Sakshi News home page

సమస్యలు తీర్చాలని మంత్రికి వినతి

Published Tue, May 7 2024 3:00 AM

సమస్యలు తీర్చాలని  మంత్రికి వినతి

బళ్లారి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థలు, ప్రైవేట్‌ రంగంలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు కర్ణాటక డ్రైవర్ల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డికి వివిధ సమస్యల పరిష్కారం కోసం గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రిని కలుసుకుని సమాఖ్య జిల్లాధ్యక్షుడు సయ్యద్‌ ఆజమ్‌ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రముఖులు మంత్రి రామలింగారెడ్డిని ఘనంగా సన్మానించారు. యూనియన్‌ సిరుగుప్ప తాలూకా అధ్యక్షుడు మెహబూబ్‌ బాషా, మించేరి గ్రామ నేతలు ముజావర్‌ ముల్లా, ఉపాధ్యక్షుడు అంథోనిరాజ్‌, జిల్లా కార్యదర్శి సుధాకర్‌, రాష్ట్ర మహిళ కార్యదర్శి కవితా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250