హొసపేటె: కర్ణాటక లోక్సభ సార్వత్రిక ఎన్నికలు–2024 పోలింగ్ మే 7న జరగనుంది. ఈ నేపథ్యంలో సెక్షన్– 144 ప్రకారం కొన్ని షరతులతో విజయనగర జిల్లా వ్యాప్తంగా 5న సాయంత్రం 6 గంటల నుంచి 8న ఉదయం 6 గంటల వరకు సీఆర్పీసీ–1973 ప్రకారం అమలులో ఉన్న ఇతర చట్టాల మేరకు నిషేధాజ్ఞలను అమలు చేయడానికి జిల్లాధికారి, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ ఎంఎస్ దివాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక లోక్సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను ప్రకటించింది. ఆ ప్రకారం మే 7న పోలింగ్ జరుగుతుంది. విజయనగర జిల్లాలో పోలింగ్ రోజున పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు, మోడల్ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్– 126, ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం షరతులు, అవసరాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఓటర్లను రకరకాల డిమాండ్లను విధించడం, బెదిరించడం, వారికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రేరేపించడం, పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించడం, వివిధ రవాణా మార్గాల ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు పిలిపించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఇతర అవాంఛనీయ సంఘటనల నివారణకు ఈ నిషేధాజ్ఞలను విధించినట్లు ఆయన తెలిపారు.
5 నుంచి 8 వరకు జిల్లాలో నిషేధాజ్ఞలు
విజయనగర జిల్లాధికారి దివాకర్ వెల్లడి