Sakshi News home page

జిల్లాకు అదనపు ఓటింగ్‌ యంత్రాలు

Published Tue, May 7 2024 1:45 PM

జిల్లాకు అదనపు ఓటింగ్‌ యంత్రాలు

ఆసిఫాబాద్‌అర్బన్‌: లోక్‌సభ ఎన్నికలకు సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ సిగ్మెంట్‌లకు అదనపు ఓటింగ్‌ యంత్రాలు వచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాంలో గురువారం అదనపు కలెక్టర్‌ దాసరి వేణు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్‌ యూనిట్లు, ఓటింగ్‌ యంత్రాల ప్రథమస్థాయి పరిశీ లన నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ర్యాండమైజేషన్‌ పూర్తయిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ప్రకారం బందోబస్తు మధ్య తరలిస్తామన్నారు. స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపర్చి 24 గంటలపాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, నాయబ్‌ తహసీల్దార్‌ జితేందర్‌, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250