపీ నేతలతో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి   - Sakshi

40 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక
150 కటుంబాలు చేరిక
టీడీపీకి టూలెట్‌ బోర్డు తప్పదు

నెరబైలు: వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: ఎర్రావారిపాళెం మండలం, నెరబైలు పంచాయతీ వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా మారుతోంది. పంచాయతీలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 20 కుటుంబాలు చేరాయి. గురువారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా చైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో గంటా నారాయణ, నాగేంద్రబాబు, రెడ్డెప్ప, చిరంజీవి, నాగులయ్య, సుబ్బయ్య, మణి, చిట్టిబాబు, ఎం.సుబ్బయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ పంచాయతీ అధ్యక్షులు హరినాథ్‌రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు నాగార్జున, తలకోన బోర్డ్‌ మెంబర్‌ జయంత్‌ పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు పంచాయతీ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు నాగోలు శ్రీనివాసులురెడ్డి సారథ్యంలో 40 కుటుంబాలకు పార్టీతీర్థం పుచ్చుకున్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెంచయ్య యాదవ్‌, పుల్లూరు చెంచురామిరెడ్డి, నెల్లూరు ప్రతాప్‌, ముండే వెంకటేష్‌, తాటిపర్తి కిరణ్‌కుమార్‌రెడ్డి, బుడతొట్టి చిరంజీవి, మనవాసి నరసింహయాదవ్‌, పుల్లూరు చెంగారెడ్డి, పాదం సునీల్‌, రాజు తదితరులు ఉన్నారు.

21వ వార్డులో 30 మంది చేరిక

శ్రీకాళహస్తి పట్టణంలోని 21వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు 30మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వెంకటగిరి రూరల్‌: బాలాయపల్లి వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ వెందోటి కార్తీక్‌రెడ్డి, బాలాయపల్లి వైస్‌ ఎంపీపీ వాన పార్వతి, సర్పంచ్‌ ఒప్పతొట్టి అంకయ్య ఆధ్వర్యంలో కడగుంట గ్రామం నుంచి సుమారు 150 కుటంబాలు వెంకటగిరిలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి రామ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. జేసీఎస్‌ కన్వీనర్‌ బాబిచౌదరి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరి కోటేశ్వరరెడ్డి, రామలచేను మాధవయ్య, సొడారం వజ్రం, వాన చినకాటయ్య, కృష్ణయ్య, ప్రసాద్‌, పెద్దగంగయ్య, నాగువులు, మేకల చిన్నయ్య, ఒప్పతొట్టి చిన అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

1/3

2/3

శ్రీకాళహస్తి : పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
3/3

శ్రీకాళహస్తి : పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

Advertisement

homepage_300x250